అన్వేషించండి

ఏపీలో కరెంట్ తీగలపై బట్టలారేస్తున్నారు, తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి వ్యంగ్యాస్త్రాలు

ఏపీలో పరిస్థితులపై తెలంగాణ మంత్రులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మొన్న కేటీఆర్, నిన్న హరీశ్ రావు, నేడు ఎర్రబెల్లి దయాకర రావు...ఒకరి తర్వాత ఒకరు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఏపీలో పరిస్థితులపై తెలంగాణ మంత్రులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మొన్న కేటీఆర్, నిన్న హరీశ్ రావు, నేడు ఎర్రబెల్లి దయాకర రావు...ఒకరి తర్వాత ఒకరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీలోని విద్యుత్ కోతలు, భూముల ధరలపై మంత్రి ఎరబెల్లి దయాకరరావు హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ వస్తే...కరెంట్ ఉండదని గతంలో ముఖ్యమంత్రులుగా పని చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి...అసెంబ్లీ అన్న వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేశారు.  ప్రస్తుతం తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇస్తుంటే.. ఏపీలో మాత్రం కరెంట్ లేక బట్టలు ఆరేసుకుంటున్నారని అన్నారు.  తెలంగాణలో భూముల ధరలు పెరిగితే.. ఆంధ్రప్రేదశ్ లో మాత్రం భారీగా పడిపోయాయని ఆరోపించారు.

వరంగల్ జిల్లా సంగం మండలంలో రూ.26 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి ఎర్రబెల్లి శంకుస్థాపన చేశారు. అరవై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబడిందని విమర్శించారు. సీఎం కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే.. ఏపీలో వంద ఎకరాలు కొనుగోలు చేయవచ్చనన్నారు ఎర్రబెల్లి. కేసీఆర్ పాలనలో తెలంగాణ సస్యశ్యామలమైందని, కరెంట్, నీటి సమస్య తీరిందని...కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలంతా అండగా ఉండాలని సూచించారు. దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అభివృద్ది చేసింది ఏమీ లేదని, వాళ్లు చేసిన పాపాలను కడుక్కోవడానికి సరిపోతుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ఒక విజన్ లేదన్న ఎర్రబెల్లి...ఆ పార్టీ నేతలకు బుద్ది లేదన్నారు. బీజేపీ బోగస్ పార్టీగా మారిపోయిందని ఎర్రబెల్లి...రాష్ట్రంలో ఆ పార్టీ సీట్లు గెలిచే అవకాశమే లేదన్నారు. 

గతంలో హరీష్‌రావు కూడా ఏపీలో విద్యుత్ కోతలపై విమర్శలు చేశారు. ఏపీలో ఆరు గంట‌ల పాటు క‌రెంట్ కోత‌లున్నాయ‌ని, తెలంగాణ‌లో రెప్ప‌పాటు పవర్ పోవడం లేదన్నారు మంత్రి హరీశ్ రావు. ప‌క్క‌న వున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోజూ ఆరు గంట‌ల పాటు క‌రెంట్ క‌ట్ చేస్తున్నారని...ఉదయం 3 గంట‌లు, సాయంత్రం 3 గంట‌లు క‌రెంట్ పోతోందని గుర్తు చేశారు. అటు ప‌క్క‌న చ‌త్తీస్‌గ‌ఢ్‌లోనూ రోజూ ఆరు గంట‌ల క‌రెంట్ కోత అమలవుతోందని మంత్రి చెప్పారు. దేశం మొత్తం క‌రెంట్ కోత‌లున్న‌ాయని.. పవర్ కట్ లేకుండా 24 గంట‌ల పాటు విద్యుత్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణయేనని హరీశ్ రావు పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కోతలే లేవని ప్రభుత్వం చెబుతోంది. నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా జరుగుతుందని, రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలు ప్రకటించాయి. సెప్టెంబర్‌ 15వ తేదీ వరకు స్వల్పకాలిక మార్కెట్‌ నుంచి రోజుకి దాదాపు 40 మిలియన్‌ యూనిట్లు ప్రతి యూనిట్‌ కు రూ  9.10 వెచ్చించి కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. 

 అన్నిరంగాలకు ఎలాంటి కోతలు, పరిమితులు లేకుండా నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేసినట్లు విద్యుత్‌ పంపిణీ సంస్థలు ప్రకటించాయి. ఈనెల ఒకటో తేదీన డిమాండు  సరఫరా మధ్య స్వల్ప అంతరం ఏర్పడిన సమయంలో పారిశ్రామిక రంగానికి స్వల్పంగా విద్యుత్‌ సరఫరా తగ్గించి గృహ, వ్యవసాయ వినియోగదారులకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు డిస్కంలు స్పష్టం చేశాయి. ఆదివారం మొత్తం 206.5 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ సరఫరా జరిగిందని, రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్‌ సరఫరాలో ఏ విధమైన  అంతరాయాలు కానీ లోడ్‌ షెడ్డింగ్‌ కానీ లేదని స్పష్టం చేశారు. 

సెప్టెంబర్‌ 1వ తేదీన రాష్ట్రంలో నెలకొన్న గ్రిడ్‌ డిమాండ్‌ – సరఫరా  పరిస్థితులను బట్టి పారిశ్రామిక రంగానికి కొద్దిమేర విద్యుత్‌ సరఫరా తగ్గించి, ప్రాధాన్యతా రంగాలైన గృహ, వ్యవసాయ రంగాలను ప్రాధాన్యం ఇచ్చి అంతరాయాలు లేకుండా విద్యుత్‌ సరఫరా చేసినట్లు పేర్కొన్నాయి. వ్యవసాయ, గృహ వినియోగ రంగాలను పాధాన్యతా రంగాలుగా పరిగణించి అంతరాయాలు లేని విద్యుత్‌ సరఫరా చేయాలని  విద్యుత్‌ సంస్థలు భావించినట్లుగా తెలిపారు.

ఇందులో భాగంగానే డిమాండు ఎక్కువగా ఉన్నప్పుడు పరిశ్రమలకు కొంత మేరకు సరఫరా తగ్గించి వ్యవసాయ, గృహ వినియోగదారులకు పూర్తిస్థాయిలో విద్యుత్‌ సరఫరా చేస్తామని  విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌ కు డిస్కింలు తమ అభ్యర్ధన పంపాయి. విద్యుత్‌ పంపిణీ సంస్థల అభ్యర్ధన  మేరకు రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి సెప్టెంబర్ 2న ఈనెల 5 వ తేదీ నుంచి  రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి  స్వల్పంగా  విద్యుత్‌ వాడకంలో పరిమితులు విధించవచ్చని  ఆదేశాలు ఇచ్చారు. 

టాప్ హెడ్ లైన్స్

Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
స్పీడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్‌.. కొత్త 2027 కవాసాకి నింజా 300 వచ్చేసింది, అప్పుడే డెలివరీలు కూడా ప్రారంభం
2027 కవాసాకి నింజా 300 ఎంట్రీ.. యూత్‌ కోసం స్మూత్‌ థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, పవర్‌లో తగ్గేదేలే!
Fridge Water : వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Embed widget