అన్వేషించండి

Telangana Traffic E Challans: గంటకు 72 వేలపెండింగ్ చలాన్లు క్లియర్, రికార్డు స్థాయిలో ఆదాయం

Traffic E Challans: తెలంగాణ ట్రాఫిక్ పోలీసుల చలాన్ల ఆఫర్ తో సర్వర్లు స్తంభిస్తున్నాయి. నిమిషానికి 1200 మంది, గంటకు 72 వేల మందికి పైగా పెండింగ్ చలాన్లు క్లియర్ చేస్తున్నారు.

Traffic E Challans:చలానాలు(Challans) కట్టించాలంటే ట్రాఫిక్ పోలీసుల(Traffic Police)కు కత్తిమీద సాము. రోడ్లపై మాటు వేసి, బైక్ లు, ఆటోలు, కార్లు ఆపి మరీ ముక్కు పిండి వసూలు చేస్తే తప్ప ట్రాఫిక్ పెండింగ్ చలానాలు వసూలు కాని పరిస్థితి. తెలంగాణ(Telangana)లో మాత్రం ఇదంతా ఒకప్పుడు ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ఇప్పుడు మా పెండింగ్ చలానాలు కట్టించుకోండి మహాప్రభో అంటూ వాహనదారులు విపరీతంగా పోటీపడుతున్నారు. ఎంతలా అంటే ఒక్క నిమిషానికి ఏకంగా 1200 మందికి పైగా పెండింగ్ చలానాలు క్లియర్ చేసుకుంటున్నారు. నిమిషానికి వేలమంది చలానాలు క్లియర్ చేసుకునేందుకు ఇంతలా పోటీపడుతున్నారంటే దీనికి ప్రధాన కారణం తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt), ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన బంపర్ ఆఫర్. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కేవలం బంపర్ ఆఫర్ మాత్రమే కాదు. ఏళ్ల తరబడి పెండింగ్ చలానాలు కట్టకుండా ఉన్నవారికి జాక్ పాట్ అనడంలో సందేహమే లేదు.

పెండింగ్ చలానుల్లో భారీ ఆఫర్ 

తెలంగాణలో 28వ ఫిబ్రవరి 2022 లోపు పెండింగ్ లో ఉన్న చలానాలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. మార్చిలో చలానాలు విధిస్తే వాటికి ఈ ఆఫర్ వర్తించదు. అంటే గత నెలాఖరులోపు మీరు చెల్లించాల్సిన మొత్తంలో భారీ డిస్కొంట్ పొందవచ్చు. ఇంతకీ పెండింగ్ చలానాలకు ఎంత తగ్గింపు ఇస్తున్నారంటే.. ద్విచక్ర వాహనదారులు పెండింగ్ చలానా మొత్తంలో కేవలం 25 శాతం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. అంటే వెయ్యి రూపాయలు పెండింగ్ చలానాలు మొత్తం ఉంటే కేవలం రూ.250 రూపాయిలు చెల్లిస్తే చాలు. పెండింగ్ చలానుల మొత్తం క్లియర్ అయిపోతుంది. రూ. పది వేలు పెండింగ్ చలానా ఉంటే కేవలం రూ.2500 చెల్లిస్తే చాలు. ఇక కార్లు, లారీలు, జీపులు ఇలా హెవీ మోటర్ వాహనదారులైతే తాము చెల్లించాల్సిన పెండింగ్ చలానాల మొత్తంలో కేవలం 50 శాతం కడితే చాలు. ఆటో నడుపుతున్న వారు చెల్లించాల్సిన పెండింగ్ చలానాల మొత్తంలో కేవలం 25 శాతం చెల్లిస్తే సరిపోతుంది. అంతేకాదు ఆర్టీసీ బస్సు(RTC Bus) డ్రైవర్లకు సైతం చలానాలు విధిస్తారు ట్రాఫిక్ పోలీసులు .అలా పెండింగ్ చలానాలు ఉన్న ఆర్టీసీ డ్రైవర్లు వారు కట్టాల్సిన మొత్తంలో కేవలం 30 శాతం చెల్లిస్తే సరిపోతుంది. భాగ్యనగరంతో పాటు తెలంగాణలో అనేకచోట్ల తోపుడు బండి నడుపుకునే వారికి సైతం ట్రాఫిక్ పోలీసులు చలానాలు విధిస్తారు. అలా పెండింగ్ చలానాలు ఉన్న తోపుడు బండి యజమానులు వారు చెల్లించాల్సిన పెండింగ్ చలానా మొత్తంలో కేవలం 20 శాతం చెల్లిస్తే ఇప్పటి వరకూ ఉన్న పెండింగ్ మొత్తం ఒకేసారి క్లియర్ అవుతుంది.

మొత్తం రూ.1750 కోట్లు పెండింగ్

పెండింగ్ చలానాలు చెల్లింపులో తగ్గింపు ఇవ్వడానికి ప్రధాన కారణం గత రెండేళ్లుగా కరోనా నేపథ్యంలో వివిధ వర్గాల వారు తీవ్రంగా నష్టపోయారు. వ్యాపారాలు లేక తోపుడు బండి యజమానులు ఇబ్బందులు పడితే, కనీసం ప్రయాణికులు రాక ఆటో డ్రైవర్లు(Auto Drivers) ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యారు. ఇలా ఆర్థికంగా కుదేలైన కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటున్నారు జాయింట్ కమీషనర్ రంగనాథ్. ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు వరకూ ఒక్క హైదరాబాద్ కమిషనరేట్(Hyderabad Commissionarate) పరిధిలోనే కోటి డభై లక్షల మంది పెండింగ్ చలానాలు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం అక్షరాల రూ. 600 కోట్ల రూపాయలకు పైమాటే. తెలంగాణ వ్యాప్తంగా చూస్తే రూ.1750 కోట్లకు పెండింగ్ చలానాలు ఉన్నాయి. 

నిమిషానికి 1200 చలానులు క్లియర్ 

మార్చి నెల ఒకటో తేదీ నుంచి పెండింగ్ చలానాలపై ఆఫర్ అమల్లోకి రావడంతో చలానాలు చెల్లించే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. చలానుల చెల్లింపులతో సర్వర్లపై ఒత్తిడి పెరిగింది. దీంతో సర్వర్ల కెపాసిటీ, బ్యాండ్ విడ్త్ ను పదిరెట్లు పెంచారు. రోజూ లక్షలాది మంది సర్వర్లను హిట్ చేస్తున్నారు. ఒక్క నిమిషంలో వెయ్యి నుంచి పన్నెండు వందల చలానాలు క్లియర్ అవుతున్నాయి. చాలా మందికి ఉదయం నుంచి ట్రై చేసినా దొరకండ లేదు. అంతలా స్పందన వచ్చిందని జాయింట్ సీపీ రంగనాథ్ ఏబీపీ దేశంతో అన్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం చాలానాలపై భారీ తగ్గింపు ఇవ్వడంపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  తొలిరోజు రూ.7 లక్షలకు పైగా చలానాలు క్లియర్‌ కాగా, రూ.7.5 కోట్లు వసూలు అయ్యాయి. ఇప్పటి వరకూ మొత్తం 10.5 లక్షల చలాన్లు క్లియర్‌ చేయడంతో ప్రభుత్వ ఖజానాకు రూ.11 కోట్లు చేరాయి.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Formula E Case Adjourned: ఫార్ములా ఈ-రేసు కేసులో ఏసీబీ కోర్టుకు కేటీఆర్ - రూ.లక్ష పూచీకత్తు సమర్పణ - విచారణ ఆగస్టు 25కు వాయిదా!
ఫార్ములా ఈ-రేసు కేసులో ఏసీబీ కోర్టుకు కేటీఆర్ - రూ.లక్ష పూచీకత్తు సమర్పణ - విచారణ ఆగస్టు 25కు వాయిదా!
Telangana Cabinet Expansion Postponed: తెలంగాణ కేబినెట్ విస్తరణకు రేవంత్ సర్కార్ బ్రేక్ - ఢిల్లీలో హైకమాండ్ క్లాస్.. ఆశావహులకు నో గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ కేబినెట్ విస్తరణకు రేవంత్ సర్కార్ బ్రేక్ - ఢిల్లీలో హైకమాండ్ క్లాస్.. ఆశావహులకు నో గ్రీన్ సిగ్నల్!
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget