అన్వేషించండి

Nara Lokesh: నాలుగు గంటల్లో నాలుగువేల మంది సమస్యల పరిష్కారం - ప్రజాదర్బార్‌‌లలో నారా లోకేష్ రికార్డ్

Nara Lokesh Prajadarbar: నారా లోకేష్ నాలుగు గంటల పాటు నాలుగు వేల మంది ప్రజల సమస్యలు విన్నారు. 70వ రోజు ప్రజాదర్బార్‌ను టీడీపీ ఆఫీసులో నిర్వహించారు.

Nara Lokesh Prajadarbar four hours: టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 70వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ ను కలిసి సమస్యలు చెప్పుకునేందుకు పెద్దఎత్తున ప్రజలు, కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి తరలివచ్చారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి నారా లోకేష్.. వారి నుంచి వినతులు స్వీకరించారు. నాలుగు గంటల పాటు దాదాపు 4 వేలమందికి పైగా కలిసి వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ప్రతి విజ్ఞప్తిని పరిశీలించి సిబ్బందికి అప్పటికప్పుడే ఆదేశాలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వంలో అందరికీ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 
 
తన భూమిని బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఇచ్ఛాపురం మండలం బుడ్డేపుపేట గ్రామానికి చెందిన దనపాన హరికృష్ణ మంత్రి నారా లోకేష్ ను కలిసి  వినతిపత్రం ఇచ్చారు.  తనకు వారసత్వంగా సంక్రమించిన వ్యవసాయ భూమిని తప్పుడు పత్రాలతో కబ్జా చేసేందుకు వైసీపీ కార్యకర్త  యత్నిస్తున్నారని గుంటూరు జిల్లా కాకుమాను గ్రామానికి చెందిన  రవిబాబు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  గెస్ట్ లెక్చరర్ గాపని చేస్తున్న   తనను వైసీపీ హయాంలో విధుల నుంచి తొలగించారని, తిరిగి తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఉలిద్ర రవి మంత్రి నారా లోకేష్ ను కలిసి విన్నవించారు.  

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలోని పారామెడికల్ విభాగంలో ఖాళీగా ఉన్న హెల్త్ అసిస్టెంట్ మేల్ పోస్టుల భర్తీకి తగిన చర్యలు తీసుకోవాలని అన్ ఎంప్లాయిస్ పారా మెడికల్ హెల్త్ అసిస్టెంట్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. టీడీపీ పాలనలో ఎంపీహెచ్ ఏ మేల్ పోస్టులను భర్తీ చేశారు. గత కొన్నేళ్లుగా హెల్త్ అసిస్టెంట్ మేల్ పోస్టులకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.   శ్రీశైలం ఐటీడీఏ(పీటీజీ) చెంచు ప్రాజెక్ట్ కార్యాలయం పరిధిలోని ప్రకాశం జిల్లా అటవీ ప్రాంతంలోని గిరిజన చెంచు, ఆదివాసి గూడెంల్లో గిరిజన సంక్షేమ శాఖ ద్వారా నూతన పాఠశాలల మంజూరుకు తగిన చర్యలు తీసుకోవాలని నల్లమల గిరిజన చెంచు(పీటీజీ) సంక్షేమ సంఘం ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.  

ఏపీ జెన్ కో, ట్రాన్స్ కో, డిస్కమ్స్ లో పనిచేస్తున్న సుమారు 23,500 మంది కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్ర రాష్ట్ర పవర్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. వేతన సవరణ చేయడంతో పాటు ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరారు.  రోడ్డు ప్రమాదంలో గాయపడి తీవ్ర అనారోగ్యం పాలైన తనకు సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్యసాయం అందించి ఆదుకోవాలని చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం కన్నికాపురం గ్రామానికి చెందిన కె.ప్రకాశ్ బాబు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.   చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో  సైన్స్, ఆర్ట్స్, ఒకేషనల్ కోర్సులతో కూడిన ప్రభుత్వ జూనియర్ కాలేజీని ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంతానికి చెందిన బి.ఎమ్ కిషోర్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదివేందుకు విద్యార్థులు సుదూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, దీంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప 

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ కొత్తూరు తాడేపల్లిలో విలువైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన గరిమెళ్ల అనిల్ కుమార్ మంత్రి నారా లోకేష్ ను కలిసి ఫిర్యాదు చేశారు. విజయవాడ-విసన్నపేట ఆర్ అండ్ బీ రోడ్డును ఆక్రమించి ఆక్రమణదారులు భారీ కట్టడాలు నిర్మిస్తున్నారని, అక్రమ నిర్మాణాలు తొలగించాలని అధికారులకు పలుమార్లు ఫిర్యాదుచేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యలన్నింటినీ సమీక్షించేందుకు ప్రత్యేకంగా అధికారుల టీమ్ ను ఏర్పాటు చేస్తున్నారు 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Slams Revanth Reddy: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Advertisement

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Slams Revanth Reddy: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Hyderabad Old City: మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
Draupathi 2 Movie : 'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
Embed widget