అన్వేషించండి

TRS Plenary: నేడే టీఆర్ఎస్ ప్లీనరీ, 20 ఏళ్ల పార్టీ.. 60 ఏళ్ల కలను నెరవేర్చింది..! ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్

గత ఏడేళ్లుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షలు ఒక్కొక్కటిగా నెరవేర్చిందని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ వ్యాఖ్యానించారు. వరంగల్‌లో విజయగర్జన సభ నిర్వహిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఏర్పాటై 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం (అక్టోబర్ 25న) జరగనున్న పార్టీ ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. నవంబర్ 15న వరంగల్ లో భారీ సభకు ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు తమ పార్టీ ఘనతపై టీఆర్ఎస్ నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు. తాజాగా ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ వరంగల్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 20 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ పార్టీ విజయవంతంగా ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ వచ్చిందన్నారు.

గత ఏడేళ్లుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రజల 60 ఏళ్ల కలను నెరవేరుస్తూ పాలన కొనసాగిస్తుందన్నారు. టీఆర్ఎస్ పార్టీకి సెంటిమెంట్ ప్లేస్ అయిన వరంగల్‌లో విజయ గర్జన పేరుతో 10 లక్షల మందితో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. సుమారు 600 ఎకరాల్లో భారీ బహిరంగ సభ కార్యక్రమాలకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ‘తెలంగాణ ప్రజలు తమ ఆకాంక్ష నెరవేర్చుకునేందుకు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. టీఆర్ఎస్ పాలనతో వారి ఆశలు, ఆకాంక్షలు ఒక్కొక్కటిగా కేసీఆర్ ప్రభుత్వం నెరవేర్చుతుంది. పార్టీ ఏర్పాటు చేసి 20 ఏళ్లు పూర్తయిన సందర్బంగా భారీ సభను ఏర్పాటుచేస్తున్నాం.

Also Read: బీజేపీని బొంద పెడితే అన్ని తగ్గుతాయ్, ఇక్కడ టీఆర్ఎస్ గెలిస్తే.. మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన

తెలంగాణలో కోటి ఎకరాలకు నీరు
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో కోటి ఎకరాలకు నీరు అందేలా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. దేశంలో ఏ పార్టీ సైతం ఇంత తక్కువ కాలంలో ప్రజల మన్ననలు పొందలేదు. టీఆర్ఎస్ పార్టీకి ఆ గౌరవం దక్కింది. రైతులకు సకాలంలో రుణమాఫీ జరుగుతుంది. ఎరువులు, మద్దతు ధర లాంటి సదుపాయాలు కలిస్తున్నాము. రాబోయే 100 ఏళ్ల వరకు తెలంగాణ ప్రజలకు సేవ చేసేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోంది. హనుమకొండ జిల్లా టీఆర్ఎస్ కార్యాలయం నిర్మాణం ఇటీవల పూర్తయింది. త్వరలోనే ప్రారంభిస్తామని’ తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ వివరించారు.

Also Read: బీజేపీ -కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి ఈటల అంటూ కేటీఆర్ ప్రచారం ! టీఆర్ఎస్‌కి ప్లస్సా ? మైనస్సా ?

టీఆర్ఎస్ ప్రభుత్వం  అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. కానీ బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎలాంటి సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదన్నారు. ప్రజా క్షేత్రంలో ఉన్న పార్టీలకు మాత్రమే ఆదరణ లభిస్తోందని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని దాస్యం వినయ్ భాస్కర్ అభిప్రాయపడ్డారు. 

Also Read: ఆ సాక్ష్యాలు బయట పెడతా.. ఎన్నికల కమిషన్ చేసిన పని కరక్టేనా.. ప్లీనరీ ఏర్పాట్లలో కేటీఆర్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget