అన్వేషించండి

Vikram Goud: పార్లమెంట్ ఎన్నికల వేళ బీజేపీకి భారీ షాక్ - కీలక నేత రాజీనామా

Telangana News: తెలంగాణలో బీజేపీకి షాక్ తగిలింది. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపారు.

Vikram Goud Resigned to Telangana BJP: పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో (Telangana) బీజేపీకి (BJP) షాక్ తగిలింది. మాజీ మంత్రి ముఖేష్ కుమార్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ (Vikram Goud) తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి (Kishan Reddy) పంపించారు. పార్టీ కోసం ఏమీ ఆశించకుండా పని చేసినా తనకు తగిన గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పార్టీ హైకమాండ్ కు ఓ లేఖ సైతం రాశారు. 'పార్టీలో కొత్తగా చేరిన వారిని అంటరాని వారిగా చూస్తున్నారు. పెద్ద నాయకులు క్రమశిక్షణకు మారు పేరు అంటూ కొట్టుకుంటుంటే కొందరు చోద్యం చూస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం ఏమీ ఆశించకుండా కష్టపడినా ఫలితం లేకపోతోంది. ప్రజాబలం లేని వారికి పెద్ద పీట వేస్తున్నారు. అలాంటి వారి కింద పని చేయాలని చెబుతున్నారు. ఎన్నికల తర్వాత ఓటమికి, నేతల అసంతృప్తిపై ఎవరూ బాధ్యత తీసుకోలేదు. అందుకే ఆవేదనతో బీజేపీకి రాజీనామా చేస్తున్నా.' అంటూ లేఖలో పేర్కొన్నారు.
Vikram Goud: పార్లమెంట్ ఎన్నికల వేళ బీజేపీకి భారీ షాక్ - కీలక నేత రాజీనామా
Vikram Goud: పార్లమెంట్ ఎన్నికల వేళ బీజేపీకి భారీ షాక్ - కీలక నేత రాజీనామా

ఇదే కారణమా.?

విక్రమ్ గౌడ్.. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ నుంచి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన నేతగా ముఖేష్ గౌడ్ పేరొందారు. బలమైన సామాజిక వర్గంలో తండ్రి బాటలోనే రాజకీయాల్లోకి వచ్చిన విక్రమ్ గౌడ్.. ప్రస్తుతం బీజేపీకి రాజీనామా చేయడంతో ఆ పార్టీ పెద్దలు ఆయనకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల సమయంలో గోషామహల్ సీటును విక్రమ్ గౌడ్ ఆశించారు. అయితే, ఎమ్మెల్యే రాజాసింగ్ పై అప్పటివరకూ ఉన్న బహిష్కరణ వేటును ఎత్తేసిన పార్టీ అధిష్టానం ఆ సీటును రాజాసింగ్ కు ఇచ్చింది. అప్పటి నుంచి పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న విక్రమ్ గౌడ్.. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అటు, లోక్ సభ ఎన్నికల్లోనైనా అధిష్టానం తనకు పోటీ చేసే అవకాశం కల్పిస్తుందని భావించినప్పటికీ.. ఎలాంటి హామీ రాకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన, త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Also Read: Telangana Districts Dispute : తెలంగాణలో జిల్లాలను తగ్గిస్తామన్న రేవంత్ - రాజకీయ వివాదాలు కొనితెచ్చుకుంటున్నారా ?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jeevan Reddy: ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
Rythu Bharosa Scheme: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget