అన్వేషించండి

Errabelli Dayakar Rao: త్వ‌ర‌లో బీసీ కుల వృత్తుల వారికి రూ.1ల‌క్ష చొప్పున ఆర్థిక స‌హ‌కారం: మంత్రి ఎర్రబెల్లి

త్వ‌ర‌లోనే పాల‌కుర్తిలో డిగ్రీ కాలేజీని ప్రారంభిస్తాను. వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుండే త‌ర‌గ‌తులు ప్రారంభ‌మ‌వుతాయి’ అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

- అభివృద్ధిని చూసి ఓర్వేలేకే ప్ర‌తిప‌క్షాల కుళ్ళు, కుట్ర‌లు, కుతంత్రాలు
- ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌ను పార్టీ శ్రేణులు, ప్ర‌జ‌లు తిప్పి కొట్టాలి
- సిఎం కెసిఆర్ చేప‌ట్టిన అభివృద్ధి ప‌థ‌కాలే దేశానికి ఆద‌ర్శం
- పాల‌కుర్తి, ద‌ర్దేప‌ల్లిలో జ‌ర‌గిన ఆత్మీయ స‌మ్మేళ‌నాల‌లో మంత్రి ఎర్ర‌బెల్లి 

వరంగల్ /జనగామ : ‘పాల‌కుర్తి అభివృద్ధికి ఎంతైనా ఖ‌ర్చు చేస్తాను. ఇప్ప‌టికే రూ.150కోట్లు ఖ‌ర్చు చేశా, మ‌రో రూ.100 కోట్లు ఖ‌ర్చు చేస్తాను. త్వ‌ర‌లోనే పాల‌కుర్తిలో డిగ్రీ కాలేజీని ప్రారంభిస్తాను. వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుండే త‌ర‌గ‌తులు ప్రారంభ‌మ‌వుతాయి’ అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్ర‌ముఖ చారిత్ర‌క‌, అధ్యాత్మిక‌, ప‌ర్యాట‌క కేంద్రంగా పాల‌కుర్తి అభివృద్ధి చెందుతోంది. సీఎం కేసీఆర్ హ‌యాంలోనే పురాత‌న దేవాల‌యాల‌కు పూర్వ వైభ‌వం వ‌చ్చిందన్నారు. సీఎం కెసిఆర్ వ‌ల్లే అభివృద్ధి జ‌రుగుతోంది. ఈ అభివృద్ధిని చూడ‌లేకే ప్ర‌తిప‌క్షాలు కుళ్ళుకుంటున్నాయి. కుట్ర‌లు, కుతంత్రాలు పన్నుతున్నాయి. ప్ర‌జ‌లు వాటిని గుర్తించాలి. గ‌త‌, ఇప్ప‌టి అభివృద్ధిని విశ్లేషించుకోవాలి. వారి విమ‌ర్శ‌లు తిప్పి కొట్టి, కేసీఆర్ కు అండ‌గా నిల‌వాలని ప్ర‌జ‌ల‌కు ఆయన పిలుపునిచ్చారు. బీసీ కుల వృత్తులు చేసుకునే వారికి రూ.1ల‌క్ష చొప్పున ఆర్థిక స‌హ‌కారం అందిస్తామన్నారు.  

జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోగల పాలకుర్తి మండలం పాలకుర్తి ఎంపీటీసీ-1, ఎంపీటీసీ-2 లకు కలిపి బృందావన్ గార్డెన్స్ లో, దర్దేపల్లి, కొండాపురం గ్రామాలకు కలిపి దర్దేపల్లి లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనాల‌లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ ఆశీస్సులు, మంత్రి కేటీఆర్ సహకారంతో ఇప్పటి వరకు సుమారు 150 కోట్ల రూపాయల నిధులతో పాలకుర్తి ని అభివృద్ధి చేశాను అన్నారు. పాలకుర్తి మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం వుంది అన్నారు. వివిధ అభివృద్ధి పనుల కోసం మ‌రో రూ.100 కోట్లు నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

చిరకాల వాంఛ అయిన డిగ్రీ కాలేజీ 
పాలకుర్తి ప్రజల చిరకాల వాంఛ అయిన డిగ్రీ కాలేజీని వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభించి తరగతులు నిర్వహిస్తాం అని తెలిపారు. బీసీ కుల వృత్తులు చేసుకునే వారికి రూ.1ల‌క్ష చొప్పున ఆర్థిక స‌హ‌కారం ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని త్వరలో అర్హులను గుర్తించి అందిస్తాం అన్నారు. అలాగే ప్ర‌తి సామాజిక కులానికి ఒక క‌మ్యూనిటీ హాలు అవసరం వుందని నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని అన్నారు. సీఎం కేసీఆర్ మార్గ నిర్దేశనంలో ఎంతో చారిత్రక ప్రాశస్త్యం కలిగిన పాలకుర్తి ప్రాంతాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పనులు చేస్తున్నాం అన్నారు. త్వరలో ఆ పనులన్నీ ప్రారంభిస్తాం అన్నారు. సీఎం కెసిఆర్ వచ్చాకే తెలంగాణ రాష్ట్రం లో పురాతన దేవాలయాలకి పూర్వ వైభవం వచ్చిందని అన్నారు. దీనికి సజీవ సాక్ష్యం మన యాదాద్రి, పాలకుర్తి, బ‌మ్మెర‌, వ‌ల్మీడి ఆలయాలేనని తెలిపారు. 

తెలంగాణ రాకముందు, వచ్చిన తరువాత అభివృద్ధిలో వచ్చిన మార్పులను బేరీజు వేసుకోవాలి అని విజ్ఞప్తి చేశారు. అభివృద్ది ని చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుళ్లుతో కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నాయని వాటికి ప్రజలు గమనించి సరైన సమయంలో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలే నా బలం, బలగం అని కష్ట సుఖాల్లో మీకు అందరికీ నేను అండగా ఉంటాను అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు, పథకాలు దేశానికి ఆదర్శం కావడంతో అన్ని రాష్ట్రాలు మన వైపే చూస్తున్నాయని అన్నారు. మనమంతా మరోసారి సీఎం కేసీఆర్ ని ఆశీర్వదించి, BRS పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించడానికి కంకణ బద్ధులై పని చేయాలని పిలుపునిచ్చారు.

సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు - డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు
ఈ కార్య‌క్ర‌మానికి డిసిసిబి చైర్మ‌న్ మార్నేని ర‌వింద‌ర్ రావు హాజ‌ర‌య్యారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల‌తోపాటు, ఇవ్వ‌ని హామీల‌ను కూడా నెర‌వేర్చారు. ఉద్య‌మ నేతే, సీఎం కావ‌డంతో రాష్ట్రానికి, అభివృద్ధికి క‌లిసి వ‌చ్చింది. అన్నారు. మంత్రి ఎర్ర‌బెల్లి హ‌యాంలో పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన అభివృద్ధి మ‌రెక్క‌డా జ‌ర‌గ‌లేద‌ని తెలిపారు. 

ప్రజల మనోభావాలు తెలిసిన వ్యక్తి మంత్రి ఎర్రబెల్లి - ఎర్ర‌బెల్లి ట్ర‌స్ట్ చైర్మ‌న్ ఉషా ద‌యాక‌ర్ రావు
ఈ స‌మ్మేళ‌నంలో ఎర్ర‌బెల్లి ట్ర‌స్ట్ చైర్మ‌న్ ఉషా ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ.. చ‌దువు సంస్కారానికి ఉప‌యోగ‌ప‌డ‌త‌ది. కొంద‌రు ద‌యాక‌ర్ రావు చ‌దువుకోలేద‌ని విమ‌ర్శ చేయ‌డం వారి అజ్ఞానికి నిద‌ర్శ‌నం. కానీ, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ప్ర‌జ‌ల మ‌నోభావాలు చ‌దివారు. ఏడు సార్లు గెలిచారు. రాష్ట్ర అభివృద్ధిలో కెసిఆర్ కు చేదోడుగా ఉంటున్నాడు. అని అన్నారు. కొంద‌రి బుద్ధిలేని వారి మాట‌ల‌ను న‌మ్మే స్థితిలో ప్ర‌జ‌లు లేర‌ని ఆమె తెలిపారు.

జ‌నంతో మంత్రి ఎర్ర‌బెల్లి మ‌మేకం
స‌మ్మేళ‌నానికి ముందు సీఎం సందేశాన్ని చ‌దివి వినిపించారు. మంత్రి ప‌లువురు పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, వివిధ కుల వృత్తుల వారితో ఫోటోలు దిగారు. అంత‌కుముందు మంత్రి ఎర్ర‌బెల్లికి ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. పాల‌కుర్తి పార్టీ ఆఫీసు నుంచి బృందావ‌న్ గార్డెన్ వ‌ర‌కు కి.మీ. వ‌ర‌కు మంత్రి న‌డుచుకుంటూ వెళ్ళ‌గా, మ‌హిళ‌లు బ‌తుక‌మ్మ‌లు, డ‌ప్పు చ‌ప్పుళ్ళు, కోలాటాలతో, పూలు చ‌ల్లుతూ ఘ‌నంగా తోడ్కొని వెళ్ళారు. ప్ర‌జ‌ల్లో మ‌మేకం అవుతూ మంత్రి ఆయా కార్య‌క్ర‌మాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పార్టీ కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌ల్లో జోష్ ని నింపారు. అలాగే ఆత్మీయ సమ్మేళనాలలో పార్టీ కార్యకర్తలకు స్వయంగా వడ్డించారు. వారితో కలిసి భోజనాలు చేశారు.

పోచ‌మ్మ దేవాల‌య అభివృద్ధికి శంకుస్థాప‌న‌
అంతకముందు జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో గల పోచమ్మ దేవాలయ అభివృద్ధి పనులకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శంకుస్థాపన చేశారు. ఓ దాత ఇచ్చిన విరాళానికి తోడు త‌న వంతుగా ఆర్థిక సాయం అందించ‌నున్న‌ట్లు మంత్రి హామీ ఇచ్చారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో గ్రామ పంచాయితీ నిధులతో ఏర్పాటు చేసిన వైకుంఠధామం ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. 

అభివృద్ధి ప‌నుల‌ను ఆగ‌ష్టు 25లోగా పూర్తి చేయాలి
ప‌నుల ప్ర‌గ‌తిపై అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌తో మంత్రి ఎర్ర‌బెల్లి స‌మీక్ష‌
నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్న ప‌లు అభివృద్ధి ప‌నులు, దేవాల‌యాల పున‌రుద్ధ‌ర‌ణ‌, అభివృద్ధి ప‌నుల‌పై మంత్రి ఎర్ర‌బెల్లి పాల‌కుర్తిలోని త‌న క్యాంపు కార్యాల‌యంలో ప్ర‌జాప్ర‌తినిధులు, సంబంధిత శాఖ‌ల అధికారుల‌తో స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆయా అభివృద్ధి ప‌నులు నిర్ణీత గ‌డువులోగా పూర్తి కావాల‌ని ఆదేశించారు. ఆగ‌ష్టు 25లోగా పూర్తి చేయాల‌ని, పనుల నాణ్య‌త‌లో రాజీ ప‌డొద్ద‌ని సూచించారు. ఆయా ప‌నులు పూర్తి కావ‌డంతోపాటు వాటి ప్రారంభోత్స‌వాల‌కు కూడా ఏర్పాట్లు చేయాల‌ని మంత్రి తెలిపారు. ఈ కార్య‌క్ర‌మాల్లో స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, పార్టీ శ్రేణులు, ప్ర‌జ‌లు, వివిధ సామాజిక వ‌ర్గాల ప్ర‌తినిధులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Anantapur TDP: అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
Tecno Pova 6 Pro 5G: బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Why did K. Annamalai read the Quran | బీజేపీ యంగ్ లీడర్ అన్నామలై ఖురాన్ ఎందుకు చదివారు..?  | ABPKadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP DesamRR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Anantapur TDP: అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
Tecno Pova 6 Pro 5G: బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Chandrababu Prajagalam :  టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్  -  ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్ - ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
Ticket For Raghurama :  ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు -  ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు - ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
Sreemukhi Photos: చుడిదార్‌లో శ్రీముఖి ఎంత ముద్దొస్తుందో - బుల్లితెర రాములమ్మ భలే ఉంది కదూ!
చుడిదార్‌లో శ్రీముఖి ఎంత ముద్దొస్తుందో - బుల్లితెర రాములమ్మ భలే ఉంది కదూ!
Embed widget