అన్వేషించండి

AV Ranganath: వరంగల్ సీపీ రంగనాథ్‌పై బదిలీ వేటు, బండి సంజయ్ అరెస్ట్ ఎఫెక్టేనా? 

AV Ranganath: కేంద్ర ఎన్నిక సంఘం తెలంగాణలో జరిపిన బదిలీల్లో వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ బదిలీ అయ్యారు. క్రైం డీసీపీగా పనిచేస్తున్నదాసరి మురళీధర్‌ను ఇన్‌చార్జ్‌ సీపీగా నియమించారు.

AV Ranganath: కేంద్ర ఎన్నిక సంఘం తెలంగాణలో జరిపిన బదిలీల్లో వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ బదిలీ అయ్యారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో క్రైం డీసీపీగా పనిచేస్తున్న ఐపీఎస్‌ అధికారి దాసరి మురళీధర్‌ను ఇన్‌చార్జ్‌ సీపీగా నియమించారు. గురువారం సీపీ రంగనాథ్‌ నుంచి దాసరి మురళీధర్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే రంగనాథ్‌ బదిలీ వెనక బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్‌ని రంగనాథ్ అరెస్టు చేశారు. దీనిని మనసులో పెట్టుకున్న బండి సీపీ బదిలీ కోసం కేంద్రంతో పట్టుబట్టినట్లు ప్రచారం సాగుతోంది. ఇటీవల ఎలక్షన్‌ కమిషన్‌ రాష్ట్రంలో పర్యటించిన సమయంలో సీపీ రంగనాథ్‌పై బండి సంజయ్‌ ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

సీపీ బాటలోనే మరికొంత మంది
వరంగల్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న కొంత మంది అధికారులపై కూడా బదిలీ వేటు పడే అవకాశం ఉందని పోలీస్‌ శాఖలో ప్రచారం జరుగుతోంది. ఎలక్షన్‌ కమిషన్‌ రాష్ట్రంలో పర్యటించిన సమయంలో కొంత మంది అధికారులపై కొందరు ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. వారిపై వేటు పడే అవకాశం ఉందనే సమాచారం. 21 మంది అధికారులపై వచ్చిన అభియోగాలపై సీపీ రంగనాథ్‌ గతంలో ఎన్నికల కమిషన్‌కు వివరణ ఇచ్చారు.

వరంగల్ సీపీగా ప్రత్యేక ముద్ర
వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌గా 2022 డిసెంబర్‌ 3న ఏవీ రంగనాథ్‌ బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఆయన నేరుగా ప్రజలు, బాధితులతో మాట్లాడేవారు. వారి నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కారం చూపేవారు. ఇందు కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంతోపాటు క్షేత్రస్థాయిలో ఉన్న అనేక సమస్యలను స్వయంగా పరిశీలన చేసి సంబంధిత అధికారులకు పరిష్కార మార్గాలను చూపించారు. సామాన్యుల భూములను ఆక్రమించి వ్యాపారం చేసే భూకబ్జాదారులకు దడ పుట్టించారు. 

బాధితులు, ప్రజలు నుంచి సీపీ స్వయంగా 2,500కు పైగా ఫిర్యాదులను స్వీకరించారు. వాటిని సంబంధిత ఎస్‌హెచ్‌ఓలతోపాటు ఏసీపీ, డీసీపీ, టాస్క్‌ఫోర్స్‌, ఎస్‌బీ విభాగాల ద్వారా విచారణ చేయించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నారు. మోసాలకు పాల్పడిన చిట్‌ఫండ్‌ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకున్నారు. చిట్ డబ్బులు ఎగ్గొట్టి ఇబ్బందులకు గురిచేసిన చిట్‌ఫండ్‌ యాజమాన్యాలపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. ప్రతి నెల చిట్టి డబ్బులను చెల్లించేలా డీసీపీ స్థాయి అధికారితో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. ప్రజలను మోసం చేసిన చిట్ నిర్వాహకుల నుంచి సుమారు రూ.200 కోట్ల ప్రజలకు అందేలా చేశారు. 

పార్టీలతో సంబంధం లేకుండా చర్యలు
ప్రజా సమస్యల పరిష్కరించే క్రమంలో అన్ని పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను అరెస్టు చేసి జైలుకు పంపించారు. అధికార పార్టీ నేతలను సైతం వదలిపెట్టలేదు. దీంతో భూకబ్జాలకు పాల్పడుతున్న వారు చాలామంది వెనక్కి తగ్గారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అధికారులు సమస్యాత్మక విషయాల్లో రెండు వర్గాలను సీపీ దగ్గర ప్రవేశపెట్టడంతో స్వయంగా పరిష్కార మార్గాలను చూపెట్టారు. ఫలితంగా తక్కువ కాలంలోనే ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు.  చాలా మంది సీపీ ఫొటోలకు పాలాభిషేకాలు నిర్వహించారు.

24 మందిపై సస్పెన్షన్‌ వేటు
భూకబ్జాదారులకు సహకరిస్తూ నిబంధనలకు విరుద్ధంగా నడుచుకున్న పోలీస్‌ అధికారులపై ఆయన ఉక్కుపాదం మోపారు. 10 నెలల సమయంలో 24 మంది పోలీస్‌ అధికారులపై సీపీ సస్పెన్షన్‌ వేటు వేశారు. ఏడుగురు ఇన్‌స్పెక్టర్లు, ఒక ఆర్‌ఐ, ఏడుగురు సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఒక ఏఎస్సై, ఇద్దరు హెడ్‌ కానిస్టేబుళ్లు, నలుగురు కానిస్టేబుళ్లు, ఇద్దరు హోంగార్డులపై సస్పెన్షన్‌ వేటు వేశారు. అంతేకాకుండా క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పలువురు పోలీసులను ఏఆర్‌కు పంపారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Semaglutide: సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ డీసీఏ కీలక ఆదేశాలు!సెల్ఫ్‌మెడికేషన్ ప్రాణాంతకమని హెచ్చరిక 
సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ డీసీఏ కీలక ఆదేశాలు!సెల్ఫ్‌మెడికేషన్ ప్రాణాంతకమని హెచ్చరిక 
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Bhadrachalam Temple: 3 దశలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
3 దశలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
Telangana Indiramma Family Life Insurance Scheme : తెలంగాణ ప్రజలందరికీ టెర్మ్‌ ఇన్సూరెన్స్‌! రేవంత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తారా !
తెలంగాణ ప్రజలందరికీ టెర్మ్‌ ఇన్సూరెన్స్‌! రేవంత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తారా !

వీడియోలు

Adilabad Petrol Crisis | ఆదిలాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు | ABP Desam
Ashwin Comments on MI Captain | హార్దిక్ పాండ్యాపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు | ABP Desam
Shreyas Iyer as captain of Team India? | టీమిండియా నెక్స్ట్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్? | ABP Desam
SRH Spends 10 Crores for Uppal Stadium | 10 కోట్లతో ఉప్పల్ స్టేడియం రినోవేషన్ | ABP Desam
RCB Sold to Aditya Birla Group IPL 2026 | భారీ ధరకు అమ్ముడైన RCB | ABP Desam Bangalore

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Steel Plant Credit Game: మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తనదేనన్న జగన్ - పాత వీడియోతో షాకిచ్చిన టీడీపీ
మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తనదేనన్న జగన్ - పాత వీడియోతో షాకిచ్చిన టీడీపీ
Telangana Assembly Indiramma Controversy: తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
Varanasi Movie Set: వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
Hero Vida VX2 Plus KKR Edition: కేకేఆర్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే గిఫ్ట్: హీరో వీడా స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్.. ఫీచర్లు మామూలుగా లేవుగా!
కేకేఆర్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే గిఫ్ట్: హీరో వీడా స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్.. ఫీచర్లు మామూలుగా లేవుగా!
Hyundai India : హ్యూందాయ్‌లో ఉన్న మోడల్స్‌ ఎన్ని? అమ్మకానికి ఎన్ని ఉన్నాయి? కొత్తగా ఎన్ని రాబోతున్నాయి?
హ్యూందాయ్‌లో ఉన్న మోడల్స్‌ ఎన్ని? అమ్మకానికి ఎన్ని ఉన్నాయి? కొత్తగా ఎన్ని రాబోతున్నాయి?
Rakasa Trailer : ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
Deputy CM Pawan Kalyan: రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
New Corona: ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
Embed widget