అన్వేషించండి

MP Aravind: కవిత ఎంపీగా పోటీ చేస్తారనుకుంటే ఎమ్మెల్సీ అయ్యారు.. 7 ఎమ్మెల్యే స్థానాలు గెలిపించుకుంటా 

కొవిడ్ తో చనిపోయిన వారి కుటుంబాలకు కేంద్రం 50 వేల రూపాయలు అందిస్తోందని.. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు.  రాష్ట్రంలో చనిపోయిన వారి లెక్కలు సరిగ్గా లేవని ఆరోపించారు.

కొవిడ్  మేనేజ్ మెంట్ లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్నారు. చనిపోయిన వారి రికార్డు లేకపోవటం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. నిజామాబాద్ జిల్లాలో కొవిడ్ తో చనిపోయిన వారి అప్లికేషన్స్ 446 వస్తే ఇప్పటి వరకు 161  వేరిఫికేషన్ చేశామన్నారు.  156 మందికి డబ్బులు అందాయి అని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని కూడా స్పీడప్ చేయాలన్నారు.  

'ప్రజలను, రైతులను, డ్వాక్రా మహిళలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు. డ్వాక్రా మహిళలకు కేంద్రం ఇచ్చే 8 శాతం ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 4 శాతం వడ్డీ రాయితీ ఇవ్వటం లేదు. నిజామాబాద్ మాదవ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జీ కి కేంద్రం నుంచి నిధులు మంజూరు చేసినా రాష్ట్రప్రభుత్వం నిధులు ఇవ్వటం లేదు. వరి ప్రోక్యూర్ మెంట్ చాలా నెమ్మదిగా కొనసాగుతోంది. రైతుల మీద రాష్ట్రప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవటం, ముందస్తు ప్రణాళికలు లేకపోవటంతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. 10 శాతం 12 శాతం తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నారు. అన్నదాతలను ఆడుకుంటున్నారు.' అని అరవింద్ విమర్శించారు.

కేటీఆర్ రైతుల శ్రమను దోచుకుని వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్న దొంగ అని అన్నారు ఎంపీ అరవింద్. రిసైకిల్ బియ్యం బ్లాక్ మార్కెట్ లో కేటీఆర్ ప్రమోయం ఉందన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రైస్ మిల్లులకు ఎందుకు వెళ్లటం లేదని ప్రశ్నించారు. బ్లాక్ మార్కెట్ దందాలో ఎమ్మెల్యేల భాగం ఉందని అరవింద్ ఆరోపించారు. లేకపోతే రైస్ మిల్లుల వద్దకు ఎందుకు వెళ్లటం లేదని ప్రశ్నించారు. ధాన్యం కొలత మిషన్ లో కూడా అక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు.

డమ్మీ రైస్ మిల్లులు పెట్టి  రైస్ రిసైకిలింగ్ చేసి రైతులను మోసం చేస్తున్నారు. ఈ దందాకు అడ్డుఅదుపు లేకుండా పోయిందన్నారు అరవింద్. బాయిల్డ్ రైస్ మీద బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రల్లో 300 రూపాయలు ఇన్ సెన్ టీవ్ ఇస్తున్నారని.. కేంద్ర ప్రభుత్వమే అన్నీ చేయాలంటే ప్రెసిడెంట్ రూల్ పెట్టాలన్నారు. దళిత బంధు ఎటుపోయిందని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. కవిత వెళ్లే కేసీఆర్ ను దళిత బంధు గురించి అడగాలని అన్నారు. నిరుద్యోగ భృతి ఎటువెళ్లిందని మంత్రి ప్రశాంత్ రెడ్డి, కేసీఆర్ ను ప్రశ్నించాలని అన్నారు. 

MP Aravind: కవిత ఎంపీగా పోటీ చేస్తారనుకుంటే ఎమ్మెల్సీ అయ్యారు.. 7 ఎమ్మెల్యే స్థానాలు గెలిపించుకుంటా 

ఎమ్మెల్సీ కవిత మళ్లీ ఎంపీగా పోటీ చేస్తుందని అనుకున్నా.. కానీ ఎమ్మెల్సీ అయ్యింది. కవిత ఎంపీగా నిలబడాలని కోరిక ఉండే అని అరవింద్ వ్యాఖ్యానించారు.  నష్టపోయిన పంటకు రైతులకు ఏ రకంగా సాయం అందిస్తారని మంత్రి ప్రశాంత్ రెడ్డిని ప్రశ్నించారు అరవింద్. రైతులకు ఏ పంట వేయాలో కేసీఆర్ చెప్పలేక కన్ఫూజ్ చేస్తున్నారని ఆరోపించారు. పసుపు రైతుల విషయంలో బీజేపీ చెప్పింది చేసిందన్నారు. గతేడాది రైతులకు మద్దతు ధర కూడా వచ్చేలా చేశామన్నారు. చివరికి వరి రైతులను కూడా నాశనం చేసేలా ఉంది రాష్ట్ర ప్రభుత్వం అని ఆరోపించారు. సీఎం కేసీఆర్ మూత బడిన షుగర్ ఫ్యాక్టరీలను ఎందుకు తెరవటం లేదని ప్రశ్నించారు అరవింద్. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్నాడు సీఎం కేసీఆర్ అవసరమా.... రైతులకు ఒక్క పంటకైనా బోనస్ ఇచ్చారా సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు.

నిజామాబాద్ జిల్లాకు ఒక్క ఫ్యాక్టరీ అయినా తీసుకొచ్చారా? అప్పట్లో ఎంత వరి ధాన్యం వచ్చినా మార్కెటింగ్ చేస్తామని మాటిచ్చారు. కేసీఆర్ ఏం చేశారు. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని సీఎం కేసీఆర్ అక్టోబర్ 1న కేంద్రానికి లేఖ రాసి ఇచ్చారు. సీఎం హోదాలో సంతకం పెట్టి మరి ఇచ్చారు. మరి రైతులకు ప్రత్యామ్నయం ఏం చూపారు. రాష్ట్రంలో రైతులు ఏ పంటవేయాలో రాష్ట్ర ప్రభుత్వం  నిర్ణయించాలి. దాన్యం కొనమని కేంద్రం ఎక్కడా అనలేదు. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని ఎందుకు కేంద్రానికి రాసిచ్చావు. నరేంద్రమోడీ నాయకత్వంలో ప్రజలు బాగు పడతారు. నాపార్లమెంట్  నియోజకవర్గంలో 7 ఎమ్మెల్యే స్థానాలను గెలిపించుకుంటా. నా తండ్రి డీఎస్ రికార్డును తిరగరాస్తా.
                                                                                        - అరవింద్, నిజామాబాద్ ఎంపీ

Also Read: Hyderabad: రెండేళ్లుగా మరో మహిళతో సీక్రెట్ సహజీవనం... సీన్ కట్ చేస్తే భార్యకు రెడ్ హ్యాండెడ్ గా దొరికేశాడు...

Also Read: Hyderabad Crime: సోలార్ ప్లాంట్ పేరుతో సౌదీ స్నేహితులకు కుచ్చుటోపీ... ప్లాంట్ పెట్టకుండా రూ.12 కోట్లు కొట్టేశాడు

Also Read: Jagityala: జగిత్యాల మహిళపై గల్ఫ్ యజమాని వేధింపులు... దేశానికి తీసుకొచ్చేందుకు ఏజెంట్ రూ.లక్ష డిమాండ్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Congress leaders fear Hydraa: ముంచుకొస్తున్న గ్రేటర్ ఎన్నికలు - హైడ్రాతో కాంగ్రెస్‌కు ప్లస్సా? మైనస్సా?
ముంచుకొస్తున్న గ్రేటర్ ఎన్నికలు - హైడ్రాతో కాంగ్రెస్‌కు ప్లస్సా? మైనస్సా?
Jeevan Reddy meets KCR: అన్నా.. దేవుడే నన్ను మీ దగ్గరికి పంపిండు - కేసీఆర్ వద్ద జీవన్ రెడ్డి భావోద్వేగం
అన్నా.. దేవుడే నన్ను మీ దగ్గరికి పంపిండు - కేసీఆర్ వద్ద జీవన్ రెడ్డి భావోద్వేగం
Hyderabad HIV Injection Tragedy: ప్రియురాలికి హెచ్‌ఐవీ రక్తం ఘటనలో విషాదం.. అవమానం, బాధతో యువతి ఆత్మహత్య
ప్రియురాలికి హెచ్‌ఐవీ రక్తం ఘటనలో విషాదం.. అవమానం, బాధతో యువతి ఆత్మహత్య
Danam Nagender: జీవన్ రెడ్డి తొందరపాటు నిర్ణయంతో రాజ్యసభ స్థానం వదులుకున్నారు: దానం నాగేందర్
జీవన్ రెడ్డి తొందరపాటు నిర్ణయంతో రాజ్యసభ స్థానం వదులుకున్నారు: దానం నాగేందర్

వీడియోలు

Vaibhav Suryavanshi about Bumrah Bowling | బుమ్రా బౌలింగ్‌పై వైభవ్ కామెంట్స్
Who is Mukul Choudhary KKR IPL 2026 | ఈడెన్ గార్డెన్స్‌లో ముకుల్ సునామీ
KKR vs LSG Catch Controversy IPL 2026 | ఐపీఎల్‌లో అంపైరింగ్ పై కైఫ్ ఆగ్రహం
IPL 2026 Controversy GT vs DC | క్రికెట్ లోని ఆ వింత రూల్ పై ఫ్యాన్స్ ఫైర్
IPL 2026 KKR VS LSG Highlights | లక్నో సూపర్ విక్టరీ.. కేకేఆర్ కు నిరాశ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress leaders fear Hydraa: ముంచుకొస్తున్న గ్రేటర్ ఎన్నికలు - హైడ్రాతో కాంగ్రెస్‌కు ప్లస్సా? మైనస్సా?
ముంచుకొస్తున్న గ్రేటర్ ఎన్నికలు - హైడ్రాతో కాంగ్రెస్‌కు ప్లస్సా? మైనస్సా?
Artemis-2 Mission: చందమామకు టాటా చెప్పి పసిఫిక్ తీరంలో ల్యాండ్ అయిన ఆర్టెమిస్‌-2
చందమామకు టాటా చెప్పి పసిఫిక్ తీరంలో ల్యాండ్ అయిన ఆర్టెమిస్‌-2
Digital Payments: యూపీఐ, బ్యాంక్ యూజర్లకు అలర్ట్! మీ మనీ ట్రాన్స్‌ఫర్‌ గంట లేటు! కూలింగ్ పీరియడ్‌ అర్థమేంటి?
యూపీఐ, బ్యాంక్ యూజర్లకు అలర్ట్! మీ మనీ ట్రాన్స్‌ఫర్‌ గంట లేటు! కూలింగ్ పీరియడ్‌ అర్థమేంటి?
Dacoit First Day Collection: డెకాయిట్ ఫస్ట్ డే కలెక్షన్స్... బాక్సాఫీస్‌లో అదరగొట్టిన అడివి శేష్, ఎన్ని కోట్లు వచ్చాయంటే?
డెకాయిట్ ఫస్ట్ డే కలెక్షన్స్... బాక్సాఫీస్‌లో అదరగొట్టిన అడివి శేష్, ఎన్ని కోట్లు వచ్చాయంటే?
IPL 2026 RCB VS RR Result Update: వైభ‌వ్ వీరబాదుడు, జురేల్ విధ్వంసం, వ‌రుస‌గా 4వ విజ‌యంతో టాప్‌ప్లేస్‌లో రాయ‌ల్స్ ! ఆర్సీబీకి తొలి ఓట‌మి
వైభ‌వ్ వీరబాదుడు, జురేల్ విధ్వంసం, వ‌రుస‌గా 4వ విజ‌యంతో టాప్‌ప్లేస్‌లో రాయ‌ల్స్ ! ఆర్సీబీకి తొలి ఓట‌మి
Islamabad Talks:
"డీల్ కుదరకపోతే దాడులే" ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్‌ హెచ్చరిక! ఇస్లామాబాద్‌ చర్చలపై ఉత్కంఠ!
Boat capsizes in Yamuna River: యమునానదిలో పడవ బోల్తా - పది మంది మృతి - పలువురు గల్లంతు!
యమునానదిలో పడవ బోల్తా - పది మంది మృతి - పలువురు గల్లంతు!
Hyderabad HIV Injection Tragedy: ప్రియురాలికి హెచ్‌ఐవీ రక్తం ఘటనలో విషాదం.. అవమానం, బాధతో యువతి ఆత్మహత్య
ప్రియురాలికి హెచ్‌ఐవీ రక్తం ఘటనలో విషాదం.. అవమానం, బాధతో యువతి ఆత్మహత్య
Embed widget