అన్వేషించండి

Telangana Power : "పవర్‌" ఫుల్ ..అందరూ కొంటూంటే తెలంగాణ అమ్ముతోంది !

దేశంలో చాలా రాష్ట్రాలు విద్యుత్ సంక్షోభంలో ఉన్నాయి. కానీ తెలంగాణ మాత్రం మిగులులో ఉంది. రెండు రోజుల్లో 49 మి.యూ ఇతర రాష్ట్రాలకు అమ్మింది.


దేశంలో కరెంట్ సంక్షోభం ఏర్పడిందని గగ్గోలు రేగుతోంది. అయితే అది కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే. కొన్ని రాష్ట్రాలు మిగులు విద్యుత్‌ను అమ్ముకుని దండిగా ఆదాయం సంపాదిస్తున్నాయి. ఈ రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది. తెలంగాణ ప్రభుత్వం గత రెండు రోజులుగా 49 మిలియన్ యూనిట్లను పవర్ ఎక్స్ఛేంజ్‌ల ద్వారా ఇతర రాష్ట్రాలకు అమ్మింది. ప్రస్తుతం పీక్ అవర్స్‌లో ఒక్కో యూనిట్ రూ. 20 వరకూ పలుకుతోంది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఆదాయం లభించినట్లుగా తెలుస్తోంది. 

Also Read : ప్రజలకు కోతలు విధించి ఎక్స్ఛేంజీలలో కరెంట్ అమ్మకం .. కొన్ని రాష్ట్రాలపై కేంద్రం ఆగ్రహం !
  
ప్రస్తుతం తెలంగాణకు విద్యుత్ సమస్య లేదు. ధర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమైనంత  బొగ్గు అందుబాటులో ఉంది. జల విద్యుత్ ప్రాజెక్టులూ యథావిధిగా నడుస్తున్నారు. ప్రాజెక్టులన్నీ నిండు కుండలా ఉన్నాయి. దీంతో తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారింది. తెలంగాణలో కరెంట్ కోతలు విధించడం లేదు. ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ ఉండటంతో గరిష్టంగా ఉత్పత్తి చేస్తూ బహిరంగ విపణిలో అమ్ముతోంది.  ప్రస్తుతం తెలంగాణలో వినియోగం 198.26 మిలియన్‌ యూనిట్లుగా ఉంది. ఇందులో జెన్‌కో థర్మల్‌ విద్యుత్కేంద్రాల వాటా 72.35 మిలియన్‌ యూనిట్లు కాగా, జెన్‌కో జలవిద్యుత్‌ కేంద్రాల వాటా 45.60 మిలియన్‌ యూనిట్లు, ఇక సింగరేణి థర్మల్‌ కేంద్రం 25.93 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తును అందిస్తోంది.

Also Read : దేశంలో విద్యుత్ సంక్షోభంపై పవర్ మినిస్టర్ ఏమన్నారంటే?

కేంద్ర ప్రభుత్వ విద్యుత్తు సంస్థల నుంచి 26.66 మిలియన్‌ యూనిట్లు, సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా 27.288 మిలియన్‌ యూనిట్లు లభిస్తోంది.  దేశంలోని పలుప్రాంతాల్లో కొరత ఉండడంతో తెలంగాణ విద్యుత్తును ఎనర్జీ ఎక్స్చేంజ్‌ ఆఫ్‌ ఇండియాలో అమ్ముతోంది.  సోమవారం 29 మిలియన్‌ యూనిట్లు, మంగళవారం 20 మిలియన్‌ యూనిట్లను విక్రయించింది. ఆయా సమయాల్లో డిమాండ్‌ను యూనిట్‌ ధర గరిష్ఠంగా రూ.20 వరకు పలుకుతుండడం  వల్ల భారీగా భారీగా ఆదాయం సమకూరినట్లయింది. 

Also Read : ఏపీలో ముందుంది కోతల కాలం .. కరెంట్ జాగ్రత్తగా వాడుకోవాలని ప్రజలకు ప్రభుత్వం సలహా !

కేంద్ర ప్రభుత్వం మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాలు అమ్ముకోవద్దని అవసరం ఉన్నరాష్ట్రాలకు పంపిణీ చేయాలని మంగళవారం ఆదేశించింది. కొన్ని రాష్ట్రాలు ప్రజలకు కోతలు విధించి మరీ అమ్ముతున్నాయని.. ఇలా చేస్తే కేంద్రం వద్ద ఉన్న మిగులు విద్యుత్‌ను కేటాయించబోమని హెచ్చరించింది. అయితే తెలంగాణ మాత్రం కోతలు విధించడం లేదు.. మిగులు విద్యుత్‌ను మాత్రమే అమ్ముతోంది. 

Also Read : విద్యుత్ కొరతపై ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ... యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి...

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Moinabad Drugs Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. డ్రగ్స్ వాడటం ఇదే తొలిసారి కాదా? శాంపిల్స్‌లో మరిన్ని అవశేషాలు
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. డ్రగ్స్ వాడటం ఇదే తొలిసారి కాదా? శాంపిల్స్‌లో మరిన్ని అవశేషాలు
Nandini Sidda Reddy : తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
Telangana Weather:: తెలంగాణకు వర్ష సూచన! హైదరాబాద్‌లో కుండపోత! రానున్న నాలుగు రోజులు కీలకం!
తెలంగాణకు వర్ష సూచన! హైదరాబాద్‌లో కుండపోత! రానున్న నాలుగు రోజులు కీలకం!
Jeevan Reddy: జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!

వీడియోలు

AIMIM MLAs Walkout Vandematarm | తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రుల ఫైర్ | ABP Desam
Jay Shah Smashes T20W C 2026 Controversies | పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు జై షా వార్నింగ్ | ABP Desam
Abhishek Sharma T20WC 2026 Secret Revealed | అభిషేక్ కు గంభీర్ సలహా | ABP Desam
Rishabh Pant Transformation IPL 2026 | యువరాజ్ సింగ్ శిక్షణలో రిషబ్ పంత్ | ABP Desam
Sanju Samson Funny Advice to Abhishek | అభిషేక్ శర్మకు సంజూ పెళ్లి సలహా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pakistan Airstrike: కాబూల్‌లో పాక్ వైమానిక దాడులు.. 400 మందికి పైగా మృతి- హాస్పిటల్స్, నివాస ప్రాంతాలే టార్గెట్
కాబూల్‌లో పాక్ వైమానిక దాడులు.. 400 మందికి పైగా మృతి- హాస్పిటల్స్, నివాస ప్రాంతాలే టార్గెట్
Jeevan Reddy: జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Iran War Updates: నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Nandini Sidda Reddy : తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
Sreeleela : శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
Embed widget