అన్వేషించండి

Top Headlines: ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం ప్రారంభం - ధర్మవరంలో టీడీపీ విస్తృత ప్రచారం, కాంగ్రెస్ లో చేరనున్న కూన శ్రీశైలం గౌడ్

Top News: తెలుగు రాష్ట్రాల్లో ఉదయం నుంచి ఉన్న టాప్ హెడ్ లైన్స్ మీకోసం.

Top Headlines in Telugu States on April 5th:

1. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం ప్రారంభం

వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసిన వారికే జగన్ మళ్లీ టిక్కెట్ ఇచ్చారని.. హత్యా రాజకీయాలు పోవాలంటే జగనన్నను ఓడించాలని వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. కడప జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని ఆమె ప్రారంభించారు. కడప లోక్ సభ ఎన్నికల్లో ఓ వైపు రాజశేఖరరెడ్డి బిడ్డ.. మరోవైపు వివేకాను హత్య చేయించిన అవినాశ్ రెడ్డి ఉన్నారని అన్నారు. హంతకులు చట్ట సభలకు వెళ్లకూడదనే తాను కడప ఎంపీగా పోటీ చేస్తున్నానని చెప్పారు. ధర్మం కోసం ఒకవైపు తాను... డబ్బుతో అధికారాన్ని కొందామనుకునే వ్యక్తి మరోవైపు ఉన్నారని ఎవరిని గెలిపించాలనేది ప్రజలే నిర్ణయించుకోవాలని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2. ధర్మవరంలో పొలిటికల్ హీట్

ధర్మవరం నియోజకవర్గం(Dharmavaram assembly constituency) లో రాజకీయ వాతావరణం హీటెక్కింది. వైసీపీ (YSRCP) తరఫున ఇక్కడ కేతిరెడ్డి వెంకట్‌రామిరెడ్డి(Kethireddy Venkatarami Reddy) పోటీ చేస్తుంటే కూటమి తరఫున బీజేపీ లీడర్‌ సత్యకుమార్(Satya Kumar) బరిలో ఉన్నారు. గుడ్‌మార్నింగ్ ధర్మవరం అంటూ నిత్యం ప్రజల్లోనే ఉంటూ వచ్చారు కేతిరెడ్డి. సత్యకుమార్ తాజాగా ప్రచారం ప్రారంభించారు. మరి ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది. ఎవరిపై ఎవరు పైచేయి సాధిస్తారనే ఉత్కంఠ నెలకొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

3. కాంగ్రెస్ లో చేరిన కూన శ్రీశైలం గౌడ్

బీజేపీ నాయకుడు కూన శ్రీశైలం‌గౌడ్ కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యారు. పార్టీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఓ సారి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా  గెలిచారు. ఆ ప్రాంతంలో గట్టి పట్టుకున్న నేత కూడా.  మాస్ లీడర్‌గా కూన శ్రీశైలంగౌడ్ మాంచి పేరుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కుత్బుల్లాపూర్‌లో రెండో స్థానంలో నిలిచారు. ఆయనకు  లక్షకు పైగా ఓట్లు వచ్చాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

4. టీఎస్ ఎప్ సెట్ అభ్యర్థులకు అలర్ట్

తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల కోసం నిర్వహించనున్న 'టీఎస్ ఈఏపీసెట్-2024' దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 26న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఎప్‌సెట్ దరఖాస్తు గడువు ఏప్రిల్ 6తో ముగియనుంది. అభ్యర్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇక రూ.250 ఆల‌స్య రుసుమతో ఏప్రిల్ 9 వ‌ర‌కు, రూ.500 ఆల‌స్య రుసుముతో ఏప్రిల్ 14 వరకు, రూ.2500 ఆల‌స్య రుసుముతో ఏప్రిల్ 19 వ‌ర‌కు, రూ.5000 ఆల‌స్య రుసుముతో మే 4 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. దరఖాస్తు వివరాల్లో ఏమైనా తప్పులుంటే ఏప్రిల్ 8 నుంచి 12 వరకు ఎడిట్ చేసుకోవ‌చ్చు. రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలోనే ఈడ‌బ్ల్యూఎస్ అభ్యర్థులు త‌మ వివ‌రాల‌ను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

5. మ్యాచ్ కు ముందు ఉప్పల్ లో కరెంట్ ఫైట్

ఉప్పల్‌(Uppal) మ్యాచ్‌ రికార్డులతో ఎంత ఫేమస్ అయిందో వివాదాలతో కూడా అంతే ఫేమస్‌. కీలకమైన ఐపీఎల్ (IPL 2024) మ్యాచ్ జరుగుతున్న టైంలో విద్యుత్‌ శాఖతో ఇచ్చిన ఝలక్‌కు నిర్వాహకులకు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి ఏర్పండి. విద్యుత్ బకాయిలు ఉన్నాయని చెప్పి మ్యాచ్‌కు 24 గంటల ముందు ఉప్పల్ స్టేడియానికి సరఫరాల నిలిపేయడం పెను సంచలనంగా మారింది. ఈ వార్త జాతీయ స్థాయిలో కూడా మోతమోగిపోయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అఫ్గానిస్తాన్‌లో భారీ భూకంపం: ఢిల్లీ టు కాశ్మీర్ వణికిన ఉత్తరాది..
అఫ్గానిస్తాన్‌లో భారీ భూకంపం: ఢిల్లీ టు కాశ్మీర్ వణికిన ఉత్తరాది..
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 
Suhas as Saattapuli: సాట్టపులిగా సుహాస్... 80 కోట్ల బడ్జెట్ సినిమాలో విలన్ రోల్!
సాట్టపులిగా సుహాస్... 80 కోట్ల బడ్జెట్ సినిమాలో విలన్ రోల్!
Embed widget