అన్వేషించండి

Telangana Panchayat Elections: ముగిసిన రెండో విడత పంచాయతీ ఎన్నికలు.. పలుచోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీ

తెలంగాణలో ఆదివారం ఉదయం ప్రారంభమైన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మధ్యాహ్నం ఒంటి గంటలోపు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వారికి అధికారులు ఓటు అవకాశం కల్పించారు.

హైదరాబాద్: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. ఆ సమయంలోపు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వారికి ఓటు హక్కు అవకాశం కల్పించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండో దశలో 193 మండలాల పరిధిలోని 3,911 గ్రామ  సర్పంచులు, 29,917 వార్డు సభ్యుల పదవులకు పోలింగ్ జరిగింది.

ఈ దశలో మొత్తం 57,22,465 మంది ఓటర్ల కోసం 38,337 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో సర్పంచ్ పదవుల కోసం 12,782 మంది అభ్యర్థులు, వార్డు సభ్యుల స్థానాల కోసం 71,071 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. ఓట్ల లెక్కింపు పూర్తయితే సర్పంచులు, వార్డ్ మెంబర్స్ ఫలితాలను ఎన్నికల అధకారులు ప్రకటించనున్నారు.


Telangana Panchayat Elections: ముగిసిన రెండో విడత పంచాయతీ ఎన్నికలు.. పలుచోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీ

ఓటు వేసిన ఎంపీలు, ఎమ్మెల్యేలు..

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ల మండలం గొల్లపల్లిలో కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మంజుల దంపతులు దుబ్బాక మండలం పోతారంలో ఓటు వేశారు. అక్బర్‌పేట బొంపల్లి మండలం బొప్పాపూర్‌లో బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొత్తగూడెం- విద్యానగర్ పోలింగ్ బూత్‌లో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, దమ్మపేట మండలం గండుగులపల్లిలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, నాగర్‌కర్నూల్ జిల్లా తూడుకుర్తి గ్రామంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే Dr. కూచుకుళ్ల, రాజేష్ రెడ్డి, సరిత దంపతులు, నల్లబెల్లి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 


11 గంటల వరకు 56.71 శాతం ఓటింగ్
తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ఉదయం 9 గంటల వరకు 22.54శాతం పోలింగ్‌ నమోదు కాగా, ఉదయం 11 గంటల వరకు 56.71 శాతం పోలింగ్‌ నమోదైంది. జిల్లాల వారీగా పోలింగ్‌ శాతాలను పరిశీలిస్తే.. ఆ సమయానికి ఖమ్మం జిల్లాలో 64.2 శాతం,  సూర్యాపేటలో 60.07 శాతం, వరంగల్‌లో 59.31, మెదక్ జిల్లాలో ఉదయం 11 గంటల వరకు 58.43 శాతం, సంగారెడ్డి జిల్లాలో 58.43 శాతం, భద్రాద్రి కొత్తగూడెంలో 57.57, యాదాద్రి భువనగిరిలో 56.51, రంగారెడ్డి జిల్లాలో 54.33 శాతం, హనుమకొండలో 54.11, వికారాబాద్ జిల్లాలో 52.35 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

సెల్‌ టవర్‌ ఎక్కిన సర్పంచి అభ్యర్థి భర్త 
మెదక్ జిల్లా నార్సింగిలో సర్పంచ్ అభ్యర్థి భర్త సెల్ టవర్ ఎక్కి హల్‌చల్ చేశారు. నర్సంపల్లి పెద్దతండా పంచాయతీ సర్పంచ్ పదవికి శంకర్ నాయక్ భార్య పోటీ చేస్తున్నారు. అయితే ప్రత్యర్థులు ఓటుకు రూ.2 వేలు ఇచ్చి ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని ఆరోపించారు. గతంలో తాను సర్పంచ్ పదవికి పోటి చేసి ఓడిపోయానని, డబ్బులు పంచి ప్రత్యర్థులు ఎన్నికల్లో నెగ్గుతున్నారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన తెలపడంతో కాసేపు గందరగోళం నెలకొంది.

నాగర్‌కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజిపేట మండలం అవంచలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌ నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ బలపరిచిన సర్పంచి అభ్యర్థులు చంద్రకళ, సౌమ్య వర్గీయుల మధ్య వాగ్వవాదం జరిగి, ఘర్షణకు దారితీసింది. పరస్పరం దాడి చేసుకోవడంతో సర్పంచ్ అభ్యర్థులు ఇద్దరికి గాయాలుకాగా, వారిని జడ్చర్ల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని సమాచారం. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలకు సైతం స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు సర్దిచెప్పకపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని తెలుస్తోంది.

ఖమ్మం జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి మృతి
పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సర్పంచ్ అభ్యర్థి మృతిచెందడంతో ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో విషాదం నెలకొంది. అనాసాగర్‌లో సర్పంచ్ పదవికి దామాల నాగరాజు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నాగరాజు ఒత్తిడికి లోనవడంతో శనివారం అస్వస్థతకు గురయ్యాడు. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ నాగరాజు ఆదివారం ఉదయం మృతిచెందారని సమాచారం.

మెదక్ జిల్లాలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ..
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కోనాయిపల్లెలో పంచాయతీ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్నారంటూ బీజేపీ, కాంగ్రెస్ వర్గాలు వాగ్వాదానికి దిగగా.. ఇది ఘర్షణకు దారితీసింది. పోలీసులు వారిని చెదరగొట్టడంతో గొడవ సద్దుమణిగింది.

మహబూబాబాద్‌ జిల్లా తొర్రూర్‌లోనూ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇతర గ్రామాల వారు వచ్చి ప్రచారం నిర్వహిస్తున్నారని బీఆర్ఎస్‌ నేతలు అభ్యంతరం తెలపడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణతో ఉద్రిక్తత నెలకొంది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 3rd T20: ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
Pawan Kalyan Helps Cricketers: అంధ క్రికెటర్లు దీపిక, ప్లేయర్ కరుణ కుమారి కుటుంబాలకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్
అంధ క్రికెటర్ల కుటుంబాలకు అండగా నిలిచిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Premante OTT : ఓటీటీలోకి లవ్ రొమాంటిక్ కామెడీ 'ప్రేమంటే' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి లవ్ రొమాంటిక్ కామెడీ 'ప్రేమంటే' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Top Mileage Cars in India: వ్యాగన్ ఆర్ నుంచి టాటా పంచ్ వరకు.. రూ.10 లక్షలలోపు అధిక మైలేజ్ ఇచ్చే కార్లు
వ్యాగన్ ఆర్ నుంచి టాటా పంచ్ వరకు.. రూ.10 లక్షలలోపు అధిక మైలేజ్ ఇచ్చే కార్లు
Advertisement

వీడియోలు

Abhishek Sharma to Break Virat Record | కోహ్లీ అరుదైన రికార్డుపై కన్నేసిన అభిషేక్
India vs South Africa 3rd T20 | భారత్ x సౌతాఫ్రికా మూడో టీ20
Robin Uthappa on Gambhir Ind vs SA | గంభీర్ పై ఉత్తప్ప కామెంట్స్
Suryakumar Yadav Form in SA T20 Series | సూర్య కుమార్ యాదవ్ పై ట్రోల్స్
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 3rd T20: ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
Pawan Kalyan Helps Cricketers: అంధ క్రికెటర్లు దీపిక, ప్లేయర్ కరుణ కుమారి కుటుంబాలకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్
అంధ క్రికెటర్ల కుటుంబాలకు అండగా నిలిచిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Premante OTT : ఓటీటీలోకి లవ్ రొమాంటిక్ కామెడీ 'ప్రేమంటే' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి లవ్ రొమాంటిక్ కామెడీ 'ప్రేమంటే' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Top Mileage Cars in India: వ్యాగన్ ఆర్ నుంచి టాటా పంచ్ వరకు.. రూ.10 లక్షలలోపు అధిక మైలేజ్ ఇచ్చే కార్లు
వ్యాగన్ ఆర్ నుంచి టాటా పంచ్ వరకు.. రూ.10 లక్షలలోపు అధిక మైలేజ్ ఇచ్చే కార్లు
Shocking News: పాఠాలు వింటూ కుప్పకూలిన విద్యార్ధిని.. కోన‌సీమ జిల్లా రామ‌చంద్ర‌పురంలో విషాదం
పాఠాలు వింటూ కుప్పకూలిన విద్యార్ధిని.. కోన‌సీమ జిల్లా రామ‌చంద్ర‌పురంలో విషాదం
Masaka Masaka Song : ఓల్డ్ రొమాంటిక్ 'మసక మసక చీకటిలో...' - పాప్ సింగర్ స్మిత ర్యాప్ మిక్స్ విత్ న్యూ ట్రెండ్
ఓల్డ్ రొమాంటిక్ 'మసక మసక చీకటిలో...' - పాప్ సింగర్ స్మిత ర్యాప్ మిక్స్ విత్ న్యూ ట్రెండ్
Etala Rajender Fire: నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
Census India 2027: జనగణన సమయంలో తప్పుడు సమాచారం ఇస్తే జైలు శిక్ష విధిస్తారా, రూల్స్ ఏంటి?
జనగణన సమయంలో తప్పుడు సమాచారం ఇస్తే జైలు శిక్ష విధిస్తారా, రూల్స్ ఏంటి?
Embed widget