By: ABP Desam | Updated at : 23 May 2022 07:33 AM (IST)
Edited By: Satyaprasad Bandaru
తెలంగాణ పదో తరగతి పరీక్షలు
TS SSC Exams : తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు సర్వం సద్ధమైంది. సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా పదో తరగతి పరీక్షలు నిర్వహించలేదు. పరీక్షలు లేకుండా విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసింది ప్రభుత్వం. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 11,401 పాఠశాలల్లో చదువుతున్న 5 లక్షల 9 వేల మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల కోసం 2861 పరీక్ష కేంద్రాలను ప్రభుత్వం సిద్ధం చేసింది.
కరోనా తర్వాత తొలిసారి పరీక్షలు
కరోనా ప్రభావం తగ్గడంతో ఈ ఏడాది పదో తరగతి పరీక్షల నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని అధికారులు సూచిస్తున్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా పరీక్ష కేంద్రాల్లో మంచినీళ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచునున్నారు. ఇతర రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారం కలకలం రేపింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి పరిస్థితులు రాకుండా ముందుగా అప్రమత్తం అయింది. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. జిల్లా స్థాయి అధికారులతో సిట్టింగ్ స్కాడ్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. విద్యార్థులు కాపీయింగ్కు పాల్పడితే డీఈవో, ఎంఈవోలు బాధ్యత వహించాలని విద్యాశాఖ సూచించింది.
ఐదు నిమిషాలు లేట్ అయితే అనుమతి లేదు
పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు ఆత్మవిశ్వాసంలో పరీక్షలు రాయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఒత్తిడికి లోను పరీక్షలు రాసే విధంగా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు. పరీక్షలకు నూటికి నూరు శాతం విద్యార్థులు హాజరై పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలని మంత్రి సూచించారు. విద్యార్థులు టైమ్ కి పరీక్ష కేంద్రాలకు వచ్చేలా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలన్నారు. బస్ పాస్ తో పాటు హాల్టికెట్ ఉంటే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. పరీక్షకు ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి ఉండదని అధికారులు చెబుతున్నారు. పేపర్ లీక్, మాస్ కాపీయింగ్కు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టేందుకు సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ప్రశ్నపత్రాలను ఫొటోలు తీస్తే తట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు చెబుతున్నారు. చట్టప్రకారం శిక్షలుంటాయని అధికారులు తెలిపారు.
Also Read : Inter Academic Calendar : ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల, 221 రోజులతో షెడ్యూల్ ఖరారు
Hyderabad News: ఫిలింనగర్ లో దారుణం - అప్పు తీర్చలేదని దంపతులను చంపేశారు, ముగ్గురు నిందితుల అరెస్ట్
Singareni Elections: సింగరేణి ఎన్నికల కోసం రాహుల్ గాంధీ, పోలింగ్ తేదీ ఖరారు - మంత్రి వెల్లడి
Petrol - Diesel Rates Today: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Revanth Reddy Canvoy: ట్రాఫిక్లో ఇరుక్కున్న సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కొత్త కాన్వాయ్ నంబర్ ఇదే
Top Headlines Today: డిస్కంలకు రూ.80 వేల కోట్ల అప్పు నిజమే; తుపాను బాధితులతో చంద్రబాబు - నేటి టాప్ న్యూస్
హైవేపై ఘోర ప్రమాదం, ట్రక్ని ఢీకొట్టిన కార్లో మంటలు - ఓ చిన్నారి సహా 8 మంది ఆహుతి
Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క
Weather Latest Update: నేడు తెలంగాణలో పొడి వాతావరణమే, ఏపీకి స్వల్ప వర్ష సూచన: ఐఎండీ
Look Back 2023: భారీ సక్సెస్ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్లో క్రేజీ సిక్సర్!
/body>