అన్వేషించండి

Khammam: వివాదాల్లో ఖమ్మం ఖాకీలు- విపక్షాలతో రోజూ డిష్యం డిష్యం

ఖమ్మంలో ఖాకీలు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు. యాక్టివ్‌గా ఉండే నాయకులను కావాలనే టార్గెట్ చేస్తున్నారని కేసుల పేరుతో వేధిస్తున్నారని విమర్శిస్తున్నాయి.

ఖమ్మం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. బీజేపీ కార్యకర్త సాయిగణేష్‌ ఆత్మహత్యతో ఇప్పుడు ఖాకీలకు విపక్షాలకు మధ్య పెద్ద గ్యాప్‌ ఏర్పడినట్లు తెలుస్తోంది. పింక్‌ పోలీస్‌లు అనే నినాదంతో బీజేపీ బహిరంగంగా విమర్శలు చేస్తుండగా మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ సైతం అదే స్టైల్‌లో విరుచుకుపడుతోంది. తాజాగా ఖమ్మం ఏసీపీపై కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చేసిన విమర్శలు అందుకు ఉదాహరణగా మారుతున్నాయి. 
 

బీజేపీ కార్యకర్త సాయిగణేష్‌ ఆత్మహత్య తర్వాత విపక్షాలు ఇంతగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తోపాటు పోలీసులపై విమర్శలు చేసేందుకు అనేక కారణాలు ఉన్నాయి. సాధారణంగా ఏ ప్రభుత్వం ఉనప్పటికీ ఆ ప్రభుత్వానికి సంబంధించిన ప్రజాప్రతినిధులకు, ఆ పార్టీకి అటు అధికారులు, పోలీసులు కొంత మేరకు సానుకూలంగా ఉండటం సహజం. అయితే ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా అదే తీరు ఉంటుంది. అయితే ఇది కాస్తా శృతిమించడం వల్లే విపక్షాలు ఇలా విమర్శలు చేస్తున్నాయనే తెలుస్తోంది. ఖమ్మం నగరంలో పనిచేసే పోలీసులు విపక్ష నాయకుల పట్ల ఏక పక్షంగా వ్యవహరించడం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి నెలకొందని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు.

మాట వినకపోతే రౌడీషీటే..?
ప్రతిపక్షాలకు సంబంధించిన ఎవరైనా చురుగ్గా ఉంటే వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు అవసరమైతే రౌడీషీట్లు ఓపెన్‌ చేయడంలో పోలీసులు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాయిగణేష్‌ ఆత్మహత్యకు ముందు కూడా ఇలాంటి సంఘటనలు అందుకు నిదర్శనంగా పలువురు చెబుతున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ నుంచి తన భార్యను కార్పోరేటర్‌గా గెలిపించుకున్న ముస్తఫాపై కావాలనే పోలీసులు వేధింపులకు పాల్పడ్డారని, పీడీ యాక్ట్‌ నమోదు చేసి ఆరు నెలలపాటు జైలుకు పంపారని ఆ పార్టీకి చెందిన నాయకులు పేర్కొంటున్నారు. దీంతోపాటు రఘునాథపాలెం మండలంలో అక్రమ క్వారీల విషయంపై పోరాటం చేసిన కుల సంఘాల నాయకుడు భద్రునాయక్‌పై రౌడీషీట్‌ తెరవడం అప్పట్లో చర్చానీయాంశంగా మారింది.

అయితే ఈ రెండు ఉదంతాలు సైతం రాజకీయ ఒత్తిడి వల్లే జరిగాయని ప్రతిపక్షాలు విమర్శలు చేశారు. తాజాగా బీజేపీకి చెందిన సాయిగణేష్‌ ఆత్మహత్యకు పాల్పడటంతో ఇప్పుడు పోలీసులపై విపక్షాలు విమర్శలకు పాల్పడుతున్నారు. తాజాగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఇద్దరు నాయకులపై ఖమ్మం ఏసీపీ రామాంజనేయులు ప్రెస్‌మీట్‌ పెట్టి విమర్శలు చేయడంతో ఆ పార్టీ జిల్లా నాయకత్వం సీరియస్‌గా తీసుకుంది. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు కేసులు సర్వసాధారణమేనని అయితే ఏకపక్ష నిర్ణయాలతో అతివేధింపులకు పాల్పడటం వల్లే ఖమ్మం నగరంలో ఇప్పుడు పోలీసులకు విపక్షాలకు మధ్య భారీ గ్యాప్‌ ఏర్పడినట్లు తెలుస్తోంది.

పార్టీ ఫిరాయింపుల టైంలో సైతం ఈ పోలీస్‌ కేసులను ఎక్కువగా వినియోగించుకున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు ఇలా ఏకపక్షంగా ఉండటం ఏమిటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుండగా తమ విధులు తాము నిర్వహిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఖమ్మంలో ఖాకీలకు విపక్షాలకు మధ్య ఏర్పడిన గ్యాప్‌ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget