అన్వేషించండి

TS EAMCET 2021: ఇవాల్టి నుంచే ఎంసెట్ పరీక్ష, కరోనా వేళ కొత్త నిబంధనలివీ.. ఈ వస్తువులకు నో ఎంట్రీ

ఎంసెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఎప్పటిలాగే ‘ఒక నిమిషం’ నిబంధనను అమలు చేస్తున్నారు. ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని అధికారులు తేల్చి చెప్పారు.

తెలంగాణలో ఎంసెట్ పరీక్ష బుధవారం (ఆగస్టు 4న) ఉదయం ప్రారంభమైంది. కరోనా నిబంధనల వల్ల ఎంసెట్ పరీక్షను వివిధ తేదీల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 4 నుంచి 5, 6 తేదీలు.. మళ్లీ 9, 10 తేదీల్లో ఎంసెట్ పరీక్షను నిర్వహించనున్నారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకూ ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తారు. ఇంకా మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకూ కూడా ఎంసెట్ పరీక్ష జరగనుంది. తొలి మూడు రోజులు ఇంజనీరింగ్ కాలేజీలలో ప్రవేశాలకు, ఈ నెల 9, 10 తేదీల్లో మెడిసిన్, వ్యవసాయ సబ్జెక్టుల కోసం ఎంసెట్ పరీక్ష జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంసెట్ పరీక్షల నిర్వహణ కోసం కొవిడ్19 నిబంధనలను అనుసరించి అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లుగా ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి విలేకరులకు తెలిపారు.

అయితే, ఎంసెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఎప్పటిలాగే ‘ఒక నిమిషం’ నిబంధనను అమలు చేస్తున్నారు. ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని అధికారులు తేల్చి చెప్పారు. విద్యార్థులను గంట ముందు నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారని తెలిపారు.
 
పరీక్షా నిబంధనలు ఇవీ.. 
కొవిడ్19 వ్యాప్తి కొనసాగుతున్నందున ఎంసెట్ పరీక్షల నిర్వహణలోనూ జాగ్రత్తలు పాటిస్తున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో ప్రతి విద్యార్థి తనకు ఎలాంటి లక్షణాలు లేవని తెలుపుతూ సెల్ఫ్ డిక్లరేషన్‌ ఫారం ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరికైనా జ్వరం, జలుబు వంటివి లక్షణాలు ఉంటే వారికి ఆఖరి రోజున పరీక్ష నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షకు హాజరయ్యే ప్రతి విద్యార్థి తప్పకుండా విధిగా మాస్క్‌ ధరించాల్సి ఉంటుంది.

పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సాధారణ దుస్తులను మాత్రమే ధరించాలి. జర్కిన్లు, స్వెటర్లు వంటివి ధరించకూడదు. మహిళా విద్యార్థినులు తప్పనిసరిగా హాఫ్ స్లీవ్స్ ఉండే దుస్తులు మాత్రమే ధరించి పరీక్షా కేంద్రానికి రావాలి. తమ వెంట బాల్‌ పాయింట్‌ పెన్, హాల్‌టికెట్‌ కచ్చితంగా తెచ్చుకోవాలి. పరీక్షా కేంద్రంలో భౌతిక దూరం ప్రకారమే ఆన్‌ లైన్‌ విధానంలో పరీక్ష ఉంటుంది.

విద్యార్థులు పరీక్షా కేంద్రం ప్రవేశం వద్ద నిర్దేశించిన సర్కిల్స్‌లో మాత్రమే నిలబడాలి. వారు తమ వెంట హ్యాండ్ శానిటైజర్లు, గ్లౌజులు, పెన్ను, ట్రాన్స్‌పరెంట్‌గా ఉండే నీళ్ల సీసా మాత్రమే తెచ్చుకోవాల్సి ఉంటుంది. మిగతా వాటికి అనుమతి లేదు.

ఎంసెట్‌ పరీక్షకు మార్కులు 160 కాగా జనరల్‌ కేటగిరీ అభ్యర్థుల అర్హత సాధించాలంటే కనీసం 40 మార్కులు రావాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఆ అర్హత మార్కుల పరిమితి ఉండదు. బాలికలకు 33 శాతం రిజర్వేషన్‌ ఉంటుంది. పరీక్షాపత్రం ఆంగ్లం - తెలుగు, ఆంగ్లం - ఉర్దూ, ఆంగ్ల భాషల్లో ఉంటుంది. విద్యార్థులు దరఖాస్తు సమయంలో ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం ఈ మూడింటిలో ఏదో ఒక కేటగిరీ భాషల్లో పరీక్షాపత్రాన్ని అందిస్తారు.

టాప్ హెడ్ లైన్స్

Telangana Total Debt Politics: తెలంగాణలో అప్పుల సవాళ్ల పోరు.. ప్రెస్ క్లబ్‌లో జూపల్లి, లేఖలతో హరీష్ రావు మైండ్ గేమ్!
తెలంగాణలో అప్పుల సవాళ్ల పోరు.. ప్రెస్ క్లబ్‌లో జూపల్లి, లేఖలతో హరీష్ రావు మైండ్ గేమ్!
Breaking News: మార్కపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
మార్కాపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
Hyderabad Crime News: ఘట్‌కేసర్‌లో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య! లంగర్ హౌజ్ లాడ్జిలో యువతి మృతి
ఘట్‌కేసర్‌లో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య! లంగర్ హౌజ్ లాడ్జిలో యువతి మృతి
Jupally Krishna Rao: ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Polavaram MLA Attacked: ​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!
​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!
Rushikonda Hilltop Buildings: రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
WhatsApp Business AI: వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
DMK MLA Anitha Radhakrishnan Arrest: సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
Garuda vs Lord Yama: బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
Maa Inti Bangaram Deleted Scenes : మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
Breaking News: మార్కపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
మార్కాపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
Mollywood Times OTT : సినిమాల పిచ్చి... సైకోలా మారే హీరో - రెండు ఓటీటీల్లో ప్రేమలు హీరో సైకలాజికల్ డార్క్ కామెడీ
సినిమాల పిచ్చి... సైకోలా మారే హీరో - రెండు ఓటీటీల్లో ప్రేమలు హీరో సైకలాజికల్ డార్క్ కామెడీ
Embed widget