అన్వేషించండి

KTR News: స్టేషన్ ఘన్ పూర్ లో కడియం శ్రీహరికి బుద్ధి చెప్పడం ఖాయం: కేటీఆర్

Station Ghanpur News: పార్టీని పటిష్టం చేయడానికి త్వరలోనే మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. కడియం శ్రీహరికి బీఆర్ఎస్ శ్రేణులు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తాయన్నారు.

Telangana News: త్వరలో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం పైన మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. పార్టీ మారిన ప్రస్తుత ఎమ్మెల్యే కడియం శ్రీహరిపైన అనర్హతవేటు ఖాయమని, త్వరలోనే స్టేషన్ ఘనపూర్ కు ఉప ఎన్నికలు రానున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య తో నేడు కేటీఆర్ హైదరాబాదులో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రానున్న ఉప ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహంపైన తాటికొండ రాజయ్య పలు సలహాలు, సూచనలు కేటీఆర్ తో పంచుకున్నారు. పార్టీని మోసం చేసి, ప్రజల ఆకాంక్షలను తుంగలో తొక్కి రాజకీయ స్వార్థంతో పార్టీ మారిన కడియం శ్రీహరిని స్టేషన్ ఘన్ పూర్ లో ఓడించేందుకు ప్రజలంతా సంసిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా రాజయ్య తెలిపారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులన్నీ కడియం శ్రీహరికి బుద్ధి చెబుతాయన్నారు. 

ప్రజా క్షేత్రంలో బుద్ది చెబుతాం
ఇప్పటికే తాటికొండ రాజయ్యను స్టేషన్ ఘన్ పూర్ ఎన్నికల అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్  ప్రకటించిన నేపథ్యంలో ఆయన నాయకత్వంలో మరోసారి స్టేషన్ ఘన్ పూర్లో గులాబీ జెండాను ఎగురవేస్తామని కేటీఆర్ అన్నారు. పార్టీని మరింతగా పటిష్టం చేయడానికి  త్వరలోనే నియోజకవర్గంలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. పార్టీ శ్రేణులతో త్వరలోనే ఒక విస్తతస్ధాయి సమావేశాన్ని స్టేషన్ ఘన్ పూర్లో నిర్వహించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు స్థానికంగా ఉన్న మండల పార్టీ నాయకులతో మాట్లాడి తేదీలను నిర్ణయించాలని రాజయ్య గారికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అనేక అవకాశాలు ఇచ్చిన మూడు చట్ట సభల్లో ప్రాతినిధ్యం కల్పించిన తర్వాత కూడా కేవలం రాజకీయ స్వార్థంతో పార్టీని వీడిన కడియం శ్రీహరికి బీఆర్ఎస్ శ్రేణులు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తాయని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు

హైకోర్టు కీలక తీర్చు
కాగా, బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల కేసులో హైకోర్టు ఇటీవల కీలక తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంపై నెల రోజుల్లోగా చర్యలు చేపట్టేందుకు విచారణ స్టేటస్ రిపోర్టును తమకు నివేదించాలని స్పీకర్ కార్యాలయాన్ని కోర్టు ఆదేశించింది. లేనిపక్షంలో సుమోటోగా కేసు దర్యాప్తు చేస్తామన్నారు. బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు, దానా నాగేందర్‌లపై బీఆర్‌ఎస్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.
 

ఓడ దాటేదాక ఓడ మల్లన్న, ఓడ దాటాక బోడి మల్లన్న
కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఓడ దాటేదాక ఓడ మల్లన్న, ఓడ దాటాక బోడి మల్లన్న మాదిరి కాంగ్రెస్‌ పాలన ఉందన్నారు. కాంగ్రెస్ నమ్మించి మోసం చేసిందని విమర్శించారు. తాజాగా రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కేటీఆర్‌ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రైతు భరోసా, రుణమాఫీపై ఎన్నికల్లో వేల హామీలు గుప్పించిన ముఖ్యమంత్రి ఇప్పుడు నేలచూపులు చూస్తున్నారని మండిపడ్డారు. కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వలేకపోయారని, రుణమాఫీ విషయంలోనూ మోసం చేశారని కుండ బద్దలు కొట్టారు. ఢిల్లీలో మంత్రి తుమ్మల వ్యాఖ్యలు తెలంగాణ రైతులను అయోమయానికి గురిచేస్తున్నాయి. వానాకాలంలో పెట్టుబడి సాయం ఉపసంహరించుకున్న కేటీఆర్ ఇప్పుడు కౌలు రైతుకు భరోసా ఇవ్వలేక చేతులెత్తేస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని 420 హామీల్లోని ప్రతి హామీని సీఎం నెరవేరుస్తున్నారని అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bonus For Singareni: సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
YS Jagan : హిందువులకు రిప్రజెంటేటివ్‌లు అయితే చంద్రబాబును తిట్టాల -  వాళ్లకు సగం తెలుసు సగం తెలియదు - బీజేపీ నేతలపై జగన్ సంచలన వ్యాఖ్యలు
హిందువులకు రిప్రజెంటేటివ్‌లు అయితే చంద్రబాబును తిట్టాల - వాళ్లకు సగం తెలుసు సగం తెలియదు - బీజేపీ నేతలపై జగన్ సంచలన వ్యాఖ్యలు
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలుJani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bonus For Singareni: సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
YS Jagan : హిందువులకు రిప్రజెంటేటివ్‌లు అయితే చంద్రబాబును తిట్టాల -  వాళ్లకు సగం తెలుసు సగం తెలియదు - బీజేపీ నేతలపై జగన్ సంచలన వ్యాఖ్యలు
హిందువులకు రిప్రజెంటేటివ్‌లు అయితే చంద్రబాబును తిట్టాల - వాళ్లకు సగం తెలుసు సగం తెలియదు - బీజేపీ నేతలపై జగన్ సంచలన వ్యాఖ్యలు
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
India vs Bangladesh 1st Test: తొలి టెస్టుపై పట్టు బిగిసింది , విజయం ఇక లాంఛనమేనా?
తొలి టెస్టుపై పట్టు బిగిసింది , విజయం ఇక లాంఛనమేనా?
Jagan About Tirumala: తిరుమలలో మా హయాంలో విప్లవాత్మక మార్పులు, వీటిని కాదనగలరా?: వైఎస్ జగన్
తిరుమలలో మా హయాంలో విప్లవాత్మక మార్పులు, వీటిని కాదనగలరా?: వైఎస్ జగన్
Amazon Great Indian Festival Sale: అమెజాన్‌ ఫెస్టివల్‌ సేల్‌ -  స్మార్ట్‌ ఫోన్లపై అదిరే  ఆఫర్లు -  రూ.10 వేల కన్నా తక్కువకే
అమెజాన్‌ ఫెస్టివల్‌ సేల్‌ -  స్మార్ట్‌ ఫోన్లపై అదిరే  ఆఫర్లు -  రూ.10 వేల కన్నా తక్కువకే
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Embed widget