అన్వేషించండి

KTR Latest News: నిన్నైనా, రేపైనా బీసీలకు న్యాయం చేసేది కేసీఆర్ ఒక్కరే - కేటీఆర్

కాంగ్రెస్ బెదిరింపులతో పరిశ్రమలు తెలంగాణ వదిలి పారిపోయే పరిస్థితి ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెట్ కేటీఆర్ అన్నారు.

పరకాల: గతంలో బీసీలకు న్యాయం చేసింది, రేపు కూడా వారికి ప్రాధాన్యత ఇచ్చేది కేసీఆర్ మాత్రమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. Gift A Smile కార్యక్రమంలో భాగంగా పరకాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కేటీఆర్ మహిళలకు కుట్టు మిషన్లు, కేసీఆర్ కిట్లు పంపిణీ చేశారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అద్భుతమైన మెజారిటీలతో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తేనే రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సెట్ అవుతారని చెప్పారు. 

కాంగ్రెస్ బెదిరింపులతో పరిశ్రమలు పారిపోయే పరిస్థితి
‘దేశంలోనే అతిపెద్ద కాకతీయ టెక్స్ టైల్ పార్క్ లో 25000 మందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన కీటెక్స్ సంస్థను కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారు. వారు చెప్పిన వారికే ఉద్యోగాలు ఇవ్వాలన్న కాంగ్రెస్ బెదిరింపులతో పరిశ్రమలు రాష్ట్రాన్ని వదిలి పారిపోయే పరిస్థితి దాపురించింది. కాకతీయ టెక్స్ టైల్ పార్కులో కాలువ నిర్మాణానికి జనవరిలో రూపొందించిన 137 కోట్ల అంచనాలు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల ధనదాహంతో 297 కోట్లకు పెరిగింది. కాలువ నిర్మాణం పేరుతో  వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు 167 కోట్లు దోచుకోవాలనుకున్నారు. 

కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు కు పరిశ్రమలను తెప్పించి యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని బీఆర్ఎస్ అనుకుంటే, కాంగ్రెస్ నేతలు మాత్రం దాన్ని నిలువు దోపిడి చేసే కుట్రలు చేస్తున్నారు. ప్రశ్నించకపోతే కాంగ్రెస్ నేతలు చేస్తున్న దోపిడీ ఆగదని, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో వారి అక్రమాలపై నిలదీస్తాం’ అన్నారు కేటీఆర్.

కేటీఆర్ ఇంక ఏమన్నారంటే..
ప్రతీ ఆడబిడ్డకు తెలంగాణలోని ప్రభుత్వం 50 వేలు బాకీ ఉన్నది. చారాణ కోడికి బారాణ మసాలా అన్నట్టు స్వయం సహాయక బృందాలకు 3000 కోట్ల రూపాయలకు బదులు రేవంత్ ప్రభుత్వం కేవలం 300 కోట్లు ఇచ్చి సంబరాలు చేసుకోవాలంటోంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నాయకులకు సమ్మక్క- సారక్క, రాణి రుద్రమ వారసురాళ్లయిన వరంగల్ ఆడబిడ్డలు కర్రు కాల్చి వాత పెట్టాలి. మొన్న పార్లమెంటు ఎన్నికలప్పుడు రైతుబంధువేసి ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయని మళ్లీ రైతుబంధు వేశారు. 


స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ కండువా కప్పుకుని మీ ఇంటికి వచ్చే బీఆర్ఎస్ క్యాడర్ ను కేసీఆరే వచ్చిండని భావించి కడుపులో పెట్టుకొని ఆశీర్వదించండి. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వం జనవరిలోనే ఎరువులు కొని బఫర్ స్టాక్ చేసుకునేది. అందుకే ఆయన సిఎంగా ఉన్నన్ని రోజులు యూరియా దుకాణాల ముందు లైన్లో చెప్పులు, ఆధార్ కార్డులు కనిపించలేదు. టైంకి ఎరువులు, విత్తనాలు, యూరియా ఇవ్వలేని రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రికి పదవిలో ఉండే అర్హత లేదు. 

లబ్ధిదారులకు డబ్బులు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం..
కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తానని రేవంత్ రెడ్డి ప్రగల్బాలు పలుకుతున్నాడు. పరకాల నియోజకవర్గంలో ఇండ్లు నిర్మించుకున్న 3 వేల మంది గృహలక్ష్మి లబ్ధిదారులకు డబ్బులు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం సతాయిస్తున్నది.  లబ్ధిదారుల తరపున పరకాల మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి  కోర్టుకు పోతే,  న్యాయస్థానం చెప్పినా కూడా రేవంత్ ప్రభుత్వం స్పందించడం లేదు. 3000 మంది గృహలక్ష్మి లబ్ధిదారులకు న్యాయం జరిగేదాకా పోరాడుదాం. అసెంబ్లీలో కొట్లాడుతాం.

తెలంగాణ షాన్ గా ఉన్న ఆజం జాహీ మిల్లు సమైక్య పాలనలో మూతపడింది. నాటి సమైక్య పాలకులు ఆజం జాహి మిల్లు భూములను అడ్డుకి పావు సేరు అమ్ముకున్నారు. ఆజం జాహి మిల్లు మూతపడడంతో వరంగల్ జిల్లాలోని పద్మశాలీలు బతుకుదెరువు కోసం భీమండి, సూరత్, షోలాపూర్, వలస పోయారు. అలా వలస పోయిన వాళ్లందర్నీ స్వరాష్ట్రంలో తిరిగి వెనక్కి తెప్పించుకుంటామని ఉద్యమ కాలంలో కేసీఆర్ గారు చెప్పారు. అందుకు అనుగుణంగానే తెలంగాణ వచ్చాక ఇదే వరంగల్ గడ్డపై 1500 ఎకరాల్లో భారత దేశంలోనే అతిపెద్ద కాకతీయ టెక్స్ టైల్ పార్క్  ఏర్పాటు చేశారు.

కేసీఆర్ హయాంలో కార్మికుల కోసం షెడ్లు
బీఆర్ఎస్ ప్రభుత్వ చిత్తశుద్ది, పట్టుదల, నిజాయితీ కారణంగా కేరళకు చెందిన కీటెక్స్ సంస్థ 2400 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టింది. దాంతో పాటు  యంగ్ వన్ అనే కొరియా సంస్థ, గణేష్ ఎకో అనే బొంబాయి సంస్థ కూడా పెట్టుబడులు పెట్టడంతో 2022- 23 నాటికి ఒక టెక్స్ టైల్ పార్క్ లో ఒక యూనిట్ ను ప్రారంభించాం. శిక్షణ పొందుతున్న ఆడబిడ్డలకు కాకతీయ టెక్స్ టైల్ పార్కులో ఉద్యోగాలు వచ్చే బాధ్యత  తీసుకుంటాము. శ్రామికులుగా సూరత్ కు వలస పోయిన కార్మికులను తిరిగి పారిశ్రామికులుగా తెలంగాణకు రప్పించేందుకు కేసిఆర్ సీఎంగా ఉన్నప్పుడు మడికొండలో 100 ఎకరాల్లో ఏర్పాటుచేసిన షెడ్లు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతో నిరుపయోగంగా మారాయని’ కేటీఆర్ ఆరోపించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rains Alert: మరో 24 గంటలపాటు వర్షాలు.. ఎండల నుంచి ఉపశమనం- 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
మరో 24 గంటలపాటు వర్షాలు.. ఎండల నుంచి ఉపశమనం- 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
Medigadda Fire Accident: మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
Breaking News: భారతీయులను చూసి సభ్యత, సంస్కారం నేర్చుకోండి: అమెరికాకు ఇరాన్ కౌంటర్
భారతీయులను చూసి సభ్యత, సంస్కారం నేర్చుకోండి: అమెరికాకు ఇరాన్ కౌంటర్
Telangana Heatwave: అమ్మో.. ఇవేం ఎండలురా బాబు.. తలపై చెట్టు కొమ్మతో వినూత్నంగా Watch Video
అమ్మో.. ఇవేం ఎండలురా బాబు.. తలపై చెట్టు కొమ్మతో వినూత్నంగా Watch Video

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy strategy 2026: రేవంత్ సర్కార్ మైలేజీ మ్యాజిక్ - సునీల్ కనుగోలుతో కలిసి కొత్త ప్లాన్ - ఇమేజ్ మారిపోతుందా?
రేవంత్ సర్కార్ మైలేజీ మ్యాజిక్ - సునీల్ కనుగోలుతో కలిసి కొత్త ప్లాన్ - ఇమేజ్ మారిపోతుందా?
Women Reservation AP: ఏపీలో మహిళా నేతల విశ్వరూపం ఖాయం - లోకేష్ ప్రకటనే కాదు కార్యాచరణ కూడా - పక్కా ప్లానే ?
ఏపీలో మహిళా నేతల విశ్వరూపం ఖాయం - లోకేష్ ప్రకటనే కాదు కార్యాచరణ కూడా - పక్కా ప్లానే ?
US Attacks Iran:హోర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తత!ఇరాన్‌పై అమెరికా బాంబుల వర్షం!
హోర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తత!ఇరాన్‌పై అమెరికా బాంబుల వర్షం!
NTR : ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ నివాళి - కింద పడ్డ ఫ్యాన్‌‌కు హీరో చేయూత
ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ నివాళి - కింద పడ్డ ఫ్యాన్‌‌కు హీరో చేయూత
Drishyam 3 Collections: 'దృశ్యం 3' @ 180 కోట్లు... స్టడీగా మోహన్ లాల్ సినిమా కలెక్షన్లు... ఏడో రోజు ఎంత వచ్చిందంటే?
'దృశ్యం 3' @ 180 కోట్లు... స్టడీగా మోహన్ లాల్ సినిమా కలెక్షన్లు... ఏడో రోజు ఎంత వచ్చిందంటే?
2026 జూన్‌లో ఎవరి ఉద్యోగాలు సురక్షితం, ఎవరివి ప్రమాదంలో పడతాయ్?
2026 జూన్‌లో ఎవరి ఉద్యోగాలు సురక్షితం, ఎవరివి ప్రమాదంలో పడతాయ్?
Chandrayaan-2 Discovery Ice on Moon:చంద్రుడి దక్షిణ ధ్రువంలో భారీగా మంచు! చంద్రయాన్ -2 ఆర్బిటర్ పంపిన అద్భుత డేటా!
చంద్రుడి దక్షిణ ధ్రువంలో భారీగా మంచు! చంద్రయాన్ -2 ఆర్బిటర్ పంపిన అద్భుత డేటా!
Trump Threatens Oman:ట్రంప్ నెక్స్ట్‌ టార్గెట్ ఒమన్! హోర్ముజ్ జలసంధిపై మాట వినకపోతే తుడిచిపెట్టేస్తామని హెచ్చరిక!
ట్రంప్ నెక్స్ట్‌ టార్గెట్ ఒమన్! హోర్ముజ్ జలసంధిపై మాట వినకపోతే తుడిచిపెట్టేస్తామని హెచ్చరిక!
Embed widget