అన్వేషించండి

Khammam: వివాదాల్లో ఖమ్మం ఖాకీలు- విపక్షాలతో రోజూ డిష్యం డిష్యం

ఖమ్మంలో ఖాకీలు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు. యాక్టివ్‌గా ఉండే నాయకులను కావాలనే టార్గెట్ చేస్తున్నారని కేసుల పేరుతో వేధిస్తున్నారని విమర్శిస్తున్నాయి.

ఖమ్మం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. బీజేపీ కార్యకర్త సాయిగణేష్‌ ఆత్మహత్యతో ఇప్పుడు ఖాకీలకు విపక్షాలకు మధ్య పెద్ద గ్యాప్‌ ఏర్పడినట్లు తెలుస్తోంది. పింక్‌ పోలీస్‌లు అనే నినాదంతో బీజేపీ బహిరంగంగా విమర్శలు చేస్తుండగా మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ సైతం అదే స్టైల్‌లో విరుచుకుపడుతోంది. తాజాగా ఖమ్మం ఏసీపీపై కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చేసిన విమర్శలు అందుకు ఉదాహరణగా మారుతున్నాయి. 
 

బీజేపీ కార్యకర్త సాయిగణేష్‌ ఆత్మహత్య తర్వాత విపక్షాలు ఇంతగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తోపాటు పోలీసులపై విమర్శలు చేసేందుకు అనేక కారణాలు ఉన్నాయి. సాధారణంగా ఏ ప్రభుత్వం ఉనప్పటికీ ఆ ప్రభుత్వానికి సంబంధించిన ప్రజాప్రతినిధులకు, ఆ పార్టీకి అటు అధికారులు, పోలీసులు కొంత మేరకు సానుకూలంగా ఉండటం సహజం. అయితే ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా అదే తీరు ఉంటుంది. అయితే ఇది కాస్తా శృతిమించడం వల్లే విపక్షాలు ఇలా విమర్శలు చేస్తున్నాయనే తెలుస్తోంది. ఖమ్మం నగరంలో పనిచేసే పోలీసులు విపక్ష నాయకుల పట్ల ఏక పక్షంగా వ్యవహరించడం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి నెలకొందని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు.

మాట వినకపోతే రౌడీషీటే..?
ప్రతిపక్షాలకు సంబంధించిన ఎవరైనా చురుగ్గా ఉంటే వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు అవసరమైతే రౌడీషీట్లు ఓపెన్‌ చేయడంలో పోలీసులు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాయిగణేష్‌ ఆత్మహత్యకు ముందు కూడా ఇలాంటి సంఘటనలు అందుకు నిదర్శనంగా పలువురు చెబుతున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ నుంచి తన భార్యను కార్పోరేటర్‌గా గెలిపించుకున్న ముస్తఫాపై కావాలనే పోలీసులు వేధింపులకు పాల్పడ్డారని, పీడీ యాక్ట్‌ నమోదు చేసి ఆరు నెలలపాటు జైలుకు పంపారని ఆ పార్టీకి చెందిన నాయకులు పేర్కొంటున్నారు. దీంతోపాటు రఘునాథపాలెం మండలంలో అక్రమ క్వారీల విషయంపై పోరాటం చేసిన కుల సంఘాల నాయకుడు భద్రునాయక్‌పై రౌడీషీట్‌ తెరవడం అప్పట్లో చర్చానీయాంశంగా మారింది.

అయితే ఈ రెండు ఉదంతాలు సైతం రాజకీయ ఒత్తిడి వల్లే జరిగాయని ప్రతిపక్షాలు విమర్శలు చేశారు. తాజాగా బీజేపీకి చెందిన సాయిగణేష్‌ ఆత్మహత్యకు పాల్పడటంతో ఇప్పుడు పోలీసులపై విపక్షాలు విమర్శలకు పాల్పడుతున్నారు. తాజాగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఇద్దరు నాయకులపై ఖమ్మం ఏసీపీ రామాంజనేయులు ప్రెస్‌మీట్‌ పెట్టి విమర్శలు చేయడంతో ఆ పార్టీ జిల్లా నాయకత్వం సీరియస్‌గా తీసుకుంది. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు కేసులు సర్వసాధారణమేనని అయితే ఏకపక్ష నిర్ణయాలతో అతివేధింపులకు పాల్పడటం వల్లే ఖమ్మం నగరంలో ఇప్పుడు పోలీసులకు విపక్షాలకు మధ్య భారీ గ్యాప్‌ ఏర్పడినట్లు తెలుస్తోంది.

పార్టీ ఫిరాయింపుల టైంలో సైతం ఈ పోలీస్‌ కేసులను ఎక్కువగా వినియోగించుకున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు ఇలా ఏకపక్షంగా ఉండటం ఏమిటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుండగా తమ విధులు తాము నిర్వహిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఖమ్మంలో ఖాకీలకు విపక్షాలకు మధ్య ఏర్పడిన గ్యాప్‌ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Bhadrachalam Temple: 3 దశలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
3 దశలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
Telangana Indiramma Family Life Insurance Scheme : తెలంగాణ ప్రజలందరికీ టెర్మ్‌ ఇన్సూరెన్స్‌! రేవంత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తారా !
తెలంగాణ ప్రజలందరికీ టెర్మ్‌ ఇన్సూరెన్స్‌! రేవంత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తారా !
Telangana Budget 2026-27: తెలంగాణ బడ్జెట్‌ 2026-27లో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం! 
తెలంగాణ బడ్జెట్‌ 2026-27లో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం! 

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AMNS Steel Plant in Anakapalli: నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
Telangana News: భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు.. హైరైజ్ బిల్డింగ్స్‌ సహా టీడీఆర్‌తో అదనపు వెసులుబాట్లు
తెలంగాణలో భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు.. హైరైజ్ బిల్డింగ్స్‌ సహా టీడీఆర్‌తో అదనపు వెసులుబాట్లు
YS Jagan: తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
Tamil Nadu Assembly Elections: తమిళనాడు కూటముల్లో సీట్ల కేటాయింపు సర్కస్ - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులంతా విజయ్ గూటికే !
తమిళనాడు కూటముల్లో సీట్ల కేటాయింపు సర్కస్ - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులంతా విజయ్ గూటికే !
AP Rains Alert: ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
Bihar CM: బిహార్ కొత్త సీఎంగా తెరపైకి నిశాంత్ కుమార్! నితీష్ కుమార్ సోదరుడి డిమాండ్.. ఇంతకీ ఎవరతను
బిహార్ కొత్త సీఎంగా తెరపైకి నిశాంత్ కుమార్! నితీష్ కుమార్ సోదరుడి డిమాండ్.. ఇంతకీ ఎవరతను
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
భారత్‌లో కొత్త Skoda Kushaq Facelift లాంచింగ్.. క్రెటా, డస్టర్‌లకు గట్టి పోటీ తప్పదు
భారత్‌లో కొత్త Skoda Kushaq Facelift లాంచింగ్.. క్రెటా, డస్టర్‌లకు గట్టి పోటీ తప్పదు
Embed widget