అన్వేషించండి

Adilabad News: ఉట్నూరు ఐటీడీఏ రోజువారీ కూలీల వెతలు - సమస్యలు పరిష్కరించాలని ధర్నా

ITDA daily wage workers : ఉట్నూరు ఐటీడీఏ రోజువారీ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని ధర్నాకు దిగారు. ఉద్యోగ భద్రత తో పాటు కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

Adilabad Utnur ITDA daily wage workers dharna :   ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటిడిఏ కార్యాలయం ముందు గత కొద్దిరోజులుగా ఆశ్రమ పాఠశాలలో పనిచేసే డైలీ  వేజ్ వర్కర్స్ ధర్నా చేస్తున్నారు. వారంతా ఇప్పుడు  నిరవధిక సమ్మె చేపట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలో పనిచేసే రోజువారీ కార్మికులు,  కాంట్రాక్ట్ వర్కర్స్ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ ేచస్తున్నారు.  నిరవధిక సమ్మె చేపట్టి ఆందోళన కొనసాగిస్తున్నారు.  

డైలీ వేజ్, కాంట్రాక్ కార్మికుల నిరవధిక సమ్మె                        
 
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఐటిడిఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న డైలీ వేజ్,  కాంట్రాక్ట్ వర్కర్స్ సిబ్బంది తాము గత కొన్నేళ్లుగా పనిచేస్తున్నప్పటికీనీ చాలి చాలని వేతనాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  తమకు ఉద్యోగ భద్రత కూడా లేదంటూ నాలుగు నెలలకోసారి ఇచ్చే వేతనాలు కూడా సరిపోవడం లేదంటూ అవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం 64 జీవోను విడుదల చేసిందని, ఆ జీవోను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.  దినసరి ఉద్యోగుల ఐకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు, ఐటీడీఏ డైలీ వైస్ వర్కర్స్ మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు కొడప మధునమ్మ, ఐటిడిఏ డైలీ వైస్ వర్కర్స్ రాష్ట్ర అధ్యక్షులు టేకం ప్రభాకర్, మరియు ఆదిలాబాద్ CITU జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ లు ఏబీపీ దేంతో తమ ఆవేదన వెలిబుచ్చారు.                      

ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న తమని గుర్తించాలని డిమాండ్            

గత 43 రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సమ్మె కోనసాగుతోందని, ఉట్నూర్ ఐటిడిఏ కార్యాలయం ముందు 3 రోజులుగా 72గంటల నిరవధిక సమ్మె చేయడం జరుగుతుందని, ప్రభుత్వం గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న తమని గుర్తించాలని తమ విద్యార్థులకు సేవలు అందించే విధంగా తమకు ఉద్యోగ భద్రత తో పాటు కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఐటిడిఎ కార్యాలయం ముందు రాత్రి పగలు ఇక్కడే ఉంటూ రాత్రుల్లోనూ ధర్నా నిర్వహించడం జరిగిందని, అయినా ఏమాత్రం తనని ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.                   

ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తాం !                                      

ప్రభుత్వమే తమను పట్టించుకోవాలని.. ఆదుకోకపోతే తాము ఎలా బతకాలని వారు ప్రశ్నిస్తున్నారు.  ఇప్పటికైనా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి తమకి ఉద్యోగ భద్రత కల్పిస్తూ కనీస వేతనం పెంచి తమని ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకొంటున్నారు. లేనిపక్షంలో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం అదే విధంగా మంత్రుల ఇళ్లు, ఎమ్మెల్యేల ఇళ్లు  ముట్టడిస్తామని హెచ్చరించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం మధు రిడ్జ్ పార్క్ అపార్ట్‌మెంట్ స్థలం అక్కర్లేదు: సీఎం రేవంత్ రెడ్డి
గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం మధు రిడ్జ్ పార్క్ అపార్ట్‌మెంట్ స్థలం అక్కర్లేదు: సీఎం రేవంత్ రెడ్డి
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
Rangareddy Crime News: సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
Hyderabad Police Raids QNet: క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు

వీడియోలు

MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam
Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
National Highways: జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
Strait of Hormuz: హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
Embed widget