అన్వేషించండి

Revant Vs Komatireddy : రేవంత్‌పై కోమటిరెడ్డిదే పైచేయి.. టీ కాంగ్రెస్ ఆధిపత్య పోరాటంలో కొత్త కోణం..!

ఇంద్రవెల్లి తర్వాత ఇబ్రహీంపట్నంలో " దళిత, గిరిజన దండోరా " సభ పెట్టాలని రేవంత్ నిర్ణయించారు. అయితే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి తాను హాజరు కాబోనని చెప్పడంతో వేదిక మార్చారు.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈ నెల 18వ తేదీన ఇబ్రహీంపట్నంలో చేపట్టాలనుకున్న " దళిత, గిరిజన దండోరా" రెండో సభ స్థలాన్ని మార్పు చేశారు. ఇబ్రహీంపట్నంలో నిర్వహించడానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో  రావిరాల గ్రామానికి సభా వేదికను మార్చారు. నిజానికి పోలీసుల అనుమతి అని కారణం చెబుతున్నారు కానీ అసలు విషయం మాత్రం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అడ్డుపుల్ల వేయడమేనని కాంగ్రెస్‌లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఈ సభ వేదికను మార్చడం వెనుక కాంగ్రెస్‌లో అంతర్గత రాజకీయం చాలా ఎక్కువగా జరిగిందని చెబుతున్నారు. 

తన నియోజకవర్గంలో " దళిత, గిరిజన దండోరా "కు రాలేనన్న కోమటిరెడ్డి..!

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్ దళిత వర్గాలను ఆకట్టుకునేందుకు దళిత బంధు పథకాన్నిప్రవేశ పెట్టారు. దీనికి కౌంటర్‌గా దళితులతో పాటు గిరిజన వర్గాలను వంచించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ " దళిత, గిరిజన దండోరా " సభలను నిర్వహించాలని నిర్ణయించింది. మొదటగా ఇంద్రవెల్లిలో నిర్వహించారు. తర్వాతి సభను 18వ తేదీన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నిర్వహించాలని వేదిక ఖరారు చేశారు. కానీ అనూహ్యంగా సభా వేదికను రావిరాల గ్రామానికి మార్చారు. గతంలో రేవంత్ రెడ్డి వ్యవసాయ సమస్యలపై పాదయాత్ర చేసి రావిరాలలోనే ముగింపు సభ నిర్వహించారు. ఇప్పుడు అక్కడే " దళిత, గిరిజన దండోరా " నిర్వహించాలని నిర్ణయించారు. దానికి కారణంగా పోలీసులు అనుమతి ఇవ్వలేదని చెబుతున్నారు. కానీ అసలు విషయం మాత్రం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభ్యంతరం చెప్పడమేనంటున్నారు. 
Also Read: Weather Updates: తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఏపీలో కూడా ఈ ప్రాంతాల్లో.. వాతావరణశాఖ హెచ్చరిక

చివరికి సభా వేదికను మార్చిన రేవంత్ రెడ్డి..!

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం భువనగిరి పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది.  ప్రస్తుతం భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉన్నారు.  అయితే తన ప్రమేయం లేకుండా " దళిత, గిరిజన దండోరా "నిర్వహించడం... తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా సభ వేదిక, సమయాన్ని ఖరారు చేయడం ఏమిటని ఆయన నేరుగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ముఖ్యుల్లో ఒకరైన కేసీ వేణుగోపాల్ అటు కోమటిరెడ్డితోనూ ఇటు రేవంత్‌రెడ్డితోనూ మాట్లాడారని కాంగ్రెస్ వర్గాలు చెపుతున్నాయి. తర్వాత కోమటిరెడ్డి కూడా రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారని.. ఇబ్రహీంపట్నంలో 18వ తేదీన సభ పెడితే తాను హాజరు కాబోనని.. తనకు పార్లమెంటరీ కమిటీ సమావేశాలు ఉన్నాయని చెప్పారు. దాంతో స్థానిక ఎంపీ లేకుండా " దళిత, గిరిజన దండోరా "సభ నిర్వహిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న కారణంగా సభా వేదికను మార్చాలని రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇంద్రవెల్లిలో జరిగిన " దళిత, గిరిజన దండోరా "సభకు కూడా కోమటిరెడ్డి హాజరు కాలేదు. ప్రస్తుతం నిర్వహించాలనుకుంటున్న రావిరాల గ్రామం చేవెళ్లే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. దాంతో అక్కడకు సభావేదికను మార్చారు.

రేవంత్‌ రెడ్డికి సొంత పార్టీలోనే సహాయ నిరాకరణ ఎదురవుతోందా..?

ఇబ్రహీంపట్నంలో సభ నిర్వహణకు పోలీసులు అనుమతి నిరాకరిస్తే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరింత అడ్వాంటేజ్‌గా తీసుకుని సభను నిర్వహించేవారని.. ఆయన దూకుడు రాజకీయం తెలిసిన కాంగ్రెస్ నేతలంటున్నారు. సభకు మరింత హైప్ తెచ్చుకునేందుకు పోలీసుల అణిచివేతను వాడుకునేవారంటున్నారు. అయితే ఇక్కడ పోలీసుల ఆంక్షల కన్నా ఎక్కువగా ఆయనకు సొంత పార్టీలో ఇబ్బందులే ఎక్కువ అని.. అందుకే సభా వేదికను మార్చుకోక తప్పలేదంటున్నారు. పీసీసీ చీఫ్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి సీనియర్లు అందర్నీ కలిసి .. కలసి పని చేద్దామని ఆహ్వానించారు. ఒక్క కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాత్రమే తనను కలవొద్దని రేవంత్ రెడ్డి మొహం మీదనే చెప్పారు. అదే పద్దతిలో రేవంత్ రెడ్డికి సహకరించేందుకు సిద్ధంగా లేరని తాజా పరిణామాలతో వెల్లడవుతోందని టీ కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. టీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీలో అందరూ ఏకతాటిపైకి రాలేదని ఈ ఘటనలు మరోసారి నిరూపించాయంటున్నారు.  

Also Read: Huzurabad By Elections: హుజూరాబాద్ లో రోజురోజుకు మారుతున్న సమీకరణాలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

FASTag New Rules: బ్లాక్‌ లిస్ట్‌ నుంచి బయటకురాకపోతే 'డబుల్‌ ఫీజ్‌' - టోల్‌గేట్ల దగ్గర ఈ రోజు నుంచి కొత్త రూల్స్‌
బ్లాక్‌ లిస్ట్‌ నుంచి బయటకురాకపోతే 'డబుల్‌ ఫీజ్‌' - టోల్‌గేట్ల దగ్గర ఈ రోజు నుంచి కొత్త రూల్స్‌
TG New Ration Cards: మీకు రేషన్ కార్డు లేదా? తెలంగాణ ప్రభుత్వం కొత్త కార్డుల జారీ చేసేది ఎప్పుడంటే..
మీకు రేషన్ కార్డు లేదా? తెలంగాణలో కొత్త కార్డులు జారీ చేసేది ఎప్పుడంటే..
Pawan Kalyan – Harish Shankar : హరీష్ శంకర్ లీక్స్... 'ఉస్తాద్ భగత్ సింగ్'లో పవన్ కళ్యాణ్ ఐకానిక్ పొలిటికల్ సీన్ రీక్రియేట్
హరీష్ శంకర్ లీక్స్... 'ఉస్తాద్ భగత్ సింగ్'లో పవన్ కళ్యాణ్ ఐకానిక్ పొలిటికల్ సీన్ రీక్రియేట్
Nara Lokesh: జగన్ పాలనతో ఏపీలో పెద్ద ఎత్తున ఆర్థిక విధ్వసం- లెక్కలు వెల్లడించిన నారా లోకేష్
జగన్ పాలనతో ఏపీలో పెద్ద ఎత్తున ఆర్థిక విధ్వసం- లెక్కలు వెల్లడించిన నారా లోకేష్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
FASTag New Rules: బ్లాక్‌ లిస్ట్‌ నుంచి బయటకురాకపోతే 'డబుల్‌ ఫీజ్‌' - టోల్‌గేట్ల దగ్గర ఈ రోజు నుంచి కొత్త రూల్స్‌
బ్లాక్‌ లిస్ట్‌ నుంచి బయటకురాకపోతే 'డబుల్‌ ఫీజ్‌' - టోల్‌గేట్ల దగ్గర ఈ రోజు నుంచి కొత్త రూల్స్‌
TG New Ration Cards: మీకు రేషన్ కార్డు లేదా? తెలంగాణ ప్రభుత్వం కొత్త కార్డుల జారీ చేసేది ఎప్పుడంటే..
మీకు రేషన్ కార్డు లేదా? తెలంగాణలో కొత్త కార్డులు జారీ చేసేది ఎప్పుడంటే..
Pawan Kalyan – Harish Shankar : హరీష్ శంకర్ లీక్స్... 'ఉస్తాద్ భగత్ సింగ్'లో పవన్ కళ్యాణ్ ఐకానిక్ పొలిటికల్ సీన్ రీక్రియేట్
హరీష్ శంకర్ లీక్స్... 'ఉస్తాద్ భగత్ సింగ్'లో పవన్ కళ్యాణ్ ఐకానిక్ పొలిటికల్ సీన్ రీక్రియేట్
Nara Lokesh: జగన్ పాలనతో ఏపీలో పెద్ద ఎత్తున ఆర్థిక విధ్వసం- లెక్కలు వెల్లడించిన నారా లోకేష్
జగన్ పాలనతో ఏపీలో పెద్ద ఎత్తున ఆర్థిక విధ్వసం- లెక్కలు వెల్లడించిన నారా లోకేష్
Producer SKN : తెలుగు వచ్చిన అమ్మాయిలని ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో తెలిసింది... 'బేబీ' నిర్మాత కాంట్రవర్షియల్ కామెంట్స్
తెలుగు వచ్చిన అమ్మాయిలని ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో తెలిసింది... 'బేబీ' నిర్మాత కాంట్రవర్షియల్ కామెంట్స్
Hyderabad Vijayawada Traffic Diversions: పెద్దగట్టు చేరిన దేవరపెట్టె - ఈ 20 వరకు హైదరాబాద్‌- విజయవాడ మార్గంలో ట్రాఫిక్‌ మళ్లింపు
పెద్దగట్టు చేరిన దేవరపెట్టె - ఈ 20 వరకు హైదరాబాద్‌- విజయవాడ మార్గంలో ట్రాఫిక్‌ మళ్లింపు
Delhi Earthquake: ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం, అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ
ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం, భయంతో నిద్రలేచిన ప్రజలు- అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ
Vicky Kaushal: 'ఖాన్'దాన్‌ల అడ్డాలో... కత్రినా భర్త నుంచి కోట్లు కొల్లగొట్టే హీరోగా - బాలీవుడ్ నెక్ట్స్ సూపర్‌ స్టార్‌ విక్కీ కౌశల్!
'ఖాన్'దాన్‌ల అడ్డాలో... కత్రినా భర్త నుంచి కోట్లు కొల్లగొట్టే హీరోగా - బాలీవుడ్ నెక్ట్స్ సూపర్‌ స్టార్‌ విక్కీ కౌశల్!
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.