అన్వేషించండి

Vemula Prashanth Reddy: రీజనల్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్పుపై సీబీఐ విచారణకు వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశాంత్

RRR Road Map : ఫోర్త్ సిటీ సౌలభ్యం కోసం అలైన్ మెంట్ మారుస్తున్నామంటూ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారని ప్రశాంత్ రెడ్డి అన్నారు. దీనిపై సీబీఐ విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Vemula Prashanth Reddy: రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం అలైన్ మెంట్ మార్పుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూ దందాలకు తెరతీస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. రైతుల నుంచి అక్రమంగా భూములు లాక్కుంటూ అరాచకాలకు పాల్పడుతున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీనిపై సీబీఐ విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన శుక్రవారం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు కీలక విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "రీజినల్ రింగ్ రోడ్ దక్షిణభాగం అలైన్ మెంట్ మార్పుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూదందాలకు తెరలేపుతోంది. కేంద్ర నిధులతో చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కేసీఆర్ ఒప్పించారు. ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం అలైన్ మెంట్ ఆమోదం పొందింది.  ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేదు. దక్షిణ భాగం అలైన్ మెంట్ కూడా గతంలోనే ఖరారు చేశారు. ఆమోదముద్ర పొందాల్సి ఉంది. స్వలాభం ఉందా లేదా అని కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిది నెలల్లో చూసుకొంది. స్వలాభం కోసం రీజినల్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మారుస్తూ పేదల భూముల్లో నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దక్షిణ భాగం భూసేకరణ, రోడ్డు కోసం రాష్ట్రం రూ.2500 కోట్లు, కేంద్రం రూ.12,500 కోట్లు ఖర్చు పెట్టాలి. కాంగ్రెస్ నేతల భూములు ఉన్న వైపు అలైన్ మెంట్ మారుస్తున్నారు. సాగర్ రోడ్ లో గొల్లపల్లి గ్రామం నుంచి కర్మపల్లి  గ్రామానికి 2కి.మి, శ్రీశైలం రోడ్డులో కాటన్ మిల్ నుండి అమన్ గల్ దాటి దాదాపు నాలుగు కిలోమీటర్లు దూరానికి మార్చారు’’ అని అన్నారు.

ఫోర్త్ సిటీకి దూరం 
ఫోర్త్ సిటీ సౌలభ్యం కోసం అలైన్ మెంట్ మారుస్తున్నామంటూ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారని ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఫోర్త్ సిటీ,  పాత అలైన్ మెంట్ మధ్య దూరం 10 కిలో మీటర్లు ఉంటే కొత్త అలైన్ మెంట్ మధ్య దూరం 12 కిలో మీటర్లు అయిందన్నారు.  అలైన్ మెంట్ మార్పుతో ఫోర్ట్ సిటీకి దూరమైందన్నారు. అమన్ గల్ వద్ద 400 ఎకరాల కుందారం భూములను పేదలు సాగు చేసుకుంటున్నారు. రాజ వంశీయులతో బేరం చేసుకొని పేదలను వెల్లగొట్టి కాంగ్రెస్ నేతలు భూములు ఆక్రమిస్తున్నారు. అక్కడ బిగ్ బ్రదర్స్  పేర్లు చెబుతున్నారని ప్రశాంత్ రెడ్డి అన్నారు.జనవరి నుంచే పేద రైతుల నుంచి కబ్జా రద్దు ఒప్పందాలు చేసుకుంటూ భూములు లాక్కుంటున్నారు. కబ్జా రద్దు ఒప్పందం మొదటిసారి చూస్తున్నామన్నారు.  అలైన్ మెంట్ మాటి కాంగ్రెస్ ఎమ్మెల్యే గ్రామం మీదుగా ఎలా వెళ్తోంది? మాడుగుల గ్రామం సీఎం బంధువులది, అక్కడ ఏం జరుగుతోంది? చేవెళ్ల మార్గంలో అంగడి చిట్టెంపల్లి నుంచి ఐదు కిలోమీటర్లు జరిగి మన్నెగూడ క్రాస్ రోడ్స్ కు మార్చారని ఎమ్మెల్యే అన్నారు.

భూములు సేకరించిన బిగ్ బ్రదర్స్
మన్నె గూడ సమీపంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ మంత్రి, కాంగ్రెస్ నేతల భూములు ఉన్నాయని ప్రజలు చెప్తున్నారు. బిగ్ బ్రదర్స్ భూములు సేకరించి పెట్టుకున్నారని అంటున్నారు. ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగంలో నాలుగు చోట్ల అలైన్ మెంట్ మార్చడం వెనకాల మతలబు ఏమిటి? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల భూములు ఉన్న వైపు అలైన్ మెంట్ మారుస్తున్నారు. ఇందులో బిగ్ బ్రదర్స్  హస్తం  ఉంది. మాడుగుల గ్రామం లో సీఎం బంధువుల భూములు ఉన్నాయి. ఎందుకోసం అలైన్ మెంట్ మారుస్తున్నారో స్పష్టంగా అర్థం అవుతోంది. అలైన్ మెంట్ మార్పు పై శ్వేత పత్రం విడుదల చేయాలి. మొదటి అలైన్ మెంట్ తో ఎలాంటి గొడవ లేదు. ఇప్పుడు అందరూ ఇబ్బంది పడుతున్నారు. అలైన్ మెంట్ మారుస్తూ పోతే కేంద్రం ప్రాజెక్టు టేకప్ చేయకపోవచ్చు కూడా అని ప్రశాంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.

అప్పుల భారం వేసే ప్రయత్నం
కేంద్రం చేయకపోయినా సరే రోడ్డు మా భూముల గుండా పోవాల్సిందే అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. తెలంగాణ పై 12500 కోట్ల అప్పుల భారం వేసి, ప్రజల్ని అప్పుల ఊబిలోకి నెట్టైనా సరే ప్రపంచబ్యాంకు నిధులతో చేపట్టాలని భావిస్తున్నారని ప్రశాంత్ రెడ్డి అన్నారు. కుట్రగేట్ అనే ప్రాంతంలో ఆఫీస్ ఏర్పాటు చేసుకొని మరి ఈ భూములు లాక్కునే  కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పాత అలైన్ మెంట్ కొనసాగించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా జోక్యం చేసుకొని పేదలు, గిరిజనుల బాధలు అర్థం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం మార్చాలని అనుకుంటే పూర్తి పారదర్శకంగా, పేదలకు మంచి పరిహారం ఇచ్చి చేయాలని డిమాండ్ చేశారు.  అలైన్ మెంట్ మార్పు వ్యవహారంపై సీబీఐ విచారణ కోరాలన్నారు. సీబీఐ విచారణ చేయకపోతే కాంగ్రెస్, భాజపా ఒక్కటే అని భావించాల్సి వస్తుందని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: మంత్రి మాట నమ్మి రైతులు మోసపోయారు, మీకు ఉరిశిక్ష వేసినా తప్పులేదు: హరీష్ రావు
మంత్రి మాట నమ్మి రైతులు మోసపోయారు, మీకు ఉరిశిక్ష వేసినా తప్పులేదు: హరీష్ రావు
Breaking News: విపక్షాల ఆందోళన.. పార్లమెంట్‌ ఉభయ సభలు రేపటికి వాయిదా
విపక్షాల ఆందోళన.. పార్లమెంట్‌ ఉభయ సభలు రేపటికి వాయిదా
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
Assembly Seats Increase: డీలిమిటేషన్ పార్లమెంట్‌కేనా.. అసెంబ్లీలకూ పెరుగుతాయా? తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు గ్యారంటీ ఎంత?
డీలిమిటేషన్ పార్లమెంట్‌కేనా.. అసెంబ్లీలకూ పెరుగుతాయా? తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు గ్యారంటీ ఎంత?

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: మంత్రి మాట నమ్మి రైతులు మోసపోయారు, మీకు ఉరిశిక్ష వేసినా తప్పులేదు: హరీష్ రావు
మంత్రి మాట నమ్మి రైతులు మోసపోయారు, మీకు ఉరిశిక్ష వేసినా తప్పులేదు: హరీష్ రావు
Indians Died In Russia Attack: ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
Kohli Magic Advice: సింధు గ్రాండ్ కంబ్యాక్ వెనుక కోహ్లీ మైండ్ బ్లాకింగ్ అడ్వైస్.. జపాన్ ఓపెన్ గోల్డ్ విక్టరీ సీక్రెట్ బయటపెట్టిన తెలుగు స్టార్!
సింధు గ్రాండ్ కంబ్యాక్ వెనుక కోహ్లీ మైండ్ బ్లాకింగ్ అడ్వైస్.. జపాన్ ఓపెన్ గోల్డ్ విక్టరీ సీక్రెట్ బయటపెట్టిన తెలుగు స్టార్!
Messi Retirement Speculation: మెస్సి రిటైర్మెంట్ పై కోచ్ స్కలోని అనౌన్స్ మెంట్.. అప్ప‌టివ‌ర‌కు ఆడ‌తాడ‌ని జోస్యం 
మెస్సి రిటైర్మెంట్ పై కోచ్ స్కలోని అనౌన్స్ మెంట్.. అప్ప‌టివ‌ర‌కు ఆడ‌తాడ‌ని జోస్యం 
భారత్‌లో అమ్మకానికి వచ్చిన ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ బైక్‌లు ఇవిగో - ఎథనాల్ మిశ్రమంపై ఇక ఆందోళన అక్కర్లేదు!
ఎథనాల్ టెన్షన్‌ను తగ్గించే E85 బైక్‌లు - E20 నుంచి E85 వరకు ఏ పెట్రోల్‌ అయినా వీటిలో వాడొచ్చు!
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
Pradeep Machiraju ETV Show: మళ్ళీ ఈటీవీకి మాచిరాజు... రష్మీని రీప్లేస్ చేసిన ప్రదీప్ - మరి సుధీర్ సంగతేంటి?
మళ్ళీ ఈటీవీకి మాచిరాజు... రష్మీని రీప్లేస్ చేసిన ప్రదీప్ - మరి సుధీర్ సంగతేంటి?
Embed widget