అన్వేషించండి

Venkaiah Naidu: 'తెలుగు సినీ కళామ తల్లికి మెగాస్టార్ మూడో కన్ను' - రాజకీయాలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు

Hyderabad News: కేంద్ర ప్రభుత్వం మట్టిలో మాణిక్యాలకు పద్మ పురస్కారాలు ప్రకటించడం గొప్ప విషయమని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసలు కురిపించారు.

Venkaiah Naidu Comments on Megastar: కేంద్ర ప్రభుత్వం మట్టిలో మాణిక్యాలను గుర్తించి పద్మ పురస్కారాలు ఇవ్వడం చాలా గొప్ప విషయమని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) అన్నారు. హైదరాబాద్ శిల్ప కళా వేదికలో పద్మ అవార్డు గ్రహీతలైన తెలుగు వారిని తెలంగాణ ప్రభుత్వం ఆదివారం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడారు. తన జీవితంలో అవార్డులు, సన్మానాలు పెద్దగా తీసుకోలేదని.. పద్మ విభూషణ్ పురస్కారం ఇస్తున్నట్లు కేంద్రం చెబితే ప్రధాని మోదీపై గౌరవంతోనే అంగీకరించానని చెప్పారు. 'పద్మ పురస్కారాలకు ఎంపికైన వారిని తెలంగాణ ప్రభుత్వం సన్మానం చేయడం చాలా గొప్ప విషయం. సీఎం రేవంత్ ను అభినందిస్తున్నా. గుర్తింపు పొందని వ్యక్తులకు అది లభించేలా పద్మ అవార్డులు ప్రకటించారు. రాజకీయాల్లో నానాటికీ ప్రమాణాలు తగ్గిపోతున్నాయి. దీన్ని సరిదిద్దాల్సిన బాధ్యత మనందరిదీ. చిరంజీవికి పద్మ విభూషణ్ రావడం చాలా సంతోషంగా ఉంది. తెలుగు కళామతల్లికి ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి వారు రెండు కళ్లు అయితే మెగాస్టార్ చిరంజీవి మూడో కన్ను. అసభ్యత, అశ్లీలం, హింసకు తావివ్వకుండా ఇంతకాలం తన నటనతో ప్రజలను మెప్పించేందుకు ఆయన నిరంతరం శ్రమించారు. ఇతరులు ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలి. ఇష్టపడి పని చేస్తే కష్టం ఉండదు. అందుకు మెగాస్టార్ జీవితమే ఓ ఉదాహరణ. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నారు. కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే' అని ప్రశంసించారు.

వారికి బూత్ లో సమాధానం చెప్పండి

ప్రస్తుత రాజకీయాల్లో ప్రమాణాలు తగ్గిపోతున్నాయని.. అసెంబ్లీ, పార్లమెంటుల్లో జరిగే గలాటాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయని వెంకయ్యనాయుడు అన్నారు. నీతి, నిజాయితీ లేని వారికి, ప్రజలను రెచ్చగొట్టే వారికి గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. బూతులు మాట్లాడే నేతలకు ప్రజలు పోలింగ్ బూత్ ల్లోనే సమాధానం చెప్పాలని సూచించారు. కేవలం 4 'సి'లను నమ్ముకుని కొందరు రాజకీయాలు చేస్తున్నారని.. అవి క్యాస్ట్, కమ్యూనిటీ, క్యాష్, క్రిమినాలిటీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ పరిస్థితిని మార్చాలిన అవసరం అందరిపైనా ఉందని అన్నారు.

'పద్మ' గ్రహీతలకు ఘన సన్మానం

కాగా, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులకు ఎంపికైన వారిని తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. ఇందుకోసం హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పకళావేదికలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. పద్మ అవార్డుల్లో భాగంగా పద్మవిభూషణ్‌ పురస్కారానికి ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, చిరంజీవిని సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు సన్మానించారు. వారితో పాటు పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, ఆనందాచారి, ఉమామహేశ్వరి, కేతావత్‌ సోమ్‌లాల్‌, కూరెళ్ల విఠలాచార్యను కూడా ముఖ్యమంత్రి, మంత్రులు సత్కరించారు.

'రూ.25 లక్షల నగదు, పెన్షన్'

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘పద్మ అవార్డు గ్రహీతలను సన్మానించడం ఒక బాధ్యతగా భావించాం. ఇది రాజకీయాలకు అతీతమైన కార్యక్రమం. తెలుగువాళ్లు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా మనవారే. ఒక మంచి సంప్రదాయానికి పునాది వేసేందుకే ఈ కార్యక్రమం. ఈ సంప్రదాయాన్ని ఇలాగే కొనసాగించాలి. అవార్డు గ్రహీతలు ప్రభుత్వాన్ని అభినందించడమంటే.. మన ప్రజా పాలనను అభినందించినట్లే. పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు రూ.25 లక్షల నగదు బహుమతి ప్రభుత్వం తరపున అందిస్తాం. దీంతోపాటు ప్రతి నెల పద్మశ్రీ అవార్డు పొందిన కవులు, కళాకారులకు రూ.25 వేల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించాం. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు మనమంతా ఏకమై ముందుకు సాగాలి. ఒక తెలుగువాడిగా వెంకయ్య నాయుడు రాష్ట్రపతి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నా’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు.

Also Read: Chiranjeevi: నంది స్థానంలో గద్దర్ అవార్డ్స్‌, మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: తెలంగాణలో పవన్ సభను అడ్డుకోవడం సరికాదు: ఏపీ సీఎం చంద్రబాబు
తెలంగాణలో పవన్ సభను అడ్డుకోవడం సరికాదు: ఏపీ సీఎం చంద్రబాబు
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Professor Kodandaram: పవన్ కళ్యాణ్ ఇంత రాద్ధాంతం అవసరం లేదు.. ఇది తెలంగాణ అస్తిత్వంపై దెబ్బ: ప్రొఫెసర్ కోదండరాం
పవన్ కళ్యాణ్ ఇంత రాద్ధాంతం అవసరం లేదు.. ఇది తెలంగాణ అస్తిత్వంపై దెబ్బ: ప్రొఫెసర్ కోదండరాం
Pawan Kalyan Telangana Controversy 2026: పవన్ కల్యాణ్‌కు ‘వ్యతిరేకతే’ వరమైందా? తెలంగాణ పార్టీల అటాక్.. జనసేనకు లభించిన వ్యూహాత్మక మైలేజ్!
పవన్ కల్యాణ్‌కు ‘వ్యతిరేకతే’ వరమైందా? తెలంగాణ పార్టీల అటాక్.. జనసేనకు లభించిన వ్యూహాత్మక మైలేజ్!

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Peddi USA Collection : పెద్ది పెద్ద రికార్డు - ఓవర్సీస్ To తెలుగు స్టేట్స్... ఇప్పటివరకూ...
పెద్ది పెద్ద రికార్డు - ఓవర్సీస్ To తెలుగు స్టేట్స్... ఇప్పటివరకూ...
Manoj Bajpayee INDIA@2047 : ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మనోజ్ బాజ్‌పేయ్
ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మనోజ్ బాజ్‌పేయ్
Foods for Healthy Joints : కీళ్ల నొప్పులు తగ్గాలంటే.. ఈ 7 ఫుడ్స్ తప్పక డైట్‌లో చేర్చుకోండి, మోకాళ్ల ఆరోగ్యానికి ఇవి బెస్ట్
కీళ్ల నొప్పులు తగ్గాలంటే.. ఈ 7 ఫుడ్స్ తప్పక డైట్‌లో చేర్చుకోండి, మోకాళ్ల ఆరోగ్యానికి ఇవి బెస్ట్
Early Symptoms of Type 2 Diabetes : టైప్ 2 డయాబెటిస్ తొలి దశలో కనిపించే 7 ముఖ్య లక్షణాలు.. అలసట, దాహం నుంచి తరచూ మూత్రం వరకు
టైప్ 2 డయాబెటిస్ తొలి దశలో కనిపించే 7 ముఖ్య లక్షణాలు.. అలసట, దాహం నుంచి తరచూ మూత్రం వరకు
Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్ రివ్యూ... ఆ ఒక్క షాట్‌లో రవితేజ మాస్ టచ్ - డాటర్ సెంటిమెంట్ ఎక్కువ
ఇరుముడి గ్లింప్స్ రివ్యూ... ఆ ఒక్క షాట్‌లో రవితేజ మాస్ టచ్ - డాటర్ సెంటిమెంట్ ఎక్కువ
US Iran War: అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
Embed widget