అన్వేషించండి

Minister Sabitha Indra Reddy: ఒమిక్రాన్‌ ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది... విద్యాసంస్థల్లో కరోనా కేసులపై ఆందోళన వద్దు... మంత్రి సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణ విద్యాసంస్థల్లో కరోనా కేసులపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్షించారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అన్నారు.

తెలంగాణలోని విద్యాసంస్థలో కరోనా కలకలం రేపుతోంది. ఇటీవల  సంగారెడ్డి జిల్లాలోని ఓ గురుకుల పాఠశాలలో 42 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా కరీంనగర్ లోని ఓ వైద్యకళాశాలలో 49 మంది విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో అధికారులు అప్రమత్తమై చర్యలు చేపట్టారు. విద్యా సంస్థల్లో కరోనా కేసులపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు లేవన్నారు. పాఠశాలలు, వసతి గృహాల్లో కరోనా నిబంధనలు పాటించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఉపాధ్యాయులకు రెండు డోసులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్‌, ఒమిక్రాన్‌ వేరియంట్‌పై అధికారులు, ప్రజాప్రతినిధులతో మంగళవారం మంత్రి సమీక్షించారు.

Also Read:  గురుకుల పాఠశాలలో కరోనా కలకలం... 42 మంది విద్యార్థులకు పాజిటివ్...

వ్యాక్సినేషన్ పై అవగాహన 

రంగారెడ్డి జిల్లాలో స్థానికులు, స్థానికేతరులందరికీ రెండు డోసుల వ్యాక్సిన్స్ అందించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. రెండో డోసు విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఇంటింటికీ వెళ్లి టీకాలు వేయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యా సంస్థల్లో ప్రస్తుతం ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు లేవన్న మంత్రి... కేసుల నమోదుపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. కొన్ని పాఠశాలల్లో స్పల్పంగా కేసులు నమోదు అయ్యాయన్నారు. వ్యాక్సినేషన్‌ వంద శాతం పూర్తిచేయాలన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు రెండు డోసులు తప్పక తీసుకోవాలని సూచించారు. వ్యాక్సినేషన్ పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. 

Also Read: పంచాయతీ ఖాతాలను ప్రభుత్వం ఎందుకు ఖాళీ చేసింది ? సొంత క్యాడర్‌ను వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ ఎందుకు ఇబ్బంది పెడుతోంది ?

ఇప్పటికే విద్యార్థులు రెండేళ్లు కోల్పోయారు 

రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో కోవిడ్‌ నిబంధనలు పాటించాలని మంత్రి సబితా అధికారులను ఆదేశించారు. కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కరోనా కారణంగా విద్యార్థులు ఇప్పటికే రెండేళ్లు కోల్పోయారన్నారు. విద్యార్థుల భవిష్యత్‌పై ఎలాంటి ప్రభావం పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనుకోని పరిస్థితులు ఎదురైతే ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. 

Also Read: డిసెంబర్ 13 నుంచి కృష్ణా పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ ..అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశం !

Also Read: చెంబులో తల పెట్టిన మూగజీవి... పిల్లి అనుకుని సాయం చేయబోయిన వైఎస్సార్టీపీ నేత... పులిపిల్ల అని తెలిసి పరుగో పరుగు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
Breaking News: యశోదా ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్.. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ అధినేత
యశోదా ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్.. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ అధినేత

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Blood Pressure Tablets : బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
Tollywood Stars Injured: జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Karur Stampede Victims Jobs Case : సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
Jr NTR Shoulder Injury : ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Bonda Uma Issue: బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
Embed widget