అన్వేషించండి

Telangana Rains: తెలంగాణలో ఏడాదిలో పడాల్సిన వాన ఒక్కరోజే- రికార్డు స్థాయిలో వర్షాలు

Telangana Rains: తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఒక సంవత్సరం పాటు నమోదు అయ్యే వర్షపాతం మించి ఒకరోజులోనే నమోదు అవుతున్నట్టు అధికారిక అంచనాలు ఉన్నాయి

Telangana Rains:  తెలంగాణలో భీకర వర్షాలు పడుతున్నాయి. మొన్నటి వరకు లోటు వర్షపాతంలో రైతులు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు రికార్డు స్థాయిలో పడుతున్న వర్షం అందర్నీ టెన్షన్ పెడుతోంది. ఇప్పటి వరకు అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం సంవత్సరం మొత్తం పడాల్సిన వర్షం ఒక్కరోజులోనే నమోదైనట్టు తెలుస్తోంది. Image

తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఒక సంవత్సరం పాటు నమోదు అయ్యే వర్షపాతం మించి ఒకరోజులోనే నమోదు అవుతున్నట్టు అధికారిక అంచనాలు ఉన్నాయి. వరంగల్ , భూపాలపల్లి , హనుమకొండతో పాటు పలు ప్రాంతాల్లో తీవ్ర వర్షపాతం నమోదవుతుంది. ములుగు జిల్లాలో 65 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 61 సెంటీమీటర్ల రికార్డు అయ్యాయి. హైదరాబాదులో కూడా పలు ప్రాంతాల్లో 100mmపైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రికార్డు స్థాయిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంలో రాత్రి 12 గంటల సమయానికే 350 mm వర్షపాతం నమోదైంది. 

భారీగా కురుస్తున్న వర్షాలకు రహదారులు తెగిపోయాయి. చాలా ప్రాంతాలు నీట మునిగాయి. వాగులు వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టుల్లో భారీగా వరద నీరు చేరుకుంటోంది. స్థాయికి మించిన నీటితో ప్రాజెక్టుల వద్ద పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. Image

పరిస్థితి ప్రమాదకరస్థాయిలో ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చాలా ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా నిషేధించారు. పాల్వంచ నుంచి భద్రాచలం వెళ్ళు రహదారి మధ్యలో ఉన్న నాగారం బ్రిడ్జి వద్ద కిన్నెరసాని ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. బ్రిడ్జి మీదుగా భారీ వాహనాల రాకపోకలు అధికారులు నిలిపివేశారు. కొత్తగూడెం నుంచి భద్రాచలం వైపు వెళ్లేవారు, భద్రాచలం నుంచి కొత్తగూడెం, ఖమ్మం వెళ్తున్న వారు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరుతున్నారు. Image

గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. భద్రాచలం వద్ద నీటి మట్టం 50.2 అడుగులు దాటింది. భద్రాచలం వద్ద ఔట్ ఫ్లో 13 లక్షల క్యూసెక్కులు దాటింది. పోలవరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు పెరుగుతోంది. ప్రాజెక్టుకు 48 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్‌ వద్ద కూడా వరద నీరు ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం నీటి మట్టం 11.70 అడుగులకు చేరింది. బ్యారేజ్‌ నుంచి 9 లక్షల 88 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. Image

గోదావరి ప్రవాహం పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లంక గ్రామాలను అప్రమత్తం చేశారు. గుబ్బల మంగమ్మ ఆలయాన్ని మూసివేశారు. వేలేరుపాడు, కుక్కనూరు మండలాల్లో రాకపోకలు నిషేధించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget