అన్వేషించండి

TS Secretariat : మహారక్షణ వలయంలో కొత్త సెక్రటేరియట్, భద్రత బాధ్యతలు టీఎస్ఎస్పీకి అప్పగింత

సచివాలయ సెక్యూరిటీ బాధ్యతలు TSSPకి అప్పగింతTSSP నుంచి నిరంతరం మూడు కంపెనీల గస్తీ

Telangana News :  కొత్త సచివాలయం శత్రుదుర్భేద్యం! సెక్యూరిటీ కన్నుగప్పి చీమ కూడా లోపలికి దూరలేదు! సెక్రటేరియట్ చుట్టూ ఐదంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. సుమారు 470 మంది సిబ్బంది నిరంతరం పహారా కాస్తుంటారు. అక్టోపస్ నుంచి స్పెషల్ యూనిట్ గస్తీలో ఉంటుంది. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేకమైన వ్యవస్థ ఉంది. సచివాలయానికి కట్టుదిట్టమైన భద్రత కల్పించే బాధ్యతను TSSP చూసుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ నూతన సచివాలయానికి ఐదంచెల భద్రత ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సచివాలయాన్ని శత్రుదుర్భేద్యంగా మారుస్తున్నారు. నూతన సచివాలయానికి పటిష్టమైన భద్రత కల్పించే బాధ్యతను డీజీపీ అంజనీకుమార్‌ తెలంగాణ స్టేట్‌ స్పెషల్‌ పోలీస్‌ (TSSP) కు అప్పగించారు.  

అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో.. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్మించిన నూతన సచివాలయాన్ని ఈ నెల 30న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ఇంద్రభవనాన్ని తలపిస్తున్న సచివాలయాన్ని చూసేందుకు ఇప్పటికే ఎంతోమంది సందర్శకులు క్యూ కడుతున్నారు. సచివాలయం ప్రారంభమైన తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రజల రాకతో సచివాలయ ప్రాంగణం కిక్కిరిసిపోయే అవకాశం ఉన్నందున భద్రతాపరంగా ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పటిష్టమైన రక్షణ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు సచివాలయానికి పోలీస్‌ శాఖ ఐదంచెల భద్రతను ఏర్పాటు చేసింది.

మూడు కంపెనీల నుంచి మొత్తం 270 మంది సిబ్బంది విధులు

ప్రభుత్వ ఆదేశాల మేరకు TSSP నుంచి మూడు కంపెనీల బలగాలు నిరంతరం గస్తీ కాస్తాయి. సచివాలయానికి పక్కనే అమరవీరుల స్థూపం, అంబేద్కర్‌ 125 అడుగుల భారీ విగ్రహం, ఎన్టీఆర్‌ ఘాట్‌, పక్కనే హుస్సేన్‌ సాగర్‌, నెక్లెస్‌ రోడ్‌ ఈవెంట్స్‌, ఆ పక్కనే ఐమాక్స్‌ ఉండటం, ఆ ప్రాంతమంతా టూరిస్ట్‌ స్పాట్‌గా మారడంతో భద్రతాపరంగా ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. TSSP బెటాలియన్‌ నుంచి ఒక్కో కంపెనీలో 90 మంది సిబ్బంది ఉంటారు. వీరిలో ముగ్గురు కమాండెంట్లు, ఆరుగురు అసిస్టెంట్‌ కమాండెంట్లు, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ ర్యాంకు సిబ్బంది ఆరుగురు, ఆర్‌ఎస్‌ఐలు 12 మంది, ఏఎస్‌ఐలు 18 మంది, హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు కలిపి మొత్తం 90 మంది ఉంటారు. ఇలా మూడు కంపెనీల నుంచి మొత్తం 270 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. పాత సచివాలయానికి కేవలం 150 మంది ఎస్‌పీఎఫ్‌ సిబ్బందితో రక్షణ కల్పించేవారు. కొత్త సచివాలయానికి ఆ సంఖ్య నాలుగింతలు పెరిగింది.

ఆక్టోపస్ కూడా అక్కడే ఓ కన్నువేసి ఉంటుంది

TSSP కంపెనీల బలగాలకు తోడు ఆక్టోపస్‌ నుంచి ఓ యూనిట్‌ను సచివాలయ భద్రతకు కేటాయించారు. ఈ స్పెషల్‌ యూనిట్‌లో మొత్తం 21 మంది సిబ్బంది ఉంటారు. వీరికి ర్యాంకులవారీగా విధి విధానాలు ఉంటాయి. సిటీ సెక్యూరిటీ వింగ్‌కు చెందిన 80 మంది సిబ్బంది కూడా సచివాలయ భద్రతలో భాగం కానున్నారు. వీరు ప్రత్యేకంగా చెకింగ్‌, బ్యాగేజీ చెకింగ్‌, బాంబ్‌, మెటల్‌ చెకింగ్‌ వంటి విధులు నిర్వర్తిస్తారు. ఈ విభాగంలో అడిషనల్‌ డీసీపీ ర్యాంకు అధికారి ఒకరు, ఏసీపీ ర్యాంకు అధికారులు ముగ్గురు, ఆర్‌ఐలు ఆరుగురు, ఆర్‌ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు ఉంటారు. వీరితోపాటు సివిల్‌ పోలీసుల (సివిల్‌ ఫోర్స్‌) నుంచి ఇద్దరు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు, ఆరుగురు ఎస్‌ఐలు, మిగతా సిబ్బంది మొత్తం కలిపి 32 మంది కేవలం సచివాలయ భద్రత కోసం పనిచేస్తారు. ఇంటలిజెన్స్‌ విభాగం నుంచి అడిషనల్‌ ఎస్పీ ఒకరు, ఏసీపీ ఒకరు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, ఇతర సిబ్బంది భద్రతలో భాగమవుతారు. ఇక స్పెషల్‌ బ్రాంచ్‌ నుంచి ఏసీపీ, సీఐ, ఇద్దరు ఎస్‌ఐలు, సుమారు 8 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తిస్తారు.

ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు

సచివాలయ పరిసరాల పరిధిలో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇందుకోసం సుమారు 25 మంది ట్రాఫిక్‌ సిబ్బంది షిఫ్టులవారీగా విధులు నిర్వర్తిస్తారు. ప్రస్తుతం సెక్రటేరియట్‌కు 22 మంది ట్రాఫిక్‌ సిబ్బందిని కేటాయించారు. ఇన్‌స్పెక్టర్‌, ఎస్‌ఐ, మిగిలిన ర్యాంకుల సిబ్బంది ఉంటారు. వీరు సెక్రటేరియట్‌ పార్కింగ్‌, సీఎం మూమెంట్‌, మంత్రుల పార్కింగ్‌, విజిటర్స్‌ పార్కింగ్‌, ఉద్యోగులు, పౌరుల కోసం పనిచేస్తారు. అమరవీరుల స్థూపం, అంబేద్కర్‌ భారీ విగ్రహం, సచివాలయ ప్రాంతాలకు ఎక్కువగా పర్యాటకులు వచ్చే అవకాశం ఉండటంతో.. సచివాలయంలోకి వెళ్లే ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు విధులకు ఇబ్బంది కలుగకుండా ట్రాఫిక్‌ సిబ్బందిని సిద్ధం చేశారు. ట్రాఫిక్‌ రద్దీ పెరిగిన మరుక్షణమే సిబ్బందిని పెంచేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు హైదరాబాద్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు.

 468 మంది సిబ్బంది నిరంతరం విధులు నిర్వర్తిస్తుంటారు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఇక నుంచి అంబేద్కర్‌ నూతన సచివాలయం భద్రతను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ చూసుకుంటుంది. సిటీ పోలీస్‌, ఆక్టోపస్‌, ఇంటలిజెన్స్‌, ట్రాఫిక్‌ వంటి విభాగాలను సమన్వయం చేసుకొంటూ కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తారు. రక్షణ విషయంలో రాజీ లేకుండా పహారా కాసే మూడు కంపెనీల సిబ్బందికి ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. మొత్తం 300 మందిని సిద్ధంగా ఉంచారు. వీరంతా త్వరలో విధుల్లో చేరే అవకాశం ఉంది. రాబోయే కాలంలో ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, పౌరులు, సచివాలయ భద్రత దృష్ట్యా సిబ్బందిని మరింత పెంచే అవకాశం ఉంది. నూతన సచివాలయ భద్రతకు సంబంధించి చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ (సీఎస్‌వో)గా టీఎస్‌ఎస్పీ 3వ బెటాలియన్‌ అడిషనల్‌ కమాండెంట్‌ పి.వెంకట్రాములుకు బాధ్యతలు అప్పగించారు. కొత్త సచివాలయానికి పటిష్టమైన భద్రతను అందించేందుకు సుమారు 468 మంది సిబ్బంది నిరంతరం విధులు నిర్వర్తిస్తుంటారు. భద్రత విషయంలో రాజీ పడకుండా కట్టుదిట్టమైన చర్యలు  తీసుకుంటున్నారు.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Desam Smart Ed Conclave 2026: జీవితంలో సక్సెస్ కావాలంటే ఈ మూడు ఉండాలి, రిస్క్ లేకపోతే లైఫ్ లేదు: స్కోప్ సీఈవో అప్పల్ల సాయికిరణ్
జీవితంలో సక్సెస్ కావాలంటే ఈ మూడు ఉంటే చాలు - ABP Desam Smart Ed Conclave లో అప్పల్ల సాయికిరణ్
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ABP Desam Smart Ed Conclave 2026: స్కిల్ ఉంటే ప్రపంచం నీ జేబులో ఉన్నట్టే: ABP Desam Smart Ed Conclave 2026లో నెక్ట్స్‌ వేవ్‌ సీఈవో రాహుల్‌!
స్కిల్ ఉంటే ప్రపంచం నీ జేబులో ఉన్నట్టే: ABP Desam Smart Ed Conclave 2026లో నెక్ట్స్‌ వేవ్‌ సీఈవో రాహుల్‌!
Hyderabad Fire Accident: బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Vijay one chance please: ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
Iran Israel War: ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
Christian controversy in AP Legislative Council: శాసనమండలిలో క్రిస్టియన్ అంశంపై దుమారం - క్షమాపణ చెప్పిన అచ్చెన్న - అసలేం జరిగిందంటే?
శాసనమండలిలో క్రిస్టియన్ అంశంపై దుమారం - క్షమాపణ చెప్పిన అచ్చెన్న - అసలేం జరిగిందంటే?
Ustaad Bhagat Singh: వారం ముందుకు పవన్ 'ఉస్తాద్'... బ్యాగ్రౌండ్‌కు తమన్ బదులు డిఎస్పీ?
వారం ముందుకు పవన్ 'ఉస్తాద్'... బ్యాగ్రౌండ్‌కు తమన్ బదులు డిఎస్పీ?
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు
Embed widget