అన్వేషించండి

ఆశ్రమ పాఠశాలలో విద్యార్థి మృతి, మృతదేహంతో నిరసన!

ఆశ్రమ పాఠాశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే అక్కడి ఓ విద్యార్థి చనిపోయాడని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. మృతదేహంతోనే పాఠశాల ముందు బైఠాయించి ధర్నా చేశారు. 

కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికల్ పెట్ మండలంలోని ఏల్లూర్ ఆశ్రమ పాఠశాలలో ఓ విద్యార్థి మృతి చెందాడు. అయితే పదో తరగతి చదువుతున్న అల్లం రాజేష్ అనే విద్యార్థి గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతు బుధవారం రోజు ప్రాణాలు విడిచాడు. విద్యార్థి ఆరోగ్యం పట్ల ఆ పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే ఆ విద్యార్థి మృతి చెందాడని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే మృతదేహంతోనే రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. 

వారం రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్న విద్యార్థి..!

అయితే పదో తరగతి చదువుతున్న అల్లం రాజేష్ గత వారం రోజులుగా జ్వరంతో బాధ పడుతున్నాడు. కానీ ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, సిబ్బంది పట్టించుకోలేదు. చాలా ఆలస్యంగా విద్యార్థి తల్లి తండ్రులకు ఫోన్ చేసి విషయాన్ని తెలియజేశారు. అయితే బుధవారం తల్లిదండ్రులు బయలుదేరి ఆశ్రమ పాఠశాల వద్దకు చేరుకున్నారు. అప్పటికే రాజేష్ పరిస్థితి విషమించింది. విషయం గుర్తించిన తల్లిదండ్రులు రాజేష్ ను వెంటనే కాగజ్‌నగర్‌ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే జిల్లా ఆసుపత్రి లేదా రిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. వెంటనే రాజేష్ తల్లిదండ్రులు అతడిని ఆసిఫాబాద్ ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. కానీ అప్పటికే ఆ విద్యార్థి చనిపోయాడు. రాజేష్ మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న ప్రజాసంఘాల నాయకులు, విద్యార్థి యువజన సంఘాల నేతలు అక్కడకు చేరుకొని వారి కుటుంబానికి అండగా నిలిచారు. 

15 లక్షల ఎక్స్ గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం..

విద్యార్థి మృతి పట్ల ప్రభుత్వం 15 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని అలాగే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ముందు మృతదేహంతో ధర్నాకు దిగారు. విద్యార్థి మృతికి కారకులైన డీటీడీఓ, ఏటీడీఓ, ప్రధానోపాధ్యాయుడు, హెచ్ డబ్ల్యూఓలను విధుల నుంచి తొలగించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఆసిఫాబాద్ ఆర్డీఓ దత్తు.. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించారు. అంత్యక్రియలకు 25,000 ఇస్తామని నచ్చజెప్పారు. అయితే తమకు అవేమీ వద్దని.. న్యాయం మాత్రమే కావాలంటూ కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. కలెక్టర్ వచ్చే వరకు తమ నిరసనను ఆపేది లేదని విద్యార్థి, యువజన సంఘాల నాయకులు హెచ్చరించారు. 

గురువారం కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం..

అనంతరం అంతర్జాతీయ రహదారిపై బాలుడి మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో అంతరాష్ట్ర రహదారిపై ట్రాఫిక్ సమస్య ఎర్పాడటంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పజెప్పి వారి గ్రామానికి పంపించేశారు. అయితే పోలీసుల చర్యలపై ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించకుండా తమను అరెస్టు చేసి.. దొంగ చాటుగా బాలుడి మృతదేహాన్ని పంపిచారంటూ ఆరోపిస్తున్నారు. అయితే సిబ్బంది నిర్లక్ష్యంతో చనిపోయిన ఆ విద్యార్థి కుటుంబానికి 15 లక్షల ఎక్స్ గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి వారికి న్యాయం చేయమని కోరారు. ఈక్రమంలోనే గురువారం కుమురం భీం ఆసిఫాబాద్  జిల్లా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు బంద్ కు పిలుపునిచ్చారు. విద్యాసంస్థల బంద్ తోపాటు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Semaglutide: సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ డీసీఏ కీలక ఆదేశాలు!సెల్ఫ్‌మెడికేషన్ ప్రాణాంతకమని హెచ్చరిక 
సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ డీసీఏ కీలక ఆదేశాలు!సెల్ఫ్‌మెడికేషన్ ప్రాణాంతకమని హెచ్చరిక 
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Bhadrachalam Temple: 3 దశలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
3 దశలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
Telangana Indiramma Family Life Insurance Scheme : తెలంగాణ ప్రజలందరికీ టెర్మ్‌ ఇన్సూరెన్స్‌! రేవంత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తారా !
తెలంగాణ ప్రజలందరికీ టెర్మ్‌ ఇన్సూరెన్స్‌! రేవంత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తారా !

వీడియోలు

Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Trump Phone Call: పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. ఇరు దేశాల ఉమ్మడి యాక్షన్ ప్లాన్ ఏంటీ?
పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. ఇరు దేశాల ఉమ్మడి యాక్షన్ ప్లాన్ ఏంటీ?
Jagan friendship with NDA: చిత్తుగా ఓడించిన ప్రత్యర్థితోనే స్నేహం - వైసీపీ భవిష్యత్‌కు జగన్ పాలసీనే గండంగా మారిందా?
చిత్తుగా ఓడించిన ప్రత్యర్థితోనే స్నేహం - వైసీపీ భవిష్యత్‌కు జగన్ పాలసీనే గండంగా మారిందా?
Sonia Gandhi Hospitalised: సోనియా గాంధీకి మరోసారి అస్వస్థత.. ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స
సోనియా గాంధీకి మరోసారి అస్వస్థత.. ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స
Allu Arjun : అల్లు అర్జున్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ - ఏళ్ల గ్యాప్ తర్వాత టాలీవుడ్ ఎంట్రీకి రెడీయేనా?
అల్లు అర్జున్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ - ఏళ్ల గ్యాప్ తర్వాత టాలీవుడ్ ఎంట్రీకి రెడీయేనా?
Royal Challengers Bangalore and Rajasthan Royals: ఐపీఎల్‌లో కాసుల వర్షం; బిలియన్ క్లబ్‌లోకి ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్‌! క్రికెట్ చరిత్రలోనే కళ్లు చెదిరే డీల్స్!
ఐపీఎల్‌లో కాసుల వర్షం; బిలియన్ క్లబ్‌లోకి ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్‌! క్రికెట్ చరిత్రలోనే కళ్లు చెదిరే డీల్స్!
Semaglutide: సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ డీసీఏ కీలక ఆదేశాలు!సెల్ఫ్‌మెడికేషన్ ప్రాణాంతకమని హెచ్చరిక 
సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ డీసీఏ కీలక ఆదేశాలు!సెల్ఫ్‌మెడికేషన్ ప్రాణాంతకమని హెచ్చరిక 
హ్యుందాయ్ వెర్నాపై భారీ డిస్కౌంట్లు: రూ. 1 లక్ష వరకు బెనిఫిట్స్.. కొత్త మోడల్ ఫీచర్లు ఇవే!
హ్యుందాయ్ వెర్నాపై భారీ డిస్కౌంట్లు: రూ. 1 లక్ష వరకు బెనిఫిట్స్.. కొత్త మోడల్ ఫీచర్లు ఇవే!
Vijayawada Crime News: ఉగ్రదాడిని తప్పించుకున్న బెజవాడ, ముగ్గురి అరెస్ట్ విచారణలో విస్తుపోయే అంశాలు: సర్వ శ్రేష్ఠ త్రిపాఠీ
ఉగ్రదాడిని తప్పించుకున్న బెజవాడ, ముగ్గురి అరెస్ట్ కేసు విచారణలో విస్తుపోయే అంశాలు!
Embed widget