అన్వేషించండి

MLA Seethakka: మంత్రి కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క థ్యాంక్స్! వినతి పత్రం అందజేత

బుధవారం ఉదయం ఎమ్మెల్యే సీతక్క మంత్రి కేటీఆర్ ను కలిశారు. ములుగు కలెక్టరేట్ శంకుస్థాపన దగ్గర మంత్రి కేటీఆర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు

ములుగులో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీకి ఆ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. గతంలో తాను చాలాసార్లు అసెంబ్లీ వేదికగా అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. మరికొన్ని విషయాల్లో సీతక్క ప్రభుత్వాన్ని విమర్శించారు. తెలంగాణ తెచ్చుకున్నది నీళ్ళు, నిధులు, నియామకాల కోసమని.. కానీ ములుగు జిల్లాకు గోదావరి జలాలు రావట్లేదని సీతక్క విమర్శించారు. గోదావరి జలాల కోసం తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు. ఏటూరునాగారంను రెవెన్యూ డివిజన్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వలేదని అన్నారు. మెడికల్ కాలేజీ పనులు ఇంకా ప్రారంభం కాలేదని, మల్లంపల్లి మండల కేంద్రం కూడా చేస్తామని హామీ ఇవ్వలేదని అన్నారు. ములుగు నియోజకవర్గాన్ని టార్గెట్ చేస్తున్నారని పేర్కొన్నారు.

కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఛత్తీస్‌గఢ్ పూర్తిగా వెనుకబడ్డ రాష్ట్రమని.. అలాంటి రాష్ట్రంతో తెలంగాణను ఎలా పోలుస్తారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని తెలిసే తమ పార్టీని టార్గెట్ చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక్కటేనని అన్నారు. బీఆర్ఎస్ కు రాంరాం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారంటే.. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అర్థం అవుతోందని అన్నారు.

అంతకుముందు బుధవారం ఉదయం ఎమ్మెల్యే సీతక్క మంత్రి కేటీఆర్ ను కలిశారు. ములుగు కలెక్టరేట్ శంకుస్థాపన దగ్గర మంత్రి కేటీఆర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ములుగు ప్రాంతానికి గోదావరి జలాలు అందించేలా రామప్ప నుండి లక్నవరం వరకు కెనాల్ పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు. గోదావరిలో లిఫ్ట్ ఏర్పాటు చేసి చెరువులు నింపాలని కోరారు. మెడికల్ కళాశాల పనులు వేగవంతం చేయాలని, గిరిజన యూనివర్సిటీ తరగతులు కూడా వెంటనే ప్రారంభించాలని కోరారు.

పోడు భూములకు పట్టాలు వెంటనే ఇవ్వాలని సీతక్క కేటీఆర్ ను కోరారు. మూతపడ్డ మంగపేట మండలం కమలాపూర్ లో బిల్ట్ ఫ్యాక్టరీని కూడా వెంటనే తెరిపించాలని కోరారు. ఏటూరు నాగారాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలని కోరారు. మంగపేట కేంద్రంగా ఇంజినీరింగ్ కళాశాల, గోవిందరావుపేట మండలం పసర కేంద్రంగా సమ్మక్క సారలమ్మ నర్సింగ్ కాలేజీ కూడా మంజూరు చేయాలని అన్నారు. మల్లంపల్లి, లక్ష్మీదేవిపేట, రాజుపేటలను మండలాలుగా ప్రకటించాలని ఎమ్మెల్యే సీతక్క కోరారు.  కేసీఆర్‌ను కలిసే అవకాశం ఉండదని, అందుకే తాను మంత్రి కేటీఆర్‌కు వినతి పత్రం ఇచ్చానని చెప్పుకొచ్చారు.

ఛత్తీస్ గఢ్‌తో పోల్చిన మంత్రి కేటీఆర్

తెలంగాణలో ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొంటుంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్ గఢ్‌లో మాత్రం నామమాత్రంగా ధాన్యం కొంటున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ తరహాలోనే ఛత్తీస్‌గఢ్‌లో వరి, పత్తి సాగవుతుందని, అక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎకరానికి 12 క్వింటాళ్లే కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఎంత ధాన్యం పండించినా ఎకరానికి పరిమితంగానే ధాన్యం కొంటారని అన్నారు. మిగతా ధాన్యమంతా రైతులు మార్కెట్‌కు వెళ్లి మిల్లర్‌ ఎంత ఇస్తే అంతకు అమ్ముకోవాల్సిందేనని అన్నారు. పండించిన ధాన్యానికి ప్రభుత్వ రక్షణ లేదని, ప్రభుత్వ మద్దతు ధర కూడా లేదని అన్నారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ములుగులో నిర్వహించిన వాటర్‌ డేలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. బహిరంగ సభలో ప్రతిపక్షాలపై కేటీఆర్ ధ్వజమెత్తారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఎన్నికలు పద్ధతిగా జరగాల్సిందే, ఎవరిలోనూ ఆ ఆందోళన ఉండకూడదు - ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
ఎన్నికలు పద్ధతిగా జరగాల్సిందే, ఎవరిలోనూ ఆ ఆందోళన ఉండకూడదు - ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
Narayankhed: అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెల్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెల్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
చిన్నారులకు ఆ సెరిలాక్ తినిపిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
చిన్నారులకు ఆ సెరిలాక్ తినిపిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Hanuman Deeksha Incident in Mancherial |మిషనరీ స్కూల్ పై హిందూ సంఘాల ఆగ్రహం.. ఇలా చేయడం కరెక్టేనా..?MS Dhoni To Play IPL 2025: సీఎస్కే ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ధోనీ మిత్రుడు సురేష్ రైనాSunil Nostalgic About His School Days: స్కూల్ రోజుల్లో తనపై ఇన్విజిలేటర్ల ఓపినియనేంటో చెప్పిన సునీల్BJP Madhavi Latha Srirama Navami Sobhayatra: శోభాయాత్రలో పాల్గొని ఎంఐఎంపై మాధవీలత విమర్శలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఎన్నికలు పద్ధతిగా జరగాల్సిందే, ఎవరిలోనూ ఆ ఆందోళన ఉండకూడదు - ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
ఎన్నికలు పద్ధతిగా జరగాల్సిందే, ఎవరిలోనూ ఆ ఆందోళన ఉండకూడదు - ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
Narayankhed: అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెల్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెల్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
చిన్నారులకు ఆ సెరిలాక్ తినిపిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
చిన్నారులకు ఆ సెరిలాక్ తినిపిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
My Dear Donga Trailer: ‘మై డియర్ దొంగ’ ట్రైలర్ - మన హీరో ‘రాజా’ సినిమాలో వెంకటేష్ టైప్!
‘మై డియర్ దొంగ’ ట్రైలర్ - మన హీరో ‘రాజా’ సినిమాలో వెంకటేష్ టైప్!
Tesla in India: ఇండియాకి టెస్లా కార్‌లు వచ్చేస్తున్నాయ్, గట్టిగానే ప్లాన్ చేసిన మస్క్ మామ
Tesla in India: ఇండియాకి టెస్లా కార్‌లు వచ్చేస్తున్నాయ్, గట్టిగానే ప్లాన్ చేసిన మస్క్ మామ
Hyderabad News: HCUలో విద్యార్థుల మధ్య ఘర్షణ - బ్లేడ్ తో దాడి, తీవ్ర ఉద్రిక్తత
HCUలో విద్యార్థుల మధ్య ఘర్షణ - బ్లేడ్ తో దాడి, తీవ్ర ఉద్రిక్తత
AR Rahman - Subhash Ghai: నా మ్యూజిక్ కోసం కాదు, నాపేరు కోసం చెల్లిస్తున్నారు - రెహమాన్ మాటలకు ఆ దర్శకుడు షాక్
నా మ్యూజిక్ కోసం కాదు, నాపేరు కోసం చెల్లిస్తున్నారు - రెహమాన్ మాటలకు ఆ దర్శకుడు షాక్
Embed widget