అన్వేషించండి

Hanamkonda BJP Meeting : బండి సంజయ్ బహిరంగ సభకు అనుమతి రద్దు, కోర్టుకు వెళ్లే ఆలోచనలో బీజేపీ నేతలు!

Hanamkonda BJP Meeting : తెలంగాణలో మరో వివాదం తెరపైకి వచ్చింది. బీజేపీ బహిరంగ సభస్థలికి ఇచ్చిన అనుమతి రద్దు చేశారు. ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో సభ నిర్వహణకు అనుమతి ఇవ్వలేమని ప్రిన్సిపల్ లేఖ రాశారు.

Hanamkonda BJP Meeting : తెలంగాణలో మరో వివాదం తెరపైకి వచ్చింది.  బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో ప్రజా సంగ్రామ యాత్ర తిరిగి ప్రారంభించేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధం అవుతున్నాయి. శుక్రవారం నుంచి పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారు. అయితే ఈ పాదయాత్ర ముగింపు సభ భారీ ఎత్తున నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేసింది. ఈ సభకు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కూడా వస్తున్నారని ప్రకటించారు. తాజాగా బీజేపీ బహిరంగ సభకు అనుమతి రద్దు చేస్తున్నట్లు హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ లేఖ రాశారు.  ఆర్ట్స్ కాలేజీలో ముగింపు సభకు ఇచ్చిన అనుమతి రద్దు చేశామన్నారు. కాలేజీ గ్రౌండ్ లో సభ నిర్వహించేందుకు అంతకు ముందు ప్రిన్సిపల్ అనుమతి ఇచ్చారు. తాజాగా పోలీసుల నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంతో అనుమతి రద్దు చేస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షురాలికి ప్రిన్సిపాల్ లేఖ రాశారు. సభ నిర్వహణకు ఇచ్చిన రూ. 5 లక్షలు వాపస్ ఇస్తామని తెలిపారు.  బండి సంజయ్ కుమార్ ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా ఆగస్టు 27న హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ భావిస్తుంది.   

ఆగిన చోట నుండే పాదయాత్ర  

బండి సంజయ్ పాదయాత్ర ఆగిన చోట నుంచి ప్రారంభం కానుంది. రోజుకు 20 కి.మీలకు పైగా నడిచేందుకు బండి సంజయ్ సిద్ధమయ్యారు. రేపు ఉదయం స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం పాంనూర్ నుంచి పాదయాత్ర మొదలుకానుంది. స్టేషన్ ఘన్ పూర్ లోని పాంనూర్ కు చేరుకుని, అక్కడే బస చేయనున్నారు.  ఈనెల 27న మధ్యాహ్నం వరకు పాదయాత్ర కొనసాగనుంది. 27న హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ తలపెట్టింది. బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో పార్టీ కార్యకర్తలు ఫుల్ జోష్ తో ఉన్నారు. రేపటి పాదయాత్రలో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు పాల్గొంటారని సమాచారం.  బహిరంగ సభ అనుమతి రద్దుపై కోర్టుకు వెళ్లేందుకు బీజేపీ నేతలు ఆలోచన చేస్తున్నారు. 

బండి సంజయ్ ఫైర్ 

ప్రజా సంగ్రామ యాత్ర అడ్డుకోవాలని దొంగ కేసులు పెట్టి దాడులు చేపించి అరెస్ట్ చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రభుత్వం కుట్ర పన్నిందని, చట్టం న్యాయం మీద విశ్వాసంతో కోర్టును ఆశ్రయించామన్నారు.  పాదయాత్రకు కోర్టు అనుమతి ఇచ్చిందని, తీర్పును స్వాగతిస్తామన్నారు. పాదయాత్ర మరలా మెదలుపెడతామన్నారు. 
ప్రభుత్వం దుర్మార్గపు పనులతో బీజేపీని అడ్డుకోలేదన్నారు. ముఖ్యమంత్రి నోటికీ వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమన్నారు.  రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రారంభం అధికారిక  కార్యక్రమంలో దేశ ప్రధానిపై ఎలా మాట్లాడుతారని నిలదీశారు. పాలమూరు రంగారెడ్డికి మోడీ శాపంగా మారారని అవాకులు పేలుతున్నారన్నారు. అక్కడ ఎంత మందికి పెన్షన్ ఇచ్చారని, డబుల్ బెడ్రూమ్ లు ఇచ్చారో చెప్పాలన్నారు.  

దళిత బంధు పేరుతో మోసం 

"డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులపై శ్వేత పత్రం విడుదల చేయగలరా? . దళిత బంధు పేరుతో ఇతర పార్టీల వారిని చేర్చుకుంటున్నారు. తెలంగాణ విభజన సమయంలోనే మెట్టమొదటి ద్రోహం చేసింది సీఎం కేసీఆరే. కృష్ణా పరివాహక ప్రాంతం  575 టీఎంసీ లు రావాలి. కానీ అప్పటి ముఖ్యమంత్రితో కుమ్మక్కై 299 టీఎంసీలకు సంతకం పెట్టారు. రావాల్సిన వాటిపై పోరాడవు వచ్చే వాటిని వాడుకోవు. కేంద్రం నుంచి ముఖ్యమంత్రికి ఎన్నో సార్లు రిప్లై వచ్చింది. అపెక్స్ కౌన్సిల్ లో సమావేశం పెడితే అందులో ఏమి చేసినవ్. సుప్రీంకోర్టు లో కేసు విత్ డ్రా చేసుకోమంటే సంవత్సరం తర్వాత విత్ డ్రా చేసినవ్. అనేక ప్రాంతాలు ఎడారిగా మారాయి అంటే కారణం కేసీఆర్ నే.  ఇన్ని సంవత్సరాలు ఆంధ్రా ముఖ్యమంత్రితో ఎందుకు కుమ్మక్కు అయ్యావు. అభివృద్ధి గురించి ఇచ్చిన హామీల గురించి మాట్లాడు ముఖ్యమంత్రి. రైతుల్లో మంటలు నీవల్లే కాలుతున్నాయి. వరి వేస్తే ఉరే అన్నావ్ దుబ్బాక, హుజురాబాద్ లో దెబ్బ కొట్టారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి బీజేపీపై వేయాలని కేసీఆర్ కుటుంబం చూస్తోంది. లిక్కర్ స్కామ్ వల్ల తెలంగాణ ప్రజలు తలదించుకుంటున్నారు. "- బండి సంజయ్ 

Also Read : Bandi Sanjay Paadayatra : బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు అనుమతి, పోలీసుల నోటీసులు సస్పెండ్

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పోలవరం వివాదంపై విచారణ.. ఏపీకి నోటీసులు ఇచ్చేందుకు నిరాకరణ
పోలవరం వివాదంపై విచారణ.. ఏపీకి నోటీసులు ఇచ్చేందుకు నిరాకరణ
Supreme Court: పోలవరం వివాదం.. సుప్రీంకోర్టులో తెలంగాణకు చుక్కెదురు, ఏపీకి నోటీసులు ఇచ్చేందుకు నిరాకరణ
పోలవరం వివాదం.. సుప్రీంకోర్టులో తెలంగాణకు చుక్కెదురు, ఏపీకి నోటీసులు ఇచ్చేందుకు నిరాకరణ
Special Intensive Revision Voters Telangana: పాతబస్తీలో ఓట్ల గల్లంతు గండం - SIRతో ఓవైసీ ఆందోళన - సగం ఓటర్లు తగ్గిపోతారా?
పాతబస్తీలో ఓట్ల గల్లంతు గండం - SIRతో ఓవైసీ ఆందోళన - సగం ఓటర్లు తగ్గిపోతారా?
Telangana Politics Mind Game: తెలంగాణలో అప్పుడే ముందస్తు మైండ్ గేమ్! కేటీఆర్ 78 సీట్ల వెనుక అసలు వ్యూహం.. రేవంత్ 117 సీట్ల కౌంటర్!
తెలంగాణలో అప్పుడే ముందస్తు మైండ్ గేమ్! కేటీఆర్ 78 సీట్ల వెనుక అసలు వ్యూహం.. రేవంత్ 117 సీట్ల కౌంటర్!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jr NTR Political Entry: జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
virat Kohli Records: 6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
Jagan Mohan Reddy Lone Battle: మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
26/11 ఉగ్రదాడి కాంగ్రెస్, ISI ల మ్యాచ్ ఫిక్సింగ్.. UPA హయాంలోనే హిందూ ఉగ్రవాదం! మాజీ అండర్ సెక్రటరీ సంచలన ఆరోపణలు
26/11 ఉగ్రదాడి కాంగ్రెస్, ISI ల మ్యాచ్ ఫిక్సింగ్.. UPA హయాంలోనే హిందూ ఉగ్రవాదం! మాజీ అండర్ సెక్రటరీ ఆరోపణలు
187km రేంజ్‌తో కొత్త Vida VX2 Plus లాంచ్‌ - ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో ఆన్‌రోడ్ ధర వివరాలు ఇవే!
సింగిల్‌ ఛార్జ్‌తో దాదాపు 190km జర్నీ- భారీ బ్యాటరీతో Vida VX2 Plus లాంచ్‌, తెలుగు రాష్ట్రాల్లో ధర ఎంత?
Bangkok Pub Fire Accident: థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
Vikarabad Crime News: అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
Embed widget