అన్వేషించండి

Indian Students: తీవ్ర విషాదం - ఈతకు వెళ్లి అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి

Telangana News: అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనలో ఖమ్మం నగరానికి చెందిన విద్యా రంగ ప్రముఖుని కుమారుడు మృతి చెందాడు.

Indian Students Died In Telangana: అమెరికాలో (America) తెలుగు విద్యార్థుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా, ఇద్దరు తెలుగు విద్యార్థులు జలపాతంలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అమెరికాలోని అరిజోనాలో ఫజిల్ క్రీక్ ఫాల్స్ వద్ద జరిగింది. ఈ నెల 8వ తేదీన 16 మంది స్నేహితుల బృందం స్నాతకోత్సవం సందర్భంగా జలపాతం వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో లక్కిరెడ్డి రాకేశ్ రెడ్డి, రోహిత్ మణికంఠ లేపాల అనే ఇద్దరు విద్యార్థులు జలపాతంలో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు మునిగిపోయారు. గమనించిన స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వారి కోసం గాలింపు ప్రారంభించగా మొదటి రోజు వీరి ఆచూకీ లభించలేదు. రెండో రోజు వీరి మృతదేహాలను గుర్తించారు.

తెలంగాణ విద్యార్థి..

మృతుల్లో తెలంగాణ విద్యార్థి లక్కిరెడ్డి రాకేశ్ రెడ్డి.. ఖమ్మం నగరంలోని విద్యా రంగ ప్రముఖులు లక్కిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఏకైక కుమారుడు. ఇతను కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. ఇక మరో విద్యార్థి రోహిత్ మణికంఠ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, కుమారుడి స్నాతకోత్సవం వేడుకకు హాజరయ్యేందుకు ఇటీవలే రాకేశ్ తల్లిదండ్రులు అమెరికా వెళ్లారు. అయితే, అనుకోని ప్రమాదంలో అతను మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. గడిచిన తొమ్మిదేళ్లలో ఈ జలపాతం వద్ద 9 మంది చనిపోయినట్లు తెలుస్తోంది.

ఇక, ఏప్రిల్ లో ట్రెక్కింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు జారి పడి ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన స్కాట్లాండ్ లో జరిగింది. వీరిలో ఒకరు హైదరాబాద్ విద్యార్థి కాగా.. మరో విద్యార్థి ఏపీకి చెందిన విద్యార్థిగా గుర్తించారు. స్కాట్లాండ్ లోని యూనివర్శిటీలో మాస్టర్స్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు.. పెర్త్ షైర్ లోని లిన్ ఆఫ్ తమ్మెల్ కు వెళ్లారు. అక్కడ ట్రెక్కింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు నీటిలో జారి పడి కొట్టుకుపోయారు. సమచారం అందుకున్న పోలీసులు వెంటనే గాలింపు చేపట్టి ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. మృతులు జితేంద్రనాథ్ (26), చాణక్య (22)గా గుర్తించారు.

హన్మకొండ విద్యార్థి అదృశ్యం

అగ్రరాజ్యంలో ప్రమాదవశాత్తు విద్యార్థుల మరణాలు ఓ వైపు ఆందోళన కలిగిస్తుంటే.. కొందరు తెలుగు విద్యార్థుల అదృశ్యం కూడా ఆందోళన కలిగిస్తోంది. తాజాగా, అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన తెలంగాణ విద్యార్థి అదృశ్యం (Telangana Student Missing) కావడంతో అతని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గత వారం రోజులుగా అతని ఆచూకీ లేదని అక్కడి భారత రాయబార కార్యాలయం పేర్కొంది. హన్మకొండకు (Hanmakonda) చెందిన రూపేశ్ చంద్ర చింతకింది (Rupesh Chandra) చికాగోలో (Chicago) విస్కాన్సిన్ లోని కాంకార్డియా యూనివర్శిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. చివరిసారిగా ఈ నెల 2న మధ్యాహ్నం రూపేశ్ తో తండ్రి వాట్సాప్ కాల్ లో మాట్లాడారు. ఆ తర్వాత అతని ఫోన్ స్విచ్చాఫ్ లోకి వెళ్లిపోయిందని తండ్రి తెలిపారు. అతని స్నేహితులతో మాట్లాడగా.. ఎవరినో కలవడానికి వెళ్లారని వారు ఎవరో తెలియదని రూపేశ్ స్నేహితులు సమాధానం ఇచ్చారు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు తమ కుమారుడి ఆచూకీ కనుగొనాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖను, అమెరికా ఎంబసీని కోరారు.

Also Read: Medak News: బెట్టింగ్ కు బానిసై రూ.2 కోట్లు పోగొట్టాడు - రాడ్ తో కొట్టి చంపేసిన తండ్రి, ఎక్కడంటే?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Congress Action Plan: తెలంగాణ కాంగ్రెస్ 99 రోజుల యాక్షన్ ప్లాన్ - ఇక నెక్ట్స్ లెవల్ రాజకీయమే!
తెలంగాణ కాంగ్రెస్ 99 రోజుల యాక్షన్ ప్లాన్ - ఇక నెక్ట్స్ లెవల్ రాజకీయమే!
Adilabad: మా పిల్లలకు ఆ టీచరే చదువు చెప్పాలి - బడికి తాళం వేసిన తల్లిదండ్రులు - ఎక్కడంటే?
మా పిల్లలకు ఆ టీచరే చదువు చెప్పాలి - బడికి తాళం వేసిన తల్లిదండ్రులు - ఎక్కడంటే?
Khammam house demolition: ఖమ్మంలో ఇళ్ల కూల్చివేత వివాదం ఏమిటి? బాధితుల్ని ప్రభుత్వం రోడ్డున పడేసిందా?
ఖమ్మంలో ఇళ్ల కూల్చివేత వివాదం ఏమిటి? బాధితుల్ని ప్రభుత్వం రోడ్డున పడేసిందా?
భార్య ఆరోగ్యం కోసం భిక్షాటన చేస్తున్న అడ్వకేట్, బిచ్చగాడు సినిమాను మించిన కథ ఇది! ఇలాంటి దీక్షలు రోగాలను నయం చేస్తాయా?
భార్య ఆరోగ్యం కోసం భిక్షాటన చేస్తున్న అడ్వకేట్, బిచ్చగాడు సినిమాను మించిన కథ ఇది! ఇలాంటి దీక్షలు రోగాలను నయం చేస్తాయా?

వీడియోలు

Khammam house demolitions : ఖమ్మంలో ఉద్రిక్తత పరిస్థితులకు కారణమైన ఇళ్ల కూల్చివేత | ABP Desam
Vijay Devarakonda Rashmika Wedding Photos | విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి ఫోటోలు ఇవే | ABP Desam
Changes in Team India vs Zimbabwe T20 World Cup | టీమిండియాలో భారీ మార్పులు
Ravi Shastri's Comments on India T20 World Cup 2026 | భారత్ ఓటమిపై రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు
India vs Zimbabwe Batting Lineup T20 World Cup | జింబాబ్వే మ్యాచ్‌లో సంజూ శాంసన్ ఎంట్రీ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ideas of India Summit 2026: పియూష్ గోయల్, నారా లోకేష్‌, ఫడ్నవీస్, థరూర్ నుంచి కంగనా, అర్మాన్ మాలిక్ వరకు...స్టార్స్‌తో సిద్ధమైన ABP న్యూస్ ఐడియా ఆఫ్ ఇండియా!
పియూష్ గోయల్, నారా లోకేష్‌, ఫడ్నవీస్, థరూర్ నుంచి కంగనా, అర్మాన్ మాలిక్ వరకు...స్టార్స్‌తో సిద్ధమైన ABP న్యూస్ ఐడియా ఆఫ్ ఇండియా!
Khammam house demolitions : ఖమ్మంలో ఉద్రిక్తత పరిస్థితులకు కారణమైన ఇళ్ల కూల్చివేత | ABP Desam
Khammam house demolitions : ఖమ్మంలో ఉద్రిక్తత పరిస్థితులకు కారణమైన ఇళ్ల కూల్చివేత | ABP Desam
Virosh Wedding Photos: విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి ఫోటోలు వచ్చేశాయ్... కొత్త జంట ఎంత చూడముచ్చటగా ఉందో చూశారా?
విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి ఫోటోలు వచ్చేశాయ్... కొత్త జంట ఎంత చూడముచ్చటగా ఉందో చూశారా?
Ind vs Zim Highlights : జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా! సెమీస్‌ ఆశలు సజీవం!
జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా! సెమీస్‌ ఆశలు సజీవం!
Raakaasaa Teaser: 'రాకాస' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్... సంగీత్ శోభన్ సినిమా అప్డేట్ ఏమిటంటే?
'రాకాస' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్... సంగీత్ శోభన్ సినిమా అప్డేట్ ఏమిటంటే?
Rashmika Wedding Photos: పెళ్లి కుమార్తెగా రష్మిక లుక్... రాకుమారి కంటే గొప్పగా ఉంది కదూ
పెళ్లి కుమార్తెగా రష్మిక లుక్... రాకుమారి కంటే గొప్పగా ఉంది కదూ
India Israel FTA: ఇజ్రాయెల్‌తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం - మోదీ పర్యటన విశేషాలు ఇవే
ఇజ్రాయెల్‌తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం - మోదీ పర్యటన విశేషాలు ఇవే
Amaravati Railway Line: అమరావతి రైల్వే లైన్‌కి భూములు ఇస్తున్న తెలంగాణా రైతులు! ఎందుకో తెలుసా?
అమరావతి రైల్వే లైన్‌కి భూములు ఇస్తున్న తెలంగాణా రైతులు! ఎందుకో తెలుసా?
Embed widget