అన్వేషించండి

Lulu Lands Issue: ఇతర చోట్ల మాల్స్ కోసం భూములు కొంటున్న లూలు -ఏపీ ప్రభుత్వం చీప్‌గా ఎందుకివ్వాలి ?

Andhra Lulu: లూలు మాల్స్ వివాదం ఏపీలో పెరుగుతోంది. ఇతర చోట్ల వందల కోట్లు పెట్టి భూములు కొన్న లూలూ గ్రూప్.. ఏపీలో మాత్రం ప్రభుత్వ సబ్సిడీలతో ల్యాండ్ తీసుకుంటోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లూలూ గ్రూప్‌కు విశాఖ, విజయవాడలో ప్రభుత్వ భూములు లీజుకు ఇచ్చింది.
  • అహ్మదాబాద్‌లో మార్కెట్ ధరకు కొన్న లూలూ, ఏపీలో తక్కువ రేటుకు భూములు తీసుకుంటోంది.
  • ప్రభుత్వ భూములను లీజుకు ఇవ్వడంలో రివర్షన్ క్లాజ్ లేకపోవడం వివాదాస్పదంగా మారింది.
  • ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు ప్రభుత్వ భూముల కేటాయింపును వ్యతిరేకిస్తున్నాయి.

Lulu Mall Lands Issue:  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లూలూ గ్రూప్‌కు విశాఖపట్నం, విజయవాడలో ప్రధాన భూములు లీజ్‌పై అలాట్ చేయడం వెనుక భారీ సబ్సిడీలు, రివర్షన్ క్లాజ్‌లు లేకుండా  లీజ్‌లు ఇవ్వడం వంటి నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఇటీవలే అహ్మదాబాద్‌లో 519 కోట్ల రూపాయలకు 16 ఎకరాలు కొన్న లూలూ ఇంటర్నేషనల్ మాల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏపీలో మాత్రం ప్రభుత్వ భూములను 'సబ్సిడీ' రూపంలో తక్కువ రేట్‌లో తీసుకుంటూ, విలువైన ఆస్తులను కార్పొరేట్ లాభాలకు మార్చుకుంటోంది. 

అహ్మదాబాద్ డీల్ - మార్కెట్ రేట్‌కుకొనుగోలు

అహ్మదాబాద్‌లోని చంద్‌ఖేడా ప్రాంతంలో లూలూ గ్రూప్ 16.35 ఎకరాల ప్రధాన భూమిని 519.41 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.  ఈ డీల్ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (AMC)తో జరిగింది, ఇక్కడ లూలూ మాల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కెట్ రేట్‌లో పూర్తి చెల్లింపు చేసి, రికార్డు స్థాయి 31.16 కోట్ల రూపాయల స్టాంప్ డ్యూటీ చెల్లించింది. ఈ భూమిపై మెగా మాల్ నిర్మాణం ప్రణాళికలో ఉంది, ఇది గుజరాత్‌లోని రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు ఊపునిస్తోంది.  ఈ డీల్ ఏపీలో జరుగుతున్న అలాట్‌మెంట్‌లతో పోల్చితే పూర్తి భిన్నంగా ఉంది.  అహ్మదాబాద్‌లో ప్రభుత్వ సబ్సిడీలు లేకుండా, పూర్తి మార్కెట్ విలువతో కొనుగోలు చేసిన లూలూ, ఏపీలో మాత్రం ప్రభుత్వ భూములను తక్కువ రేట్‌లో లీజ్‌పై తీసుకుని, "సబ్సిడీ"లా మార్చుకుంటోంది.  

 ఏపీలో ల్యాండ్ అలాట్‌మెంట్: విశాఖ, విజయవాడలో సబ్సిడీలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 జులైలో జారీ చేసిన GO 137 ,,,,  GO 45 ప్రకారం, విశాఖపట్నంలో 13.74 ఎకరాలు, విజయవాడలో 4.15 ఎకరాలు APSRTC భూములను లూలూ గ్రూప్‌కు లీజ్‌పై అలాట్ చేసింది.  విశాఖలో భూములు హార్బర్ పార్క్ సమీపంలో, RK బీచ్ వద్ద ఉన్న ప్రధాన ప్రదేశాల్లో ఉన్నాయి. విలువ సుమారు 2,000 కోట్ల రూపాయలు ఉంటుంది. ఆంధ్రా టూరిజం ల్యాండ్ అలాట్‌మెంట్ పాలసీ 2024-29 ప్రకారం, 65 సంవత్సరాల లీజ్ (మరో 33 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు) ఇచ్చారు, కానీ రివర్షన్ క్లాజ్ (ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే భూమి తిరిగి ప్రభుత్వానికి) లేకపోవడం, తక్కువ రేట్  లో ఇవ్వడం వంటి అంశాలు వివాదానికి కారణమయ్యాయి. విజయవాడలో మాల్ ప్రాజెక్టుకు 1,222 కోట్ల పెట్టుబడి ప్రకటించినప్పటికీ, భూమి అలాట్‌మెంట్‌లో పారదర్శకత లేకపోవడం వల్ల ప్రజలు, రైతు సంఘాలు నిరసనలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులు 10,000 ఉద్యోగాలు సృష్టిస్తాయని ప్రభుత్వం చెప్పినా ఆ ఉద్యోగాలు ఎవరికిస్తారన్నదానిపైనా విమర్శలు ఉన్నాయి. 

ప్రజల్లో చర్చనీయాంశం  

వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు ఈ ల్యాండ్ అలాట్‌మెంట్ ను వ్యతిరేకిస్తున్నాయి.  విజయవాడ భూమిని ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. APSRTC ఎంప్లాయీస్ యూనియన్లు GO 137ను వ్యతిరేకిస్తూ, RTC భూములు మాల్‌లకు మార్చడం వల్ల పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ బలహీనపడుతుందని హెచ్చరించాయి. సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్లు విజగ్‌లో 14 ఎకరాల ప్రైమ్ ల్యాండ్‌ను ఉచితంగా ఇవ్వడాన్ని "ప్రభుత్వ అనైతికత"గా అభివర్ణించాయి.   "లూలూ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ ఇస్తాయి" అని ప్రభుత్వం వాదిస్తోంది. 

ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పడం లేదు ?  

అహ్మదాబాద్‌లో మార్కెట్ రేట్‌లో పెట్టుబడి చేసిన లూలూ, ఏపీలో సబ్సిడీలతో భూములు తీసుకోవడం వల్ల "డబుల్ స్టాండర్డ్" ఆరోపణలు ఎదుర్కొంటోంది. YSRCP, CPI(M)లు రద్దు డిమాండ్ చేస్తుంటే, TDP ప్రభుత్వం "ఉద్యోగాలు, పెట్టుబడి"ని హైలైట్ చేస్తోంది. పరిశ్రమలకు అంటే సరే..కానీ మాల్స్ కు కూడా భూమిని ఎందుకు సబ్సిడీకి ఇవ్వాలన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పుడు బడా కంపెనీలు విశాఖకు వస్తున్నందున.. ఆ భూమిని వేలం వేస్తే..  కంపెనీలు కొనుగోలు చేసి  పెద్ద మాల్స్ నిర్మిస్తాయని అంటున్నారు. ప్రభుత్వం ఇలాంటి వాటికి సమాధానం చెప్పకపోతే.. లూలుతో కుమ్మక్కయ్యారని ప్రజలు అనుకునే అవకాశం ఉంది.  

టాప్ హెడ్ లైన్స్

Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు - 3,168 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ - చేనేతలకు నేతన్న భరోసా !
ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు - 3,168 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ - చేనేతలకు నేతన్న భరోసా !
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Junk Food Ban in Schools: స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
Shivani Nagaram: శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Euphoria OTT : నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
Embed widget