అన్వేషించండి

Minister Niranjan Reddy: మంగళవారం మరదలమ్మా వ్యాఖ్యలపై రాజకీయ రచ్చ... పశ్చాత్తాపం వ్యక్తం చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి..

మంగళవారం మరదలమ్మా వ్యాఖ్యలపై మంత్రి నిరంజన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. తాను ఎవరి పేరుతో వ్యాఖ్యలు చేయలేదన్నారు. తన మాటలు సంస్కారవంతులకు సంస్కారంగానే అర్థం అవుతాయన్నారు.

మంత్రి నిరంజన్ రెడ్డి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిల గురించి మంత్రి నిరంజన్ రెడ్డి మంగళవారం మరదలమ్మా అని వ్యాఖ్యానించారు. ఉద్యోగాల భర్తీకి డిమాండ్ చేస్తూ షర్మిల ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహారదీక్ష చేస్తున్నారు. నాగర్ కర్నూల్‌లో టీఆర్ఎస్‌ పార్టీ సమావేశంలో మాట్లాడిన నిరంజన్ రెడ్డి షర్మిలపై విమర్శలు చేశారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయాలని దీక్షలు చేస్తానంటూ మంగళవారం మరదలు ఒకామె బయలుదేరారన్నారు. ఉద్యోగాలు త్వరగా భర్తీ చేయాలనే ఆమె డిమాండ్‌ వెనుక 20 శాతం కోటాలో తెలంగాణ ఉద్యోగాలను పొందేందుకు ఆంధ్రోళ్ల కుట్రలు దాగి ఉన్నాయని ఆరోపించారు. 

Also Read: హుజూరాబాద్ లో లెటర్ల లొల్లి.. దళిత బంధు ఆపింది ఈటలే అంటున్న టీఆర్‌ఎస్‌.. కాదు.. కాదంటున్న బీజేపీ

ఆ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం

మంగళవారం మరదలమ్మా వ్యాఖ్యలపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వివరణ ఇచ్చారు. తాను ఎవరి పేరుతో ఆ వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఏకవచనం కూడా వాడలేదన్నారు. చివరన అమ్మా అని కూడా అన్నానని మంత్రి వివరించారు. ఈ వ్యాఖ్యలు ఎవరికైనా బాధ కలిగిస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. తన మాటలు సంస్కారవంతులకు సంస్కారంగానే అర్థమవుతున్నాయన్నారు. వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తన కుమార్తె కంటే పెద్దదన్నారు. తన సోదరి కంటే చిన్నదని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ ను ఏకవచనంతో సంబోధించడం సంస్కారం కాదన్నారు. ఈ విషయంపై టీఆర్ఎస్ శ్రేణులు సరైన స్పందిస్తాయన్నారు. 

Also Read: ‘వరి-ఉరి’ పేరుతో బండి సంజయ్ దీక్ష.. మంత్రి నిరంజన్ రెడ్డి సవాల్

తెలంగాణపై కేంద్రం వివక్ష 

వరి కొనుగోళ్లపై బీజేపీ నేతలు బాధ్యతరాహిత్యంగా మాట్లాడుతున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. తాను సవాల్ విసిరితే బీజేపీ నేతలు దీక్షలు చేసి పారిపోయారన్నారు. కేసీఆర్ రైస్ మిల్లర్ల ప్రభుత్వం అని బీజేపీ నేతలు చిల్లర మాటలు మాట్లాడుతున్నారన్నారు. రైస్ మిల్లర్ల ప్రభుత్వమో రైతుల అనుకూల ప్రభుత్వమో ప్రజలకు తెలుసన్నారు. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం దళారీ పాత్ర అని ఒక బీజేపీ నేత అంటారని, మోదీ కూడా సీఎంగా చేశారని, ఆయన కూడా దళారీ పాత్ర పోషించారా అని ప్రశ్నించారు. మద్దతు ధరతో పాటు పంట ఉత్పత్తుల కొనుగోలు కేంద్రానికి ఉన్న రాజ్యాంగ బాధ్యత అని గుర్తుచేశారు. కేంద్రం తన బాధ్యతను విస్మరిస్తోందన్నారు. పంజాబ్ లో ధాన్యమంతా కొంటున్న కేంద్రం తెలంగాణకు మొండి చేయి చూపుతుందన్నారు. పంజాబ్ ఇండియాలో భాగం.. తెలంగాణ కాదా అన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతుందన్నారు. హుజురాబాద్ లో బీజేపీ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. 

Also Read: షర్మిలపై మంత్రి నిరంజన్ రెడ్డి అసభ్య వ్యాఖ్యలు.. కుక్క అని మండిపడ్డ వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
Allu Cinemas: 'అల్లు సినిమాస్'లో అపశృతి... ప్రేక్షకులకు సినిమా మధ్యలో షాక్
'అల్లు సినిమాస్'లో అపశృతి... ప్రేక్షకులకు సినిమా మధ్యలో షాక్
TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget