అన్వేషించండి

Warangal News: ప్రభుత్వాసుపత్రిలో రోగి ప్రాణాలతో పరిహాసాలు, ఆపరేషన్ అంటూ ఆటలు!

Warangal News: వరంగల్ కేఎంసీ వైద్యులు గత నెలరోజులుగా ఓ మహిళకు ఆపరేషన్ చేస్తామని చెప్తూ ఆస్పత్రిలోనే ఉంచుకుంటున్నారు. ఏమైందని ప్రశ్నించిన ప్రతీసారి సాకులు చెప్తూ శస్త్ర చికిత్సను వాయిదా వేస్తున్నారు.

Warangal News:  ప్రాణాలు పోయాల్సిన వైద్యులు..  పరిహాసంతో ఓ రోగికి చుక్కలు చూపిస్తున్నారు. వరంగల్‌ కేఎంసీ వైద్యులు రోగికి సేవలదించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు బాధితుడు దామెర అశోక్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. బాధితుడి కథనం ప్రకారం.. అశోక్‌ భార్య జయకు నెల రోజుల క్రితం కడుపులో నొప్పి రావడంతో ఎంజీఎం ఆస్పత్రికి తీసుకొచ్చాడు. అయితే ఆమెకు కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కేఎంసీలోని ఎంజీఎం ఆస్పత్రిలో ఆపరేషన్‌ చేస్తామని అడ్మిట్‌ చేసుకున్నారు. దాదాపు నెల రోజులుగా వేచి చూస్తున్న వారికి శుక్రవారం ఆపరేషన్‌ చేస్తామని వైద్యులు చెప్పగా... అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం బ్లడ్‌ రిజర్వ్‌ చేసి ఉంచాలని ఎంజీఎం బ్లడ్‌బ్యాంకుకు సమాచారం ఇచ్చారు. అయితే, గురువారం రాత్రే.. బ్లడ్‌ బ్యాంకు నిర్వాహకులు అశోక్‌కు బ్లడ్‌ అందించారు. అది కేఎంసీలోని డాక్టర్లకు చూపించగా, ఇప్పుడు అవసరం లేదంటూ తిప్పి పంపారు. అయితే బ్లడ్‌ బ్యాంకులో ఆ రక్తం తీసుకోవడానికి నిరాకరించారు. ఈలోగా ఓ సెక్యూరిటీ గార్డు అశోక్‌ భార్య కేస్‌ షీటు తీసుకుని మాయమయ్యాడు.

"ఆమెకు కిడ్నీలో స్టోన్స్ వచ్చినయ్. నెలపైనే అయితుంది జాయిన్ చేసి. ఆపరేషన్ ఇప్పుడు చేస్తం, అప్పుడు చేస్తం అనుకుంట జరుపుతూ వచ్చిర్రు. చివరకు శుక్రవారం చేస్తమని చెప్పిర్రు. గురువారం బ్లడ్ తెచ్చుకోమని సెక్యూరిటీ గార్డును ఇచ్చి పంపిచ్చిర్రు. బ్లడ్ తీస్కున్న తర్వాత సెక్యూరిటీ గార్డు.. కేస్ షీట్ తీస్కొని మాయం అయిండు. ఎటు వెళ్లిండో కూడా తెల్వది. ఇదే విషయం వైద్యులకు చెప్తే.. మేము ఆపరేషన్ చేయం. నువ్వేమన్న చేస్కో అంటున్నరు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తా అంటే వాళ్లేం ఆపరేషన్ చేయరంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నరు." - దామెర అశోక్‌

ఐదు నెలల క్రితం కడుపులో దూది ఉంచి కుట్లు వేసిన వైద్యులు..

వైద్యుల నిర్లక్ష్యం ఓ బాలింత ప్రాణం మీదకు తెచ్చింది. నల్కొండ సెంట్రల్ గవర్నమెంట్ ఆసుపత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. జ్యోతి అనే మహిళ డెలివరీ కోసం ఆసుపత్రికి వచ్చింది. వైద్యులు ఆపరేషన్ చేసి డెలవరీ చేశారు. డెలవరీ అనంతరం దూదిని డాక్టర్లు కడుపులోనే ఉంచి కుట్లు వేసేశారు. దూది కడుపులో ఉండిపోవడంతో బాధిత మహిళ మూడు రోజులపాటు తీవ్ర కడుపునొప్పితో బాధపడుతోంది. ఈ విషయంపై బాధిత మహిళ బంధువులు ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యులను అడగగా, నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని మహిళ బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై బాధ్యులపై చర్యల తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి! 

ఉమ్మడి నల్గొండ జిల్లాలో వట్టి ఖమ్మం పహాడ్ గ్రామానికి చెందిన పద్మ(55) అనే మహిళ అనారోగ్యంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయింది. వైద్యులు సరిగ్గాచూడకపోవడం వల్ల పద్మ పరిస్థితి   మరింత విషమించి మృతి చెందిందని రోగి బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ అంబులెన్స్ లో స్వగ్రామానికి పద్మ మృతదేహాన్ని తరలిద్దామని అనుకుంటే, అంబులెన్స్ రిపేర్ లో ఉందని తెలిపారు. పద్మ కుటుంబ సభ్యుల వద్ద డబ్బులు కూడా లేకపోవడంతో దాతల సహాయంతో చివరకు ప్రైవేట్ అంబులెన్స్ లో మృతదేహాన్ని తరలించారు. దీంతో మహిళా బంధువులు ప్రభుత్వాసుపత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు సరిగ్గా చూసుకోకపోవడం వల్లే పద్మ పరిస్థితి విషమించిందని ఆరోపిస్తున్నారు. చికిత్స పొందుతూ మృతి చెందిందన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Telangana Mass Killing:షాబాద్‌, దైవాలగూడలో అర్థరాత్రి ఏం జరిగింది? పోలీసులు చెప్పింది వింటే వణుకుపుడుతుంది!
షాబాద్‌, దైవాలగూడలో అర్థరాత్రి ఏం జరిగింది? పోలీసులు చెప్పింది వింటే వణుకుపుడుతుంది!
Telangana Mass Killing: పోలీసుల నిర్లక్షంతోనే షాబాద్‌ మర్డర్స్‌! దైవాలగూడ ప్రజల ఆందోళన!
పోలీసుల నిర్లక్షంతోనే షాబాద్‌ మర్డర్స్‌! దైవాలగూడ ప్రజల ఆందోళన!
Telangana Mass Killing News: రంగారెడ్డి జిల్లా దైవాలగూడలో దారుణం- పోక్సో కేసు పెట్టారని ఆరుగురి హత్య- నిందితుడి ఘాతుకంతో వణికిపోయిన గ్రామం
రంగారెడ్డి జిల్లా దైవాలగూడలో దారుణం- పోక్సో కేసు పెట్టారని ఆరుగురి హత్య- నిందితుడి ఘాతుకంతో వణికిపోయిన గ్రామం
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
HYDRAA Inaction On Owaisi Encroachments: ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
Telangana Political Mind Games: విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
Thamizh Murugan Vs God of War: ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
E20తో మైలేజ్‌ 5 శాతం వరకు తగ్గొచ్చని ఒప్పుకున్న కేంద్రం, కానీ ప్రయోజనాలే ఎక్కువని స్పష్టీకరణ
E20తో మైలేజ్ 5 శాతం వరకు తగ్గొచ్చు - అంగీకరించిన కేంద్రం, కానీ..!
Jofra Archer Vs Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ బలహీనతను పట్టేసిన జోఫ్రా ఆర్చర్.. ఐపీఎల్ నెట్స్ లో దొరికిపోయిన బీహార్ బ్యాటర్!
15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ బలహీనతను పట్టేసిన జోఫ్రా ఆర్చర్.. ఐపీఎల్ నెట్స్ లో దొరికిపోయిన బీహార్ బ్యాటర్!
Embed widget