అన్వేషించండి

Mulugu News: ములుగు ఎస్పీని కలిసిన ఈశాన్య రాష్ట్రాల విద్యార్థి ప్రతినిధుల బృందం

Mulugu News: దేశాభివృద్ధి యువతతోనే సాధ్యమని, ఉన్నత లక్ష్యాలతో సత్ప్రవర్తన కలిగి ఉండి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ములుగు జిల్లా ఎస్పీ గాష్ ఆలం సూచించారు.

యువతతోనే దేశాభివృద్ధి.. జిల్లా ఎస్పీ గాష్ ఆలం
- ములుగు జిల్లాలో పర్యటించిన 27మంది ఈశాన్య రాష్ర్టాల యువత
- రామప్ప సందర్శన, జిల్లా ఎస్పీతో ఇంటరాక్షన్

ములుగు : దేశాభివృద్ధి యువతతోనే సాధ్యమని, ఉన్నత లక్ష్యాలతో సత్ప్రవర్తన కలిగి ఉండి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ములుగు జిల్లా ఎస్పీ గాష్ ఆలం సూచించారు. భారత్ అమృత్ మహోత్సవ ఏకాత్మత యాత్రలో భాగంగా ఈశాన్య రాష్ర్టాలకు చెందిన 27మంది విద్యార్థులు బుధవారం ములుగు జిల్లాలో పర్యటించారు. స్టూడెంట్ ఎక్స్ పీరియన్స్ ఇంటర్ స్టేట్ లివింగ్ కార్యక్రమంలో భాగంగా మొదట ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని సందర్శించిన బృందం సభ్యులు ఆలయ చరిత్ర గురించి గైడ్ విజయ్ ద్వారా తెలుసుకున్నారు. 
భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం విశిష్టత
అనంతరం ములుగులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ గాష్ ఆలం, ఓఎస్డీ అశోక్ కుమార్ లతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ గాష్ ఆలం మాట్లాడుతూ.. భారతదేశ ఔన్నత్యాన్ని వర్ణించలేమని, భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉంది ప్రపంచంలో ఒక్క భారతదేశం మాత్రమేనని స్పష్టం చేశారు. విభిన్న సంస్క`తులు, సాంప్రదాయాలను కలిగి ఉన్నా అందరం ఒక్కటేననే భావనతో కలిసిమెలిసి దేశం కోసం జీవించడంలో ఆనందం ఉంటుందన్నారు. భారతీయులందరూ కలిసి ఒక్కటిగా ఉన్నందునే ప్రపంచదేశాలు ఏమీ చేయలేకపోతున్నాయని తెలిపారు. కాగా, 27మంది రాష్ర్టాల ప్రతినిధులు ఎస్పీతో చిట్ చాట్ చేశారు. 
సమ్మక్క, సారలమ్మల జ్ఞాపిక అందజేత
తమ విద్యాభ్యాసం, భవిష్యత్తులో తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఒక్కొక్కరితో మాట్లాడుతూ వారికి ఎస్పీ గాష్ ఆలం మార్గదర్శనం చేశారు. వీరికి ఎస్పీ మేడారం సమ్మక్క, సారలమ్మల జ్ఞాపికను ఎస్పీ గాష్ ఆలం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ వైసీఎస్ సభ్యులు రవీందర్, ఏబీవీపీ రాష్ర్ట సంఘటనా కార్యదర్శి లవన్, ఉపాధ్యక్షుడు శ్యామ్, వర్కింగ్ కమిటీ సభ్యుడు హర్షవర్ధన్, చిట్యాల రాజు, విభాగ్ కన్వీనర్లు సంతోష్, నిఖిల్, దేవేందర్, మణికంఠ, సీనియర్ నాయకులు గండ్రకోట కుమార్, గాదం దేవేందర్, బద్ధం జనార్ధన్, విష్ణు, మంద మహేష్, చల్లూరి మహేందర్, తదితరులు పాల్గొన్నారు.

విదేశాల్లో మెడిసిన్ పూర్తిచేసిన విద్యార్థులు భారత్‌లో పీజీలో చేరడానికి లేదా ప్రాక్టీసు చేయడానికి.. వారు ముందుగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే 'ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్(ఎఫ్‌ఎంజీఈ)'లో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఈ పరీక్షను వచ్చే జూన్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జాతీయ వైద్య కమిషన్(ఎన్‌ఎంసీ) వెల్లడించింది. అయితే ఎఫ్‌ఎంజీఈ రాయడానికి ముందుగా విద్యార్థులు ఎన్‌ఎంసీ నుంచి అర్హత ధ్రువపత్రం పొందడం తప్పనిసరి. ఆ ధ్రువపత్రం లేకుండా ఎఫ్‌ఎంజీఈకి చేసుకునే దరఖాస్తులను తిరస్కరిచనున్నట్లు ఎన్‌ఎంసీ ప్రకటించింది. 

విదేశీ వైద్య విద్యార్థులకు అర్హత ధ్రువపత్రం తప్పనిసరి 
ఈ పరీక్షకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు తప్పనిసరిగా అర్హత ధ్రువపత్రం పొందాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యర్థులు నేషనల్ మెడికల్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో మార్చి 8న సాయంత్రం 6 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పూర్తిస్థాయి వివరాలు నమోదు చేయని అభ్యర్థుల దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మపుష్ప 2 ట్రైలర్‌లో హైలైట్ షాట్ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Vishwak Sen : మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Kantara Chapter 1 Release Date: గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Embed widget