By: ABP Desam | Published : 01 Jan 2022 09:33 PM (IST)|Updated : 01 Jan 2022 09:33 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు
తెలంగాణలో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ తాజా బులెటిన్ లో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 12 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదు అయిన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 79కి చేరింది. గత 24 గంటల్లో ఎట్ రిస్క్ దేశాల నుంచి 123 మంది శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చారు. వాళ్లందరికీ కరోనా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా 10 మందికి ప్రయాణికులకు కోవిడ్ పాజిటివ్గా తేలింది. దీంతో అధికారులు వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కి పంపినట్లు తెలిపారు. కరోనా, ఒమిక్రాన్ దృష్ట్యా వైద్య ఆరోగ్యశాఖ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని ఆదేశించింది. మాస్క్ లు ధరించని వారికి రూ.1000 ఫైన్ విధించాలని అధికారులకు సూచించింది. కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని తెలిపింది.
Also Read: సంక్రాంతికి మరో 10 ప్రత్యేక రైళ్లు ... దక్షిణ మధ్య రైల్వే ప్రకటన
79కు చేరిన ఒమిక్రాన్ కేసులు
ఇప్పటి వరకూ ఎట్ రిస్క్, నాన్ రిస్క్ దేశాల నుంచి తెలంగాణకు 12,692 మంది ప్రయాణికులు వచ్చారు. వీరందరికీ శంషాబాద్ ఎయిర్ పోర్టులో కోవిడ్ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు. వారిలో 144 మందికి కరోనా పాజిటివ్ వచ్చాయి. వారందరి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కి పంపారు అధికారులు. వారిలో 44 మందికి ఒమిక్రాన్ నెగెటివ్గా వచ్చింది. మిగిలిన 100 మందిలో 79 మందికి ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చింది. ఇంకా 21 మంది ఫలితాలు రావాల్సిఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. 79 ఒమిక్రాన్ బాధితుల్లో 27 మంది చికిత్స అనంతరం కోలుకున్నారు.
Also Read: జహీరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం... బైకును ఢీకొట్టిన కారు...చిన్నారి సహా నలుగురు మృతి
రాష్ట్రంలో కొత్తగా 317 కరోనా కేసులు
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 28,886 కరోనా నిర్ధారణ నమూనాలను పరీక్షించారు. ఈ నమూనాల్లో కొత్తగా 317 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,82,215కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పటివరకు మృతుల సంఖ్య 4,029కి చేరింది. కరోనా బారి నుంచి శుక్రవారం 232 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతానికి 3,733 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Also Read: వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట... 12 మంది మృతి... ప్రధానమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి
Bank Of Baroda Theft Case: బ్యాంకులో చోరీ కేసులో కీలక పరిణామం, ఎట్టకేలకు కోర్టులో లొంగిపోయిన క్యాషియర్ ప్రవీణ్
Online Bettings Suicide : ఆన్లైన్ బెట్టింగులకు మరో ప్రాణం బలి, అప్పుల పాలై యువకుడు ఆత్మహత్య
Breaking News Live Updates: ఎచ్చెర్లలో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య
Child Marriage : బర్త్ డే వేడుకల ముసుగులో బాల్య వివాహం, 12 ఏళ్ల బాలికకు 35 ఏళ్ల వ్యక్తితో పెళ్లి
Lovers Death: కొద్దిరోజుల్లోనే పెళ్లి, యాక్సిడెంట్లో ప్రియుడు మృతి - ప్రియురాలు షాకింగ్ నిర్ణయం!
Ravela Kishore Resign To BJP : ఏపీ బీజేపీకి ఎదురు దెబ్బ - పార్టీ ఉపాధ్యక్షుడు రాజీనామా !
Gun Violence In USA: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత- ముగ్గురు మృతి
Ayyanna Vs Ambati Twitter : అంబటి వర్సెస్ అయ్యన్న - ట్విట్టర్లో రచ్చ రచ్చ
Sithara Ghattamaneni: సితార క్యూట్ ఫోటోలు చూశారా?