అన్వేషించండి

Khammam: వివాదాల్లో ఖమ్మం ఖాకీలు- విపక్షాలతో రోజూ డిష్యం డిష్యం

ఖమ్మంలో ఖాకీలు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు. యాక్టివ్‌గా ఉండే నాయకులను కావాలనే టార్గెట్ చేస్తున్నారని కేసుల పేరుతో వేధిస్తున్నారని విమర్శిస్తున్నాయి.

ఖమ్మం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. బీజేపీ కార్యకర్త సాయిగణేష్‌ ఆత్మహత్యతో ఇప్పుడు ఖాకీలకు విపక్షాలకు మధ్య పెద్ద గ్యాప్‌ ఏర్పడినట్లు తెలుస్తోంది. పింక్‌ పోలీస్‌లు అనే నినాదంతో బీజేపీ బహిరంగంగా విమర్శలు చేస్తుండగా మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ సైతం అదే స్టైల్‌లో విరుచుకుపడుతోంది. తాజాగా ఖమ్మం ఏసీపీపై కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చేసిన విమర్శలు అందుకు ఉదాహరణగా మారుతున్నాయి. 
 

బీజేపీ కార్యకర్త సాయిగణేష్‌ ఆత్మహత్య తర్వాత విపక్షాలు ఇంతగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తోపాటు పోలీసులపై విమర్శలు చేసేందుకు అనేక కారణాలు ఉన్నాయి. సాధారణంగా ఏ ప్రభుత్వం ఉనప్పటికీ ఆ ప్రభుత్వానికి సంబంధించిన ప్రజాప్రతినిధులకు, ఆ పార్టీకి అటు అధికారులు, పోలీసులు కొంత మేరకు సానుకూలంగా ఉండటం సహజం. అయితే ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా అదే తీరు ఉంటుంది. అయితే ఇది కాస్తా శృతిమించడం వల్లే విపక్షాలు ఇలా విమర్శలు చేస్తున్నాయనే తెలుస్తోంది. ఖమ్మం నగరంలో పనిచేసే పోలీసులు విపక్ష నాయకుల పట్ల ఏక పక్షంగా వ్యవహరించడం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి నెలకొందని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు.

మాట వినకపోతే రౌడీషీటే..?
ప్రతిపక్షాలకు సంబంధించిన ఎవరైనా చురుగ్గా ఉంటే వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు అవసరమైతే రౌడీషీట్లు ఓపెన్‌ చేయడంలో పోలీసులు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాయిగణేష్‌ ఆత్మహత్యకు ముందు కూడా ఇలాంటి సంఘటనలు అందుకు నిదర్శనంగా పలువురు చెబుతున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ నుంచి తన భార్యను కార్పోరేటర్‌గా గెలిపించుకున్న ముస్తఫాపై కావాలనే పోలీసులు వేధింపులకు పాల్పడ్డారని, పీడీ యాక్ట్‌ నమోదు చేసి ఆరు నెలలపాటు జైలుకు పంపారని ఆ పార్టీకి చెందిన నాయకులు పేర్కొంటున్నారు. దీంతోపాటు రఘునాథపాలెం మండలంలో అక్రమ క్వారీల విషయంపై పోరాటం చేసిన కుల సంఘాల నాయకుడు భద్రునాయక్‌పై రౌడీషీట్‌ తెరవడం అప్పట్లో చర్చానీయాంశంగా మారింది.

అయితే ఈ రెండు ఉదంతాలు సైతం రాజకీయ ఒత్తిడి వల్లే జరిగాయని ప్రతిపక్షాలు విమర్శలు చేశారు. తాజాగా బీజేపీకి చెందిన సాయిగణేష్‌ ఆత్మహత్యకు పాల్పడటంతో ఇప్పుడు పోలీసులపై విపక్షాలు విమర్శలకు పాల్పడుతున్నారు. తాజాగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఇద్దరు నాయకులపై ఖమ్మం ఏసీపీ రామాంజనేయులు ప్రెస్‌మీట్‌ పెట్టి విమర్శలు చేయడంతో ఆ పార్టీ జిల్లా నాయకత్వం సీరియస్‌గా తీసుకుంది. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు కేసులు సర్వసాధారణమేనని అయితే ఏకపక్ష నిర్ణయాలతో అతివేధింపులకు పాల్పడటం వల్లే ఖమ్మం నగరంలో ఇప్పుడు పోలీసులకు విపక్షాలకు మధ్య భారీ గ్యాప్‌ ఏర్పడినట్లు తెలుస్తోంది.

పార్టీ ఫిరాయింపుల టైంలో సైతం ఈ పోలీస్‌ కేసులను ఎక్కువగా వినియోగించుకున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు ఇలా ఏకపక్షంగా ఉండటం ఏమిటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుండగా తమ విధులు తాము నిర్వహిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఖమ్మంలో ఖాకీలకు విపక్షాలకు మధ్య ఏర్పడిన గ్యాప్‌ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పోక్సో కేసుల్లో వెంటనే FIR నమోదు చేయండి: తెలంగాణ సీఎంకు పవన్ లేఖ
పోక్సో కేసుల్లో వెంటనే FIR నమోదు చేయండి: తెలంగాణ సీఎంకు పవన్ లేఖ
Kaleshwaram Project: కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
Telangana Latest News: 9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
Gadchiroli News: గడ్చిరోలిలో మావోయిస్టుల కరపత్రాల కలకలం! మైనింగ్‌ ఆపాలని డిమాండ్! సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్! 
గడ్చిరోలిలో మావోయిస్టుల కరపత్రాల కలకలం! మైనింగ్‌ ఆపాలని డిమాండ్! సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
Telangana Gurukulam Funds Scam: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
CM Chandrababu Naidu Speech: ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
Jana Nayagan Release Date : జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
Ek Din OTT : ఓటీటీలోకి వచ్చేసిన సాయి పల్లవి బాలీవుడ్ మూవీ - ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేసిన సాయి పల్లవి బాలీవుడ్ మూవీ - ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Fake IAS Officer Wedding Fraud: ఐఏఎస్ అంటే ఎగిరి గంతేసి పెళ్లి చేసుకున్నాడు - శోభనం నైటే కోటి నగలతో జంప్ - పాపం పెళ్లికొడుకు !
ఐఏఎస్ అంటే ఎగిరి గంతేసి పెళ్లి చేసుకున్నాడు - శోభనం నైటే కోటి నగలతో జంప్ - పాపం పెళ్లికొడుకు !
Pawan Kalyan: సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
Mudragada Padmanabham Funeral:ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
Embed widget