అన్వేషించండి

Adilabad: మా పిల్లలకు ఆ టీచరే చదువు చెప్పాలి - బడికి తాళం వేసిన తల్లిదండ్రులు - ఎక్కడంటే?

Adilabad Teacher: ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో ఓ టీచర్ ను వేరే స్కూల్ కు డిప్యూటేషన్ పై పంపడాన్ని గ్రామస్తులు వ్యతిరేకించారు. తమ పిల్లలకు ఆ టీచర్ తోనే చదువు చెప్పించాలని బడికి తాళం వేశారు.

Adilabad parents protest for teacher:  ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని ఉండం గ్రామంలో విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు చేపట్టిన వినూత్న నిరసన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తమ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలిని వేరే చోటుకు డిప్యుటేషన్‌పై పంపడాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్థులు ఏకంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు తాళం వేశారు. పిల్లల చదువుల విషయంలో అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల తమ బిడ్డల భవిష్యత్తు అంధకారమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ, పాఠశాల గేటు ముందే బైఠాయించి ప్రభుత్వానికి తమ నిరసన గళాన్ని వినిపించారు.                               

ముగ్గురుటీచర్లు ఉంటే ఒకరికి డిప్యూటేషన్                                 

ఈ పాఠశాలలో మొత్తం 63 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా, బోధన కోసం కేవలం ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. అయితే, ఉన్నతాధికారులు అందులో ఒక ఉపాధ్యాయురాలిని డోర్లి గ్రామ పాఠశాలకు వారంలో మూడు రోజులు డిప్యుటేషన్‌పై పంపడం వివాదానికి దారితీసింది. ఇక్కడ ఉండాల్సిన టీచర్‌ను మరో చోటుకు కేటాయించడం వల్ల తమ పిల్లలకు సరిగ్గా పాఠాలు అందడం లేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మండల విద్యాధికారికి, జిల్లా కలెక్టర్‌కు విన్నవించినా ఫలితం లేకపోవడంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వారు స్పష్టం చేశారు.                                 

విద్యాధికారి నచ్చ చెప్పినా వినిపించుకోని తల్లిదండ్రులు                                       

ఘటనా స్థలానికి చేరుకున్న మండల  ఎంఈవో వెంకట్ రావు గ్రామస్థులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే, ఆందోళనకారులు మాత్రం వెనక్కి తగ్గలేదు. తమ పాఠశాలకు కేటాయించిన టీచర్‌ను ఇక్కడే పూర్తిస్థాయిలో ఉంచుతామని స్పష్టమైన హామీ ఇచ్చే వరకు పాఠశాలను తెరిచేది లేదని భీష్మించుక కూర్చున్నారు. చర్చలు సఫలం కాకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటికి తీసుకువెళ్లిపోయారు. దీంతో పాఠశాల ఆవరణ బోసిపోయింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎంఈవో పేర్కొన్నారు.                           

పిల్లల్ని తీసుకెళ్లిపోయిన తల్లిదండ్రులు 

అధికారులు స్పందించి ఉపాధ్యాయురాలి డిప్యుటేషన్‌ను వెంటనే రద్దు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఒకవైపు ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తామని చెబుతూనే, మరోవైపు ఉన్న టీచర్లను పక్కదారి పట్టించడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. తమ విన్నపాన్ని మన్నించి టీచర్‌ను యధావిధిగా కొనసాగించకపోతే, ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల విద్యా సంవత్సరం వృధా కాకముందే అధికారులు సానుకూల నిర్ణయం తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Telangana Assembly: తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగులకు షాక్ -వేతనంలో 15 శాతం కోతకు తెలంగాణ సర్కార్ చట్టం
తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగులకు షాక్ -వేతనంలో 15 శాతం కోతకు తెలంగాణ సర్కార్ చట్టం
Revanth Reddy: అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
Telangana: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
Advertisement

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Amaravati What Next: అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
Railway Advertisements: మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
Family Entertainers : వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
Iran War Updates: గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
Revanth Reddy: అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
Telangana: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
Affordable Mileage Cars: రూ. 6 లక్షల ధరలో 6 ఎయిర్‌బ్యాగ్స్.. మీకు ఏ కారు బెస్ట్, వివరాలు చెక్ చేసుకోండి
రూ. 6 లక్షల ధరలో 6 ఎయిర్‌బ్యాగ్స్.. మీకు ఏ కారు బెస్ట్, వివరాలు చెక్ చేసుకోండి
Embed widget