అన్వేషించండి

Telangana MLC Elections: క్రాస్ ఓటింగ్‌పై కాంగ్రెస్ కోటి ఆశలు.. మెజార్టీపై టీఆర్ఎస్ నేతల ధీమా

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తామే విజయం సాధిస్తామని ఘంటాపథంగా చెబుతున్నా.. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందని, అది తమకు అనుకూలిస్తుందని భావిస్తోంది.

ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికలపై రాజకీయ పార్టీలు పోస్టుమార్టం నిర్వహిస్తున్నాయి. ఎవరికెన్ని ఓట్లు పోలయ్యాయి..? ఎవరు విజయం సాధిస్తారు అనే విషయంపై ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు పోలింగ్‌ సరళిపై విశ్లేషించుకుంటున్నాయి. ఓ వైపు అత్యధిక మెజార్టీ కలిగిన అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ తామే విజయం సాధిస్తామని ఘంటాపథంగా చెబుతున్నా.. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందని, అది తమకు అనుకూలిస్తుందని భావిస్తోంది. అయితే పోలింగ్‌ పై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఖమ్మం ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 768 ఓట్లు ఉండగా.. 738 ఓట్లు పోలయ్యాయి. 30 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. అధికారికంగానే టీఆర్‌ఎస్‌ పార్టీకి 600 వరకు ఓట్లు ఉండగా.. సీపీఐ మద్దతు ఇచ్చింది. అధికారికంగా 116 ఓట్ల సంఖ్యాబలం కలిగిన కాంగ్రెస్‌ పార్టీ పోటీలో నిలవడంతో ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికలపై అందరి దృష్టి పడింది. టీఆర్‌ఎస్‌ పార్టీలో ఎంపీటీసీలు, కౌన్సిలర్లలో నెలకొన్న అసంతృప్తిని ఆసరాగా చేసుకుని కాంగ్రెస్‌ పార్టీ తమకు లాభం చేకూరుతుందని భావించింది. 
గోవా క్యాంప్‌ గోల్‌ కొడుతుందా..?
ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీలో ఆది నుంచి వర్గపోరు నెలకొని ఉంది. ఈ జిల్లాలో బలమైన నాయకులుగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి సారించలేదు. దీంతోపాటు కొత్తగూడెం, వైరా, ఇల్లందు, మణుగూరు నియోజకవర్గాల్లో వర్గ విభేదాలు తీవ్రంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు మొండిచేయి చూపకుండా ఉండేందుకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ నేతృత్వంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి వారం రోజులపాటు తిష్టవేసి అసంతృప్త ప్రజాప్రతినిధులను బుజ్జగించి.. వారిని గోవా క్యాంప్‌కు తరలించారు. పది రోజులపాటు ఇక్కడే ఉంచి ఓటింగ్‌ సమయానికి పోలింగ్‌ కేంద్రాలకు తీసుకొచ్చారు. 
కాంగ్రెస్‌ పోటీ చేయడం వల్లే తమకు లాభం చేకూరిందని, అదే లేకపోతే అసలు తమను పట్టించుకునేవారా..? అని పలువురు కౌన్సిలర్లు, ఎంపీటీసీలు బాహాటంగానే చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో క్యాంప్‌నకు తరలించినప్పటికీ ఇన్ని రోజులు తమకు జరిగిన నష్టం నేపథ్యంలో కొంతమంది కాంగ్రెస్‌ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. గోవా క్యాంప్‌ గోల్‌ కొడుతుందా..? లేదా..? అనేది ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే 14వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. 
క్రాస్‌ ఓటింగ్‌పై కాంగ్రెస్‌ కోటి ఆశలు..
ఓ వైపు టీఆర్‌ఎస్‌ పార్టీ తామే విజయం సాధిస్తామని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తుండగా.. క్రాస్‌ ఓటింగ్‌ తమను గట్టెక్కిస్తుందని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. కొంతమంది టీఆర్‌ఎస్‌ నాయకులు తమతో టచ్‌లో ఉన్నారని, పక్కాగా ఆ ఓట్లు తమకు వస్తాయని పేర్కొనడం గమనార్హం. ఇదే కాకుండా టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్న వారు చాలా వరకు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారే కాకుండా.. స్థానిక పరిస్థితుల నేపథ్యంలో పార్టీ మారారని, వీరంతా కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేస్తారని ఆ పార్టీ నాయకులు పేర్కొనడం గమనార్హం. ఏది ఏమైనా సంఖ్యాపరంగా తమకు అధికారికంగా ఉన్న ఓట్లు కంటే ఎక్కువ ఓట్లు వస్తే నైతికంగా తామే విజయం సాధించినట్లు అని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. 
Also Read: Revant Reddy : అమరవీరుల స్థూపం కట్టేది ఆంధ్రా కంట్రాక్టరా ? కేసీఆర్‌కు డీఎన్‌ఏ టెస్ట్ చేయాలన్న రేవంత్ రెడ్డి !
Also Read: MP Aravind: కవిత ఎంపీగా పోటీ చేస్తారనుకుంటే ఎమ్మెల్సీ అయ్యారు.. 7 ఎమ్మెల్యే స్థానాలు గెలిపించుకుంటా 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR Slams Revanth Reddy: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Slams Revanth Reddy: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Hyderabad Old City: మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
Draupathi 2 Movie : 'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
Embed widget