అన్వేషించండి

TSRTC News: తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే న్యూస్ - ఎలాంటి బస్సులో అయినా నగదు రహిత ప్రయాణం!

TSRTC News: తెలంగాణ ఆర్టీసీలోని అన్ని రకాల బస్సుల్లో నగదు రహిత ప్రయాణం చేసే అవకాశాన్ని ఆర్టీసీ కల్పిస్తోంది. డిజిటల్ చెల్లింపులు చేసే వెసులుబాటును ఇస్తోంది.  

TSRTC News: తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే న్యూస్ చెప్పింది. బస్సుల్లో నగదు రహిత ప్రయాణం చేసే వెసులుబాటు కల్పిస్తోంది. ముఖ్యంగా డిజిటల్ చెల్లింపులు చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సహా ఆపైస్థాయి బస్సులు అన్నింట్లో ఐ-టిమ్స్ పరికరాలను అందుబాటులోకి తెస్తున్నారు. డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి వాటితో చెల్లింపులు చేయొచ్చని చెబుతోంది. ఈమేరకు బండ్లగూడ బస్ డిపోను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. డిపోలోని ఆర్డినరీ, మెట్రో సహా మొత్తం 145 బస్సుల్లో ఐ-టిమ్స్ ను వాడేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అనంతరం కంటోన్మెంట్ డిపోలో అమలు చేశాక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8,300 బస్సుల్లో దశలవారీగా ప్రవేశ పెట్టేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఆర్టీసీ బస్సుల్లో టికెట్ తీసుకునేటప్పుడు చిల్లర సమస్యతో కండక్టర్లు, ప్రయాణికుల అనేక సమస్యలు వస్తుంటాయి. చిల్లర ఇవ్వమని కండక్టర్, లేవని ప్రయాణికులు గొడవలు పడిన సంఘటనలు కోకొల్లలు. అయితే ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టడానికి యాజమాన్య బట్ టికెట్లను రౌండ్ ఫిగర్లుగా మార్చింది. రూ.10, 15, 20, 25.. ఇలా రౌండ్ ఫిగర్ చేసేసింది. అయినప్పటికీ సమస్యలకు చెక్ పడలేదు. దీంతో దూర ప్రాంత, అధిక ఛార్జీలు ఉండే 700 బస్సుల్లో (సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో) ఐ-టిమ్స్ ను ప్రవేశ పెట్టారు. మిగిలిన 8 వేల 300 బస్సుల్లో సాధారణ టిమ్స్ మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పుడు వీటిల్లో కూడా నగదు రహిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చి.. ఇటు ఉద్యోగులతో పాటు ప్రయాణికుల సమస్యలను తీర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

ఇటీవలే ప్రయాణికులకు ఫ్రీ వైఫై కల్పిస్తూ..

తెలంగాణలో ఆర్టీసీబసుల్లో ప్రయాణించే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. బస్సుల్లో ఫ్రీ వైఫై సదుపాయం కల్పిస్తున్నట్టు ప్రకటించింది. ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చినట్టు ఆర్టీసీఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. 

వచ్చే నెల నుంచి హైదరాబాద్ రోడ్లపై విద్యుత్ బస్సులు

గ్రేటర్ జోన్ పరిధిలో వచ్చే నెల నుంచి విద్యుత్ బస్సులను నడిపాలని తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. కొత్తగా వచ్చే విద్యుత్ బస్సులను నగరంలో ఏయే మార్గాల్లో నడపాలనే దానిపై ఆర్టీసీ అధికారులు ఆన్ లైన్ సర్వే చేస్తున్నారు. ముఖ్యంగా ఏ మార్గంలో విద్యుత్ బస్సులు నడిపితే ఆక్యుపెన్సీ పెరుగుతుంది, పాత మార్గాల్లోనే వీటిని నడపాలా లేదా కొత్త మార్గాలను ఎంపిక చేయాలా అని ఆలోచిస్తుంది. అంతేకాకుండా మెట్రో రైళ్లు ఉన్న మార్గాల్లో నడిపితే లాభం ఉంటుందా అనే దానిపై ప్రజల స్పందన కోరుతున్నారు. ఇందుకోసమే ఆన్ లైన్ లో సర్వే నిర్వహించి.. ఆపై నిర్ణయం తీసుకోనున్నారు. ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయంతో వచ్చే ఆరు నుంచి ఏడాదిలోగా దాదాపు వెయ్యికి పైగా విద్యుత్ బస్సులను నడిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఇందుకోసం ఇప్పటికే ఒలెక్ట్రా కంపెనీతో కూడా ఆర్టీసీ యాజమాన్యం ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. నగరంలో నడిపించే విద్యుత్ బస్సులు నాన్ ఏసీగా ఉంటాయి. అందుకు సంబంధించిన నమూనా బస్సును ఇప్పటికే ఒలెక్ట్రా విడుదల చేసింది. అన్ని సక్రమంగా ఉంటే నగరంలో తొలి విడతగా 28 బస్సులను తీసుకురానున్నారు. నగరంలో వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు నగర ప్రజలకు ప్రాణవాయువు పెంచాలన్న లక్ష్యంతోనే ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను తీసుకు వస్తోంది. అయితే ప్రస్తుతం నగరంలో తిరుగుతున్న కాలం చెల్లిన బస్సులను స్క్రాప్ కు పంపించి.. వాటి స్థానంలో విద్యుత్ బస్సులను ఏర్పాటు చేస్తోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Anirudh Reddy: సినిమాలో పవన్ గుడుంబా తాగితే తప్పు లేదు ..నేను సారా అంటే తప్పు వచ్చిందా - కాంగ్రెస్ ఎమ్మెల్యే వింత వాదన
సినిమాలో పవన్ గుడుంబా తాగితే తప్పు లేదు ..నేను సారా అంటే తప్పు వచ్చిందా - కాంగ్రెస్ ఎమ్మెల్యే వింత వాదన
Bengaluru Siddipet Couple: భర్త ఉరి వేసుకున్నాడని తెలిసి భార్య 17వ అంతస్తు నుంచి దూకేసింది - బెంగళూరులో సిద్ధిపేట దంపతుల విషాదం
భర్త ఉరి వేసుకున్నాడని తెలిసి భార్య 17వ అంతస్తు నుంచి దూకేసింది - బెంగళూరులో సిద్ధిపేట దంపతుల విషాదం
BRS MLA Padi Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
Jayalalithaa Residence: హైదరాబాద్‌లో తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఇల్లు సీజ్.. అసలు కారణం ఇదే..!
హైదరాబాద్‌లో తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఇల్లు సీజ్.. అసలు కారణం ఇదే..!

వీడియోలు

CSK Plays Without Dhoni in 17 Years IPL 2026 | ధోనీ, రైనా, జడేజా లేకుండా CSK మ్యాచ్ | ABP Desam
Jadeja Destroys CSK vs RR IPL 2026 | ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన జడేజా | ABP Desam
IPL 2026 RR VS CSK Highlights | చెన్నైపై రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ | ABP Desam
Vaibhav Suryavanshi RR vs CSK IPL 2026 | వైభవ్ కు సలహా ఇచ్చిన జైస్వాల్ | ABP Desam
Rohit Suggestions to Hardik IPL 2026 | హిట్ మ్యాన్ వ్యూహంతో ముంబై విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Vaidya Seva: ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
BRS MLA Padi Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
Iran Target Tech Companies: ఇరాన్ హిట్ లిస్ట్‌లో టెక్‌ సంస్థలు! షేక్ అవుతున్న కార్పొరేట్ దిగ్గజాలు, అమెరికా! 
ఇరాన్ హిట్ లిస్ట్‌లో టెక్‌ సంస్థలు! షేక్ అవుతున్న కార్పొరేట్ దిగ్గజాలు, అమెరికా! 
AP handloom weavers: ఏపీలో చేనేతలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ - అమల్లోకి ఉచిత విద్యుత్ పథకం
ఏపీలో చేనేతలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ - అమల్లోకి ఉచిత విద్యుత్ పథకం
Kerala Assembly Elections: కేరళలో బీజేపీ అగ్రనేతల విస్తృత ప్రచారం - మార్పు కనిపిస్తోందని ధీమా!
కేరళలో బీజేపీ అగ్రనేతల విస్తృత ప్రచారం - మార్పు కనిపిస్తోందని ధీమా!
ITR Forms:ఐటీఆర్‌ ఫైల్ చేసే వారికి బిగ్ అలర్ట్! రెండు ఇళ్లు ఉన్న వారికి గుడ్ న్యూస్!
ఐటీఆర్‌ ఫైల్ చేసే వారికి బిగ్ అలర్ట్! రెండు ఇళ్లు ఉన్న వారికి గుడ్ న్యూస్!
Donald Trump: దారిలోకి రాని ఇరాన్! ట్రంప్‌లో పెరిగిపోతున్న అసహనం! మిత్రదేశాలకు తీవ్ర హెచ్చరిక!
దారిలోకి రాని ఇరాన్! ట్రంప్‌లో పెరిగిపోతున్న అసహనం! మిత్రదేశాలకు తీవ్ర హెచ్చరిక!
Arshdeep Singh News: అర్ష్‌దీప్ సింగ్ చెత్త ఫీట్: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన ఓవర్ వేసిన స్పీడ్ స్ట‌ర్
అర్ష్‌దీప్ సింగ్ చెత్త ఫీట్: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన ఓవర్ వేసిన స్పీడ్ స్ట‌ర్
Embed widget