అన్వేషించండి

ఆశ్రమ పాఠశాలలో విద్యార్థి మృతి, మృతదేహంతో నిరసన!

ఆశ్రమ పాఠాశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే అక్కడి ఓ విద్యార్థి చనిపోయాడని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. మృతదేహంతోనే పాఠశాల ముందు బైఠాయించి ధర్నా చేశారు. 

కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికల్ పెట్ మండలంలోని ఏల్లూర్ ఆశ్రమ పాఠశాలలో ఓ విద్యార్థి మృతి చెందాడు. అయితే పదో తరగతి చదువుతున్న అల్లం రాజేష్ అనే విద్యార్థి గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతు బుధవారం రోజు ప్రాణాలు విడిచాడు. విద్యార్థి ఆరోగ్యం పట్ల ఆ పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే ఆ విద్యార్థి మృతి చెందాడని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే మృతదేహంతోనే రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. 

వారం రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్న విద్యార్థి..!

అయితే పదో తరగతి చదువుతున్న అల్లం రాజేష్ గత వారం రోజులుగా జ్వరంతో బాధ పడుతున్నాడు. కానీ ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, సిబ్బంది పట్టించుకోలేదు. చాలా ఆలస్యంగా విద్యార్థి తల్లి తండ్రులకు ఫోన్ చేసి విషయాన్ని తెలియజేశారు. అయితే బుధవారం తల్లిదండ్రులు బయలుదేరి ఆశ్రమ పాఠశాల వద్దకు చేరుకున్నారు. అప్పటికే రాజేష్ పరిస్థితి విషమించింది. విషయం గుర్తించిన తల్లిదండ్రులు రాజేష్ ను వెంటనే కాగజ్‌నగర్‌ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే జిల్లా ఆసుపత్రి లేదా రిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. వెంటనే రాజేష్ తల్లిదండ్రులు అతడిని ఆసిఫాబాద్ ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. కానీ అప్పటికే ఆ విద్యార్థి చనిపోయాడు. రాజేష్ మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న ప్రజాసంఘాల నాయకులు, విద్యార్థి యువజన సంఘాల నేతలు అక్కడకు చేరుకొని వారి కుటుంబానికి అండగా నిలిచారు. 

15 లక్షల ఎక్స్ గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం..

విద్యార్థి మృతి పట్ల ప్రభుత్వం 15 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని అలాగే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ముందు మృతదేహంతో ధర్నాకు దిగారు. విద్యార్థి మృతికి కారకులైన డీటీడీఓ, ఏటీడీఓ, ప్రధానోపాధ్యాయుడు, హెచ్ డబ్ల్యూఓలను విధుల నుంచి తొలగించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఆసిఫాబాద్ ఆర్డీఓ దత్తు.. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించారు. అంత్యక్రియలకు 25,000 ఇస్తామని నచ్చజెప్పారు. అయితే తమకు అవేమీ వద్దని.. న్యాయం మాత్రమే కావాలంటూ కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. కలెక్టర్ వచ్చే వరకు తమ నిరసనను ఆపేది లేదని విద్యార్థి, యువజన సంఘాల నాయకులు హెచ్చరించారు. 

గురువారం కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం..

అనంతరం అంతర్జాతీయ రహదారిపై బాలుడి మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో అంతరాష్ట్ర రహదారిపై ట్రాఫిక్ సమస్య ఎర్పాడటంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పజెప్పి వారి గ్రామానికి పంపించేశారు. అయితే పోలీసుల చర్యలపై ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించకుండా తమను అరెస్టు చేసి.. దొంగ చాటుగా బాలుడి మృతదేహాన్ని పంపిచారంటూ ఆరోపిస్తున్నారు. అయితే సిబ్బంది నిర్లక్ష్యంతో చనిపోయిన ఆ విద్యార్థి కుటుంబానికి 15 లక్షల ఎక్స్ గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి వారికి న్యాయం చేయమని కోరారు. ఈక్రమంలోనే గురువారం కుమురం భీం ఆసిఫాబాద్  జిల్లా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు బంద్ కు పిలుపునిచ్చారు. విద్యాసంస్థల బంద్ తోపాటు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: సంక్షేమ పథకాలకు ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి! కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
సంక్షేమ పథకాలకు ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి! కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
BRS vs Congress: అన్నారం బ్యారేజీపై రేవంత్ ప్రభుత్వం కుట్రలు.. కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే పన్నాగం? కేటీఆర్ వీడియో పోస్ట్
అన్నారం బ్యారేజీపై రేవంత్ ప్రభుత్వం కుట్రలు.. కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే పన్నాగం? కేటీఆర్ వీడియో పోస్ట్
HPV Vaccine India: దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
PM Kisan Yojana: హోలీకి PM కిసాన్ యోజన 22వ విడత నిధులు వస్తాయా? తాజా అప్‌డేట్ ఏంటీ?
హోలీకి PM కిసాన్ యోజన 22వ విడత నిధులు వస్తాయా? తాజా అప్‌డేట్ ఏంటీ?

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy : 99 రోజుల పాటు అలుపెరుగని పరుగే - కలెక్టర్లకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
99 రోజుల పాటు అలుపెరుగని పరుగే - కలెక్టర్లకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
Iran Israel War 2026:వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
CPM leader impeached: జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
ABP Desam Smart Ed Conclave 2026: AI యుగంలో డిగ్రీలు ఉంటే సరిపోవు! స్కిల్ ఉన్నోడికే గుర్తింపు! ABP Desam Smart Ed Conclave 2026లో నిపుణుల సూచన!
AI యుగంలో డిగ్రీలు ఉంటే సరిపోవు! స్కిల్ ఉన్నోడికే గుర్తింపు! ABP Desam Smart Ed Conclave 2026లో నిపుణుల సూచన!
Manchu Manoj Wedding Anniversary: మౌనికతో మనోజ్ వివాహ బంధానికి మూడేళ్లు... ఒక్కటిగా ముందడుగు, వరుస విజయాలు
మౌనికతో మనోజ్ వివాహ బంధానికి మూడేళ్లు... ఒక్కటిగా ముందడుగు, వరుస విజయాలు
Pawan Kalyan Meets CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
Renu Desai: సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
Tatkal Booking New Rules: రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
Embed widget