అన్వేషించండి

Telangana RTC Strike: సమ్మెతో డిపోలకే పరిమితమైన బస్సులు.. ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్లు ఏంటీ ?

ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి నాలుగు వారాల గడువు కావాలని, కార్మికులు సమ్మె విరమించి తక్షణమే విధులకు హాజరుకావాలని సంస్థ ఎండి వై. నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు బుధవారం సమ్మె బాట పట్టారు. ప్రభుత్వంతో నిర్వహించిన చర్చలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో, మంగళవారం అర్ధరాత్రి నుంచే కార్మికులు తమ విధులను బహిష్కరించారు. ఈ సమ్మె కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోల్లో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పలు జిల్లాల్లో బస్సు సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పరిస్థితిని అదుపులో ఉంచడానికి ప్రభుత్వం అన్ని ప్రధాన బస్ డిపోల వద్ద భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసింది.

కార్మికులు విధులకు హాజరుకావాలన్న ఆర్టీసీ ఎండీ..

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల తెలంగాణ ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని, ఉద్యోగులందరూ సమ్మె ఆలోచన విరమించి విధులకు హాజరుకావాలని సంస్థ TGRTC ఎండీ వై. నాగిరెడ్డి పిలుపునిచ్చారు. కార్మికుల డిమాండ్లపై సమగ్రంగా చర్చించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఐఏఎస్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందని ఆయన గుర్తుచేశారు. ఈ కమిటీ ఇప్పటికే మంగళవారం కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమై పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు ఆయన వివరించారు.

కార్మికులు లేవనెత్తిన డిమాండ్లలో కొన్ని ఆర్థికపరమైనవి, సాంకేతిక చిక్కులతో కూడిన అంశాలు ఉన్నాయని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కార మార్గాలను అన్వేషించడానికి ప్రభుత్వానికి కనీసం 4 వారాల సమయం అవసరమని నాగిరెడ్డి పేర్కొన్నారు. సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నందున, ప్రభుత్వం కోరిన గడువుకు సహకరించాలని ఆయన కోరారు.

అయితే కొన్ని సంఘాలు వాస్తవాలను పక్కనబెట్టి, సమ్మె పేరుతో కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆర్టీసీ బస్సులపైనే ఆధారపడి ప్రయాణించే దినసరి కూలీలు, సామాన్య ప్రజలు మరియు విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఉద్యోగిపై ఉందని ఆయన హితవు పలికారు. సంస్థ ప్రయోజనాలను, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, కార్మికులు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా బాధ్యతాయుతంగా విధుల్లో పాల్గొనాలని ఎండి నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఆర్టీసీ సమ్మె.. కార్మికులు ఏం డిమాండ్ చేస్తున్నారు 
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర రూపం దాల్చింది. ఈ సమ్మెలో కార్మికుల ప్రధాన డిమాండ్ ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేయడం. సంస్థను కేవలం ఒక కార్పొరేషన్‌గా కాకుండా ప్రభుత్వ శాఖగా గుర్తించి, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. దీనితో పాటు 2021 నుండి పెండింగ్‌లో ఉన్న వేతన సవరణను 30 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలని, అలాగే పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను తక్షణమే విడుదల చేయాలని కోరుతున్నారు. ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను అద్దెకు తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ, సంస్థే నేరుగా కొత్త బస్సులను కొనుగోలు చేయాలని జేఏసీ (JAC) స్పష్టం చేస్తోంది.

సమ్మెను అడ్డుకునేందుకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జరిపిన చర్చలు సఫలం కాలేదు. ప్రభుత్వం జీవో నంబర్ 66 ద్వారా ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ, జేఏసీ నాయకులు దానిని ససేమిరా తిరస్కరించారు. కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, తమ సమస్యలకు తక్షణ పరిష్కారం చూపడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాటం ఆపేది లేదని జేఏసీ చైర్మన్ ప్రకటించడంతో సమ్మె అనివార్యమైంది.

ఈ సమ్మె ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 60 లక్షల మంది ప్రయాణికులపై పడనుంది. దాదాపు 6,000 బస్సులు డిపోలకే పరిమితం కావడంతో హైదరాబాద్ సిటీ బస్సులతో పాటు జిల్లాలకు వెళ్లే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసులు నిలిచిపోనున్నాయి. నిత్యం ప్రయాణించే విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. చివరకు ఎయిర్‌పోర్ట్ పుష్పక్ సర్వీసులు కూడా నిలిచిపోవడంతో విమాన ప్రయాణికులకు సైతం కష్టాలు మొదలయ్యాయి.

ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. ప్రైవేట్ వాహనాలు, పాఠశాల బస్సులను తాత్కాలికంగా ప్రయాణికుల కోసం వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల సహాయంతో కొన్ని బస్సులను నడపాలని ప్రభుత్వం భావిస్తోంది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం.. మే 28న సిద్ధరామయ్య రాజీనామా!
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం.. మే 28న సిద్ధరామయ్య రాజీనామా!
Uppal Real Estate: ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
 Nara Lokesh Big Announcement: మహిళలకు 33శాతం సీట్లు  మహానాడులో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన లోకష్
మహిళలకు 33శాతం సీట్లు..!  మహానాడులో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నారాలోకేష్
Mancherial Crime News: రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
Advertisement

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Key Comments: ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
Uppal Real Estate: ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
ED Raids Kerala: కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
Nara lokesh Big Announcement మహిళలకు 33 శాతం సీట్లు
Nara lokesh Big Announcement మహిళలకు 33 శాతం సీట్లు
Byjus Founder Byju Raveendran: బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
Chandrababu Speech At Mahanadu: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక పార్టీ టీడీపీ, విజన్ పాలిటిక్స్‌కు నాంది: చంద్రబాబు
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక పార్టీ టీడీపీ, విజన్ పాలిటిక్స్‌కు నాంది: చంద్రబాబు
BRS Aggressive Politics: బీఆర్ఎస్ యువనేతల దూకుడు.. ఆవేశంలో మునిగిపోతున్న ఆలోచన! లాభమా..నష్టమా?
బీఆర్ఎస్ యువనేతల దూకుడు.. ఆవేశంలో మునిగిపోతున్న ఆలోచన! లాభమా..నష్టమా?
Mancherial Crime News: రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
Embed widget