నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీకి నిరసనగా జులై 24న తెలంగాణలోని విద్యాసంస్థలకు బంద్కు పిలుపునిచ్చారు. ఇది శుక్రవారం జరగనుంది.
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్! నీట్ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్ల కార్యాచరణ!
నీట్ ప్రశ్నపత్రం లీకేజీతోపాటు విద్యావ్యవస్థలో జరుగుతున్న అవకతవకలపై తెలంగాణలోని విద్యార్థి సంఘాలు ఉద్యమ బాట పట్టాయి. శుక్రవారం తెలంగాణలో విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చాయి.

- నీట్ లీకేజీ, విద్యా వ్యవస్థ వైఫల్యాలపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం.
- కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ప్రధాన డిమాండ్.
- ఎన్.టి.ఎ రద్దు, విద్యార్థులపై కేసుల ఉపసంహరణకు నిరసన.
- జూలై 24న రాష్ట్ర విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చారు.
Telangana Schools Bandh On Friday: విద్యావ్యవస్థను నాశనం చేసేలా కేంద్రం చర్యలు ఉన్నాయని తెలంగాణలోని విద్యార్థి లోకం కూడా గళమెత్తింది. అందులో భాగంగానే నీట్ ప్రశ్నాపత్రాలు లీకేజీ ఇతర అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనంతటికీ కారణమైన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వారంతా డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్తో తెలంగాణలో విద్యాసంస్థలకు ఎల్లుండి బంద్ కాల్ ఇచ్చారు.
జులై 24న తెలంగాణలోని విద్యాసంస్థలన్నీ బంద్ చేసి విద్యార్థులు చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని విద్యార్థి సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. ఇందులో SFI, AISF, NSUI, PSDU, AIFDS సంఘాలు ఉద్యమ కార్యాచరణ ప్రారంభించాయి. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతు తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు.
విద్యావ్యవస్థను నాశనం చేసిన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని వారు మొదటి డిమాండ్గా చెప్పారు. తర్వాత పరీక్షలు సరిగా నిర్వహించకుండా ప్రశ్నాపత్రాల లీకేజీకి కారణమైన NTAను రద్దు చేయాలి. విద్యావ్యవస్థను నాశనం చేసే వికాస్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లును వెనక్కి తీసుకోవాలి. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీకి కారణమైన వారిపై చర్యలకు డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేపట్టిన నిరసనలో లాఠీఛార్జ్ చేసిన వారిపై చర్యలకు డిమాండ్ చేశారు. విద్యార్థులపై పెట్టిన కేసులు కూడా వెనక్కి తీసుకోవాలని నినదించారు.
ఈ డిమాండ్ల నెరవేరేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మేథావులు సహకరించాలని విద్యార్థి సంఘాలు విజ్ఞప్తి చేశారు. అందులో భాగంగా శుక్రవారం జరిగే విద్యాసంస్థల బంద్కు సహకరించాలని అన్నారు. మోదీ అధికారంలోకి వచ్చి నాటి నుంచి ప్రభుత్వ విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనమైందని ఆరోపించారు. అడిగే వారిపై దమనకాండకు దిగుతున్నారని అన్నారు. నీట్ పేపర్ లీకేజీ కారణంగా చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, దీనికి ఎవరు బాధ్యత వహించాలని నిలదీశారు.
ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు అన్నీ కూడా బంద్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరించారు.
Frequently Asked Questions
తెలంగాణలో విద్యాసంస్థల బంద్ ఎప్పుడు?
విద్యాసంస్థల బంద్కు ప్రధాన కారణం ఏమిటి?
నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ, ఇతర అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. విద్యావ్యవస్థను నాశనం చేస్తున్నారని నిరసనగా ఈ బంద్కు పిలుపునిచ్చారు.
విద్యాసంస్థల బంద్కు ఎవరు పిలుపునిచ్చారు?
తెలంగాణలో విద్యాసంస్థల బంద్కు విద్యార్థి సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. SFI, AISF, NSUI, PSDU, AIFDS వంటి సంఘాలు ఇందులో పాల్గొంటున్నాయి.
విద్యార్థి సంఘాల ప్రధాన డిమాండ్లు ఏమిటి?
విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, NTAను రద్దు చేయాలని వారి ప్రధాన డిమాండ్లు. వికాస్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లును వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు.
ట్రెండింగ్ వార్తలు





















