అన్వేషించండి

Kishan Reddy on Modi Telangana Tour: ప్రధాని మోదీ తెలంగాణకు వస్తే కేసీఆర్ కు జ్వరం వస్తుంది - కిషన్​రెడ్డి ఎద్దేవా

Kishan Reddy About PM Modi Telangana Tour: ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చినప్పుడల్లా, మంత్రి  కేసీఆర్​కు జ్వరం వస్తుందని కిషన్​రెడ్డి ఎద్దేవా చేశారు. దమ్ముంటే చర్చలకు రావాలని సవాల్ విసిరారు.

Kishan Reddy About PM Modi Telangana Tour: 
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ దాదాపు 10 రోజుల నుంచి వైరల్ ఫీవర్ తో బాధ పడుతున్నారు. ఆయనకు జ్వరం తగ్గకపోవడంతో రాష్ట్ర కేబినెట్ భేటీ సైతం వాయిదా పడింది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నాయి బీజేపీ శ్రేణులు. అయితే ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చినప్పుడల్లా, మంత్రి  కేసీఆర్​కు జ్వరం వస్తుందని కిషన్​రెడ్డి ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి బీజేపీ అగ్రనేతలు రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా వారిపై బురదజల్లే ప్రయత్నం తప్పా బీఆర్ఎస్ నేతలు చేసేది ఏమీ లేదన్నారు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసింది, ఎన్ని నిధులు ఇచ్చింది? బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఏం చేసిందో చర్చకు సిద్ధమా అని సీఎం కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. వారి రాష్ట్రానికి ప్రధాని వస్తే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్వయంగా ఎయిర్ పోర్టుకు వెళ్లి స్వాగతం పలుకుతారని గుర్తుచేశారు. సీపీఎం సీఎం సైతం ప్రధాని మోదీకి స్వాగతం పలికారని, కేసీఆర్ మాత్రం అందుకు భిన్నంగా జ్వరం అని సాకులు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కు దమ్ముంటే అమరవీరుల స్థూపం వద్ద రాష్ట్రానికి చేసిన ప్రయోజనంపై, కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. రాష్ట్రానికి సీఎంగా ఉండే అర్హత కేసీఆర్ కు లేదన్నారు. ఉద్దేశపూర్వకంగా బీజేపీని ఇరకాటంలో పెట్టాలని బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తన పనితీరుకు ప్రజలు సర్టిఫికెట్ ఇస్తారని, కేటీఆర్ సర్టిఫికెట్ ఎవరికి అక్కరలేదన్నారు. 

అక్టోబర్ 1, 3 తేదీల్లో ప్రధాని మోదీ రాబోతున్నారని కిషన్​రెడ్డి తెలిపారు. రెండ్రోజుల తెలంగాణ పర్యటలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అక్టోబర్ 1న జరిగే మహబూబ్‌నగర్ పర్యటనలో భాగంగా రూ.13,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. 3న నిజామాబాద్ లో జరగనున్న మీటింగ్ కు హాజరుకానున్నారు. 

మునీరాబాద్- మహబూబ్ నగర్ ప్రాజెక్టులో భాగంగా జక్లేర్ నుండి కృష్ణా వరకు కొత్తగా నిర్మించిన రూ.505 కోట్ల విలువైన రైల్వే లైనును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. దీంతో హైదరాబాద్ - గోవాల మధ్య దూరం 102 కిలోమీటర్ల వరకు తగ్గుతుందని తెలిపారు. కాచిగూడ- రాయచూరు మధ్య డెము సర్వీసును కూడా మోదీ ప్రారంభిస్తారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రతిసారి ప్రధాని మోదీ జాతీయ రహదారుల నిర్మాణాలు ప్రారంభిస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. హీరా అనే విధానంతో రాష్ట్రంలో రూ.1.2 లక్షల కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందన్నారు. యుద్ధప్రాతిపదికన జాతీయ రహదారులను అనుసంధానం చేయాలని కేంద్రం భావిస్తోంది.

పాలమూరు కేంద్రంగా రూ.13,545 కోట్ల అభివృద్ధి పనులను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. ఇందులో భాగంగా రూ.6,404 కోట్లతో చేపట్టే కొత్త జాతీయ రహదారుల ప్రాజెక్టులు ఉన్నాయి. మహబూబ్‌నగర్‌లో హెచ్‌పీసీఎల్‌ గ్యాస్‌ పైపులైన్‌ను సైతం మోదీ జాతికి అంకితం చేయనున్నారు. హసన్‌- చర్లపల్లి మధ్య రూ.2661 కోట్ల వ్యయంతో హెచ్‌పీసీఎల్‌ గ్యాస్‌ పైపులైన్‌ నిర్మాణం చేయనున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Feel The Jail: నేరం చేయకుండా జైలుకెళ్లాలని ఉందా? ఖైదీగా మారాలనుందా? - డబ్బులు కట్టి ఉండొచ్చు..ఇవిగో డీటైల్స్
నేరం చేయకుండా జైలుకెళ్లాలని ఉందా? ఖైదీగా మారాలనుందా? - డబ్బులు కట్టి ఉండొచ్చు..ఇవిగో డీటైల్స్
Extramarital Affair: పదో తరగతి ప్రేమ - పెళ్లయ్యాక వివాహేతర బంధం - క్లైమాక్స్ చాలా వయోలెంట్ !
పదో తరగతి ప్రేమ - పెళ్లయ్యాక వివాహేతర బంధం - క్లైమాక్స్ చాలా వయోలెంట్ !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Bandi Sanjay Son POCSO Case: కుమారుడి పోక్సో కేసు - బండి సంజయ్ రాజకీయ ఎదుగుదలకు ఇది శాపమా?
కుమారుడి పోక్సో కేసు - బండి సంజయ్ రాజకీయ ఎదుగుదలకు ఇది శాపమా?

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget