అన్వేషించండి

ఆశ్రమ పాఠశాలలో విద్యార్థి మృతి, మృతదేహంతో నిరసన!

ఆశ్రమ పాఠాశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే అక్కడి ఓ విద్యార్థి చనిపోయాడని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. మృతదేహంతోనే పాఠశాల ముందు బైఠాయించి ధర్నా చేశారు. 

కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికల్ పెట్ మండలంలోని ఏల్లూర్ ఆశ్రమ పాఠశాలలో ఓ విద్యార్థి మృతి చెందాడు. అయితే పదో తరగతి చదువుతున్న అల్లం రాజేష్ అనే విద్యార్థి గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతు బుధవారం రోజు ప్రాణాలు విడిచాడు. విద్యార్థి ఆరోగ్యం పట్ల ఆ పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే ఆ విద్యార్థి మృతి చెందాడని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే మృతదేహంతోనే రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. 

వారం రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్న విద్యార్థి..!

అయితే పదో తరగతి చదువుతున్న అల్లం రాజేష్ గత వారం రోజులుగా జ్వరంతో బాధ పడుతున్నాడు. కానీ ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, సిబ్బంది పట్టించుకోలేదు. చాలా ఆలస్యంగా విద్యార్థి తల్లి తండ్రులకు ఫోన్ చేసి విషయాన్ని తెలియజేశారు. అయితే బుధవారం తల్లిదండ్రులు బయలుదేరి ఆశ్రమ పాఠశాల వద్దకు చేరుకున్నారు. అప్పటికే రాజేష్ పరిస్థితి విషమించింది. విషయం గుర్తించిన తల్లిదండ్రులు రాజేష్ ను వెంటనే కాగజ్‌నగర్‌ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే జిల్లా ఆసుపత్రి లేదా రిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. వెంటనే రాజేష్ తల్లిదండ్రులు అతడిని ఆసిఫాబాద్ ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. కానీ అప్పటికే ఆ విద్యార్థి చనిపోయాడు. రాజేష్ మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న ప్రజాసంఘాల నాయకులు, విద్యార్థి యువజన సంఘాల నేతలు అక్కడకు చేరుకొని వారి కుటుంబానికి అండగా నిలిచారు. 

15 లక్షల ఎక్స్ గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం..

విద్యార్థి మృతి పట్ల ప్రభుత్వం 15 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని అలాగే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ముందు మృతదేహంతో ధర్నాకు దిగారు. విద్యార్థి మృతికి కారకులైన డీటీడీఓ, ఏటీడీఓ, ప్రధానోపాధ్యాయుడు, హెచ్ డబ్ల్యూఓలను విధుల నుంచి తొలగించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఆసిఫాబాద్ ఆర్డీఓ దత్తు.. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించారు. అంత్యక్రియలకు 25,000 ఇస్తామని నచ్చజెప్పారు. అయితే తమకు అవేమీ వద్దని.. న్యాయం మాత్రమే కావాలంటూ కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. కలెక్టర్ వచ్చే వరకు తమ నిరసనను ఆపేది లేదని విద్యార్థి, యువజన సంఘాల నాయకులు హెచ్చరించారు. 

గురువారం కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం..

అనంతరం అంతర్జాతీయ రహదారిపై బాలుడి మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో అంతరాష్ట్ర రహదారిపై ట్రాఫిక్ సమస్య ఎర్పాడటంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పజెప్పి వారి గ్రామానికి పంపించేశారు. అయితే పోలీసుల చర్యలపై ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించకుండా తమను అరెస్టు చేసి.. దొంగ చాటుగా బాలుడి మృతదేహాన్ని పంపిచారంటూ ఆరోపిస్తున్నారు. అయితే సిబ్బంది నిర్లక్ష్యంతో చనిపోయిన ఆ విద్యార్థి కుటుంబానికి 15 లక్షల ఎక్స్ గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి వారికి న్యాయం చేయమని కోరారు. ఈక్రమంలోనే గురువారం కుమురం భీం ఆసిఫాబాద్  జిల్లా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు బంద్ కు పిలుపునిచ్చారు. విద్యాసంస్థల బంద్ తోపాటు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: వైసీపీ నేతలపై దాడి చేసింది రైతులు కాదు, టీడీపీ గూండాలు: అంబటి రాంబాబు
వైసీపీ నేతలపై దాడి చేసింది రైతులు కాదు, టీడీపీ గూండాలు: అంబటి రాంబాబు
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
Breaking News:తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు! ఉత్తర్వులు జారీ
తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు! ఉత్తర్వులు జారీ
New IB Chief Mahesh Dixit:దేశీయ నిఘా పీఠంపై మన తెలంగాణ సింహం! నూతన ఐబీ చీఫ్‌గా ఐపీఎస్ మహేష్ దీక్షిత్ నియామకం!
దేశీయ నిఘా పీఠంపై మన తెలంగాణ సింహం! నూతన ఐబీ చీఫ్‌గా ఐపీఎస్ మహేష్ దీక్షిత్ నియామకం!

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 
K Bhagyaraj : భాగ్యరాజ్ చివరి వీడియో - రెండు రోజుల క్రితం పెళ్లి వేడుకలో సందడి... ఫ్యాన్స్ ఎమోషనల్
భాగ్యరాజ్ చివరి వీడియో - రెండు రోజుల క్రితం పెళ్లి వేడుకలో సందడి... ఫ్యాన్స్ ఎమోషనల్
పల్సర్ N250 నుంచి KTM 250 డ్యూక్ వరకు - 200cc-250cc రేంజ్‌లో 5 బెస్ట్ బైక్‌లు, ధరలు ఎంతంటే?
ఈ ఏడాది యువతను ఊపేస్తున్న 200cc-250cc బైక్‌లు, వాటి రేట్లు
YSRCP Leaders: అమరావతిలో పర్యటనకు వెళ్లిన వైసీపీ లీడర్లు! కోడిగుడ్లతో దాడి చేసిన రాజధాని రైతులు!
అమరావతిలో పర్యటనకు వెళ్లిన వైసీపీ లీడర్లు! కోడిగుడ్లతో దాడి చేసిన రాజధాని రైతులు!
Embed widget