అన్వేషించండి

Telangana Praja Palana: 6 గ్యారంటీల అమలు కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన: మంత్రి దామోదర రాజనర్సింహ

Praja Palana Begins from 28 December: సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందాలన్న ఉద్దేశంతో ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టినట్లు మంత్రి సి.దామోదర రాజనర్సింహ తెలిపారు.

Telangana Government Launches Praja Palana: మహబూబ్ నగర్: సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందాలన్న ఉద్దేశంతో ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టినట్లు మంత్రి సి.దామోదర రాజనర్సింహ (Damodara Raja Narasimha) తెలిపారు. సమీకృత కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో బుధవారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా (Mahabubnagar District)కు సంబంధించి నిర్వహించనున్న ప్రజా పాలన కార్యక్రమం సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ నెల 28 నుండి జనవరి 6 వరకు ప్రజా పాలన ( Praja Palana) కార్యక్రమం చేపట్టి గ్రామాలు, మున్సిపాలిటీలు, నగరాలలో ప్రజల నుంచి సంక్షేమ పథకాలైన ఆరు గ్యారంటీల లబ్ది కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు.

ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రజా పాలన.. 
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక బాధ్యతతో సక్రమంగా వాటిని ప్రజలకు అందించే ఆలోచనతోనే ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. హామీల అమలులో భాగంగానే 6 గ్యారంటీలను అమలు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. అధికారులు ప్రజల ముందుకు వెళ్లి వాటిని ప్రజలకు అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రతిరోజు అధికారులు గ్రామాలకు వెళ్లి ప్రజల నుండి దరఖాస్తులను ఈ నెల 28 నుండి జనవరి 6 వరకు స్వీకరించనున్నారు. ఆ సమయంలో దరఖాస్తు చేసుకోవడానికి వీలులేని వారి నుంచి సైతం అనంతరం ఇద్దరు అధికారులు గ్రామాల్లో కొనసాగుతూ ప్రజల వద్ద నుంచి ప్రజా పాలన దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. కార్యక్రమం అనంతరం మిగిలిపోయిన వారు పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తులు ఇవ్వవచ్చని చెప్పారు. తమ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని ఇచ్చిన వాగ్దానాన్నింటిని నెరవేరుస్తామని చెప్పారు. ప్రజా పాలన  కార్యక్రమం అమలుకు మరిన్ని సూచనలు ఇస్తే పాటిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.

ఎన్నో త్యాగాల ఫలితంగా తెలంగాణ వచ్చిందని, ప్రభుత్వం  ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అధికారులు, సిబ్బంది ప్రజల వద్దకు వెళ్లి పథకాలు పొందేందుకు అర్హుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రజా పాలన కార్యక్రమం పై విస్తృతంగా ప్రచారం చేయాలని, ఎవరికి ఇబ్బంది కలగకుండా దరఖాస్తులను స్వీకరించాలన్నారు. ఆ పది రోజులపాటు వీలైనన్నీ కౌంటర్లు ఏర్పాటు చేయాలని, కలెక్టర్లు, జిల్లా అధికారులు పూర్తి సహకారం అందించాలని సూచించారు. ప్రజాపాలన కార్యక్రమంపై అన్ని రకాలుగా ప్రచారం నిర్వహించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BRS MLA Padi Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
Jayalalithaa Residence: హైదరాబాద్‌లో తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఇల్లు సీజ్.. అసలు కారణం ఇదే..!
హైదరాబాద్‌లో తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఇల్లు సీజ్.. అసలు కారణం ఇదే..!
Today LPG, CNG, PNG Costs : LPG, CNG, PNG సిలిండర్ల కొత్త ధరలు.. హైదరాబాద్లోనే గ్యాస్ కాస్ట్ ఎక్కువ
LPG, CNG, PNG సిలిండర్ల కొత్త ధరలు.. హైదరాబాద్లోనే గ్యాస్ కాస్ట్ ఎక్కువ
India Census 2027: ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్త జనగణన.. ఏపీ, తెలంగాణలో ప్రక్రియ షెడ్యూల్ ఇదే
ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్త జనగణన.. ఏపీ, తెలంగాణలో ప్రక్రియ షెడ్యూల్ ఇదే

వీడియోలు

Vaibhav Suryavanshi RR vs CSK IPL 2026 | వైభవ్ కు సలహా ఇచ్చిన జైస్వాల్ | ABP Desam
Rohit Suggestions to Hardik IPL 2026 | హిట్ మ్యాన్ వ్యూహంతో ముంబై విజయం | ABP Desam
Rohit Sharma Fastest Half Century IPL 2026 | ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్ | ABP Desam
Rohit Dance in Front of Injured Rahane | రహానే కింద పడిపోతే.. రోహిత్ డాన్స్ | ABP Desam
Rahane Innings KKR vs MI IPL 2026 | వాంఖడేలో కేకేఆర్ పరుగుల విధ్వంసం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS MLA Padi Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
Bihar Stampede: ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
Third Temple In Israel: ఇజ్రాయెల్‌లో మూడో టెంపుల్ గొడవేంటి..? మెస్సియా కోసం యూదుల ఎదురుచూపులు.. ఇరాన్‌తో యుద్ధంలో నెతన్యాహు మతం సెంటిమెంట్
ఇజ్రాయెల్‌లో మూడో టెంపుల్ గొడవేంటి..? మెస్సియా కోసం యూదుల ఎదురుచూపులు.. ఇరాన్‌తో యుద్ధంలో నెతన్యాహు మతం సెంటిమెంట్
Manisharma : హార్మోనియం దుమ్ము దులిపి మరీ ట్యూన్స్ - చెన్నై లవ్ స్టోరీ సాంగ్స్‌పై మణిశర్మ రియాక్షన్
హార్మోనియం దుమ్ము దులిపి మరీ ట్యూన్స్ - చెన్నై లవ్ స్టోరీ సాంగ్స్‌పై మణిశర్మ రియాక్షన్
Explosion at Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత.. రేపే పార్లమెంటులోకి కీలక బిల్లు.. సర్వత్రా ఉత్కంఠ
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత.. రేపే పార్లమెంటులోకి కీలక బిల్లు.. సర్వత్రా ఉత్కంఠ
ఫుల్ ట్యాంక్‌తో 1200 కి.మీ.. Toyota Innova Hycross ఇప్పుడు కొత్త అవతార్‌లో వచ్చేస్తోంది
ఫుల్ ట్యాంక్‌తో 1200 కి.మీ.. Toyota Innova Hycross ఇప్పుడు కొత్త అవతార్‌లో వచ్చేస్తోంది
Today LPG, CNG, PNG Costs : LPG, CNG, PNG సిలిండర్ల కొత్త ధరలు.. హైదరాబాద్లోనే గ్యాస్ కాస్ట్ ఎక్కువ
LPG, CNG, PNG సిలిండర్ల కొత్త ధరలు.. హైదరాబాద్లోనే గ్యాస్ కాస్ట్ ఎక్కువ
Embed widget