By: ABP Desam | Updated at : 16 Nov 2021 05:02 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
పోచంపల్లి(Source: ANI)
తెలంగాణ రాష్ట్రంలోని పోచంపల్లికి అరుదైన గుర్తింపు లభించింది. ఐక్యరాజ్య సమితి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్(UNWTO).. పర్యాటకం విభాగంలో పోచంపల్లి ఉత్తమ గ్రామంగా ఎంపిక చేసింది.
డిసెంబర్ 2న స్పెయిన్లోని మాడ్రిడ్లో జరిగే యూఎన్ డబ్ల్యూటీవో(UNWTO) జనరల్ అసెంబ్లీ 24వ సమావేశాల్లో ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందజేయనున్నారు. ఈ అవార్డు సాధించడంపై కేంద్ర సంస్కృతి, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పోచంపల్లి గ్రామ ప్రజలను అభినందించారు. పోచంపల్లి నేత శైలి చాలా అరుదు అన్నారు. ఈ నమూనాలపై ఆత్మ నిర్భర్ భారత్ వోకల్ 4 లోకల్ ద్వారా ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు
పోచంపల్లి గ్రామానికి ఈ అవార్డు రావడంపై ప్రత్యేకంగా పోచంపల్లి ప్రజల తరపున, తెలంగాణ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పోచంపల్లి ఇతర ఎంట్రీలను సమర్ధవంతంగా సమర్పించినందుకు మంత్రిత్వ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. UNWTO పైలట్ చొరవతో గ్రామీణ ప్రాంతాల్లో ఆదర్శంగా నిలిచే గ్రామాలను తొమ్మిది విభాగాల్లో గుర్తించి అవార్డులు ప్రకటించారని మంత్రి అన్నారు.
Also Read: ఏపీ రైతులకు శుభవార్త.. వారి ఖాతాల్లోకి నేరుగా నగదు జమచేసిన సీఎం వైఎస్ జగన్
భారత్ నుంచి మూడు గ్రామాలు పోటీ
గ్రామీణ ప్రాంతాల్లో పర్యాటక అవకాశాలను మెరుగు పరిచే లక్ష్యంతో యూఎన్ డబ్ల్యూటీవో ఉత్తమ పర్యాటక గ్రామాలను గుర్తించి అవార్డులు అందిస్తుంది. భారతదేశం నుంచి UNWTO ఉత్తమ పర్యాటక గ్రామాల అవార్డు కోసం కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ మూడు గ్రామాలను సిఫార్సు చేసింది. మేఘాలయలోని కొంగ్థాంగ్, మధ్యప్రదేశ్ లోని లధ్పురా ఖాస్, తెలంగాణలోని పోచంపల్లి సిఫార్సు చేయగా
పోచంపల్లి గ్రామానికి అవార్డు లభించింది.
Also Read: వాగులో బాలురు గల్లంతు.. ఐదుగురి మృతదేహాల వెలికితీత, మంత్రి కేటీఆర్ ఆవేదన
జియోలజికల్ ఇండెక్స్ గుర్తింపు
పోచంపల్లి.. హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. తెలంగాణలోని నల్గొండ జిల్లాలోని ఒక పట్టణం. ఇక్కడ ప్రత్యేకమైన శైలిలో నేతన్నలు సున్నితమైన చీరల నేస్తారు. అందుకే పోచంపల్లిని తరచుగా సిల్క్ సిటీ అని పిలుస్తారు. నేతన్నల శైలి పోచంపల్లి ఇకత్ 2004లో భౌగోళిక సూచిక (GI) స్టేటస్ పొందింది.
మంత్రి కేటీఆర్ ట్వీట్
పోచంపల్లికి బెస్ట్ టూరిస్ట్ విలేజ్ అవార్డు రావడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
My compliments to the people of Pochampally, Telangana on being selected as one of the best Tourism Villages by United Nations World Tourism Organisation 👏
— KTR (@KTRTRS) November 16, 2021
The prestigious award will be given on the occasion of 24th session of the UNWTO General Assembly on Dec 2 in Madrid,Spain
Also Read: వచ్చే ఏడాది నుంచి వరంగల్కు విమానాలు... ఏఏఐను తుది నివేదిక కోరిన రాష్ట్ర ప్రభుత్వం
Nizamabad News: నిజామాబాద్ జిల్లాలో అక్రమ మట్టి తవ్వకాలు, ఎమ్మెల్సీ కవిత సీరియస్!
Minister Harish Rao : తెలంగాణకు మోదీ మొండి చెయ్యి, ప్రధాని కల్లబొల్లి కబుర్లు చెప్పారు- మంత్రి హరీశ్ రావు
PM Modi Speech: తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, అభివృద్ధి డబుల్ అవుతుంది-ప్రధాని మోదీ
Bandi Sanjay : తెలంగాణకు మోదీ నిధులిస్తుంటే, కేసీఆర్ దారి మళ్లిస్తున్నారు- బండి సంజయ్
Piyush Goyal On CM KCR : బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు మార్పు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సంచలన కామెంట్స్
MP Raghurama Krishna Raju : ఎంపీ రఘురామకృష్ణరాజు భీమవరం పర్యటన రద్దు, మధ్యలోని ట్రైన్ దిగిపోయిన ఎంపీ
IndiGo flights Delay : సిక్ లీవ్ పెట్టి ఇంటర్య్వూకు చెక్కేసిన ఇండిగో సిబ్బంది, 900 విమాన సర్వీసులపై ప్రభావం
Balakrishna: 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' టీమ్ తో బాలయ్య - లుక్ అదుర్స్
IND vs ENG 5th Test Day 3: ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన భారత్ - టీ సమయానికి స్కోరు ఎంతంటే?
Pawan Kalyan : బూతులు తిట్టేందుకే ఎమ్మెల్యేల ప్రెస్ మీట్లు, ప్రజాసమస్యల పరిష్కారానికి వైసీపీకి టైం లేదు- పవన్ కల్యాణ్