By: ABP Desam | Updated at : 07 Jan 2022 08:38 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
కరోనా కేసులు(ప్రతీకాత్మక చిత్రం)
తెలంగాణలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. గత మూడు రోజులుగా భారీగా కేసులు వస్తున్నాయి. తాజాగా కోవిడ్ కేసులు 2 వేల మార్కును దాటాయి. గడిచిన 24 గంటల్లో 64,474 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటిల్లో కొత్తగా 2,295 పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,89,751కి చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజా బులిటెన్ లో ఈ గణాంకాలు వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 4,039కి చేరింది. కరోనా నుంచి మరో 278 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 9,861 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఒక్కరోజు వ్యవధిలో నమోదైన మొత్తం కేసుల్లో 1,452 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు అయ్యాయి.
Also Read: దేశంలో కరోనా డేంజర్ బెల్స్.. ఒక్కరోజులో అక్షరాల లక్ష కేసులు
ఏపీలో కరోనా కేసులు
ఏపీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడచిన 24 గంటల వ్యవధిలో 37,849 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 840 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గడచిన 24 గంటల్లో కోవిడ్ తో ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,501కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 133 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,62,290 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 2972 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Also Read: వ్యాక్సినేషన్లో భారత్ మరో రికార్డ్.. 150 కోట్లు దాటిన డోసుల పంపిణీ
దేశంలో లక్షకు పైగా కరోనా కేసులు
దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఒక్కరోజులో కొత్తగా లక్షకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 1,17,100 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. 302 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. 30,836 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
Also Read: ఇటలీ నుంచి వచ్చిన మరో 173 మందికి కరోనా.. 15 మంది జంప్!
Also Read: మార్చిలో పదో తరగతి పరీక్షలు... 7 సబ్జెక్టులతో పరీక్షల నిర్వహణ... విద్యాశాఖ మంత్రి సురేశ్ ప్రకటన
Breaking News Live Telugu Updates: ఏపీ సీఎం జగన్ విమానంలో సాంకేతిక లోపం, ఎమర్జెన్సీ ల్యాండింగ్
Jagityala మున్సిపల్ ఛైర్పర్సన్ బోగ శ్రావణి రాజీనామాకు కలెక్టర్ ఆమోదం
Hyderabad Traffic: హైదరాబాదీలు జర సోచో - ఆ రూట్లో నేటి నుంచి 40 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు
TS Governament Vs Governer : తెలంగాణ సర్కార్పై గవర్నర్దే పైచేయి - హైకోర్టులో ఏం జరిగిందంటే ?
Gutha Sukender Reddy On Governor : వక్రబుద్ధితో కొందరు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు- గుత్తా సుఖేందర్ రెడ్డి
AP Cabinet Meeting : ఫిబ్రవరి 8న ఏపీ కేబినెట్ భేటీ - కీలక నిర్ణయాలుంటాయా ?
Lokesh Yuvagalam ; ఏపీ , కర్ణాటక మధ్య పెట్రోల్ ధరల్లో ఎంత తేడా అంటే ? పాదయాత్రలో లోకేష్ చూపించారు...
Dasara Teaser: నాని నెవ్వర్ బిఫోర్ - అంచనాలను మించిపోయిన ‘దసరా’ టీజర్ - ఎలా ఉందో చూశారా?
టీడీపీ నేతలకు షాక్ - పరువు నష్టం దావా వేసిన రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ