అన్వేషించండి

Compensation to Nampally Fire Accident Deaths Families: నాంపల్లి ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి - మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల సాయం

Compensation To Nampally Accident Victims: నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల సాయం ప్రకటించింది. ఇప్పటివరకూ 9 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

Compensation to Nampally Fire Accident Victims: నాంపల్లి అగ్ని ప్రమాద (Nampally Fire Accident) ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల (5 Lakhs Compensation) సాయం ప్రకటించారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి కేటీఆర్ (KTR) ఈ మేరకు పరిహారం ప్రకటించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. ఇప్పటివరకూ 9 మంది మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ముగ్గురు గాయపడగా, 21 మంది అపస్మారక స్థితిలో ఉన్నారు. వీరిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉండగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

బాధితులకు మెరుగైన వైద్యం

నాంపల్లి ఘటనలో మృతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ప్రమాద ఘటనపై ఆరా తీసిన ఆయన, ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. అటు, గవర్నర్ తమిళిసై కూడా ప్రమాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎస్ ను ఆదేశించారు. ఘటనకు కారణాలు, తీసుకున్న చర్యలపై 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని నిర్దేశించారు.

దర్యాప్తునకు ఆదేశం

ప్రమాద ఘటనపై మంత్రి కేటీఆర్ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఆయన, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులు, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. 'ప్రమాద ఘటన విచారకరం. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల సాయం అందిస్తాం. అస్వస్థతకు గురైన వారికి ఉస్మానియాలో మెరుగైన వైద్యం అందిస్తున్నాం. అవసరమైతే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తాం. ప్రమాదంలో ఆస్తి నష్టపోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది. భవనం సెల్లార్ లో రసాయనాలు నిల్వ ఉంచారు. పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం ప్రమాదానికి గల కారణాలు వివరంగా తెలుస్తాయి. 6 నెలల కిందట అగ్ని ప్రమాదాలపై సేఫ్టీ ఆడిట్ కింద విచారణ చేయించాం. ఈ ప్రమాదంలో నివేదిక ద్వారా వివరాలు తెలుసుకుని చర్యలు చేపడతాం.' అని కేటీఆర్ వెల్లడించారు.

హైదరాబాద్ నాంపల్లి బజార్ ఘాట్ లో సోమవారం ఉదయం 9:30కు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ రసాయన గోదాంలో అగ్ని ప్రమాదం జరిగి ఐదో అంతస్తు వరకు మంటలు వ్యాపించాయి. ఈ అగ్ని ప్రమాదంలో 9 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురు పురుషులు, ఓ చిన్నారి ఉన్నారు. కొందరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 6 ఫైరింజన్ల సాయంతో మంటలు అదుపులోకి తెస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న 15 మందిని అగ్ని మాపక సిబ్బంది రక్షించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 21 మంది అస్వస్థతకు గురైనట్లు పోలీసులు తెలిపారు. వారిలో 8 మంది అపస్మారక స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. వారందరినీ ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Also Read: Nampally Accident Deaths: నాంపల్లి అగ్ని ప్రమాదం - మృతుల వివరాలివే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana DSC: తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, ఏ రోజు ఏ పరీక్ష అంటే?
తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, ఏ రోజు ఏ పరీక్ష అంటే?
Chandrababu Revanth Reddy: త్వరలో ఒకే స్టేజ్‌ మీదికి చంద్రబాబు, రేవంత్‌! స్పెషల్ ఏంటో తెలుసా?
త్వరలో ఒకే స్టేజ్‌ మీదికి చంద్రబాబు, రేవంత్‌! స్పెషల్ ఏంటో తెలుసా?
Actor Ali: వైసీపీకి అలీ రాజీనామా, ఇక నా దారి ఇదే - వీడియో విడుదల
వైసీపీకి అలీ రాజీనామా, ఇక నా దారి ఇదే - వీడియో విడుదల
Actress Hema: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి హేమ - తన అరెస్ట్‌పై స్పందిస్తూ సెటైరికల్‌ కామెంట్స్‌
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి హేమ - తన అరెస్ట్‌పై స్పందిస్తూ సెటైరికల్‌ కామెంట్స్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

India vs south Africa T20 World Cup Final | టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో ప్రత్యర్థులుగా పోటా పోటీ జట్లుRohit Sharma on Virat Kohli | T20 World Cup 2024 సెమీఫైనల్ లోనూ ఫెయిల్ అయిన కింగ్ విరాట్ కొహ్లీ |ABPAxar Patel MoM Award Ind vs Eng Semi Final | T20 World Cup 2024లో భారత్ ను ఫైనల్ కి చేర్చిన బాపు|ABPIndia vs England T20 World Cup 2024 Semis 2 | రెండేళ్ల గ్యాప్ లో ఇంగ్లండ్ కు ఇవ్వాల్సింది ఇచ్చేశాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana DSC: తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, ఏ రోజు ఏ పరీక్ష అంటే?
తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, ఏ రోజు ఏ పరీక్ష అంటే?
Chandrababu Revanth Reddy: త్వరలో ఒకే స్టేజ్‌ మీదికి చంద్రబాబు, రేవంత్‌! స్పెషల్ ఏంటో తెలుసా?
త్వరలో ఒకే స్టేజ్‌ మీదికి చంద్రబాబు, రేవంత్‌! స్పెషల్ ఏంటో తెలుసా?
Actor Ali: వైసీపీకి అలీ రాజీనామా, ఇక నా దారి ఇదే - వీడియో విడుదల
వైసీపీకి అలీ రాజీనామా, ఇక నా దారి ఇదే - వీడియో విడుదల
Actress Hema: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి హేమ - తన అరెస్ట్‌పై స్పందిస్తూ సెటైరికల్‌ కామెంట్స్‌
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి హేమ - తన అరెస్ట్‌పై స్పందిస్తూ సెటైరికల్‌ కామెంట్స్‌
Fire Accident: షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం - ఆరుగురు మృతి
షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం - ఆరుగురు మృతి
Chandrababu White Paper On Polavaram : రివర్స్ టెండర్ల డ్రామానే పోలవరానికి శాపం - శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు
రివర్స్ టెండర్ల డ్రామానే పోలవరానికి శాపం - శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు
Chevella MLA: బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్! కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే కాలె యాదయ్య
బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్! కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే కాలె యాదయ్య
Harish Rao Meets Kavitha : తీహార్ జైల్లో కవితతో  హరీష్ రావు ములాఖత్ - లిక్కర్ కేసు తాజా పరిణామాలపై చర్చ
తీహార్ జైల్లో కవితతో హరీష్ రావు ములాఖత్ - లిక్కర్ కేసు తాజా పరిణామాలపై చర్చ
Embed widget