అన్వేషించండి

Telangana News: కాంట్రాక్ట్ ఉద్యోగులకు తెలంగాణ హైకోర్టు షాక్, జీవో 16 కొట్టివేస్తూ ఉత్తర్వులు

TG high court quashes GO 16 | కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేయడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 16ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఆ ఉద్యోగులు మళ్లీ కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుతారు.

TG High Court quashed GO 16 of regularisation of contract employees హైదరాబాద్: రెగ్యులరైజ్ అయిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. సెక్షన్ 10ఏ ప్రకారం తీసుకొచ్చిన జీవో 16ను తెలంగాణ హైకోర్టు మంగళవారం నాడు కొట్టివేసింది. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయడం రాజ్యాంగ విరుద్ధం అని హైకోర్టు స్పష్టం చేసింది. జీవో 16 ద్వారా గత BRS ప్రభుత్వం వేలాది మందిని రెగ్యులరైజ్‌ చేసింది. ముఖ్యంగా విద్య, వైద్య శాఖల్లోనే ఎక్కువ మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించింది. తాజాగా హైకోర్టు సంచలన తీర్పుతో రెగ్యులరైజ్‌ అయిన కాంట్రాక్ట్‌ ఉద్యోగుల భవితవ్యం మళ్లీ ఆందోళనలో పడింది. బీఆర్ఎస్ ప్రభుత్వం రెగ్యూలరైజ్ చేసిన ఉద్యోగులను తిరిగి కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా కొనసాగించాల్సి ఉంటుందని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది పిటిషనర్లు తెలిపారు. అయితే దీనిపై హైకోర్టు నుంచి తమకు ఆర్డర్‌ కాపీ వస్తే స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు.

ఇకపై ఆ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయడం కుదరదు

ఎన్నో ఏళ్లుగా సగం జీతానికే సేవలు అందిస్తున్నాం. ప్రభుత్వం ఇప్పుడైనా మమ్మల్ని గుర్తించి, మా కుటుంబ సమస్యలు తెలుసుకుని జాబ్ పర్మినెంట్ చేయాలి... ఇదే మాట కాంట్రాక్ట్ ఉద్యోగుల నుంచి తరచుగా వింటూనే ఉంటాం. కొన్నిసార్లు ప్రభుత్వాలు వారిపై సానుకూల నిర్ణయాలు తీసుకుని రెగ్యూలరైజ్ (ఉద్యోగాల క్రమబద్ధీకరణ) చేస్తాయి. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సైతం కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవల్ని గుర్తించి, వారి ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడానికి సెక్షన్ 10ఏ ప్రకారం జీవో 16 తీసుకొచ్చింది. దీని ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగులను కేసీఆర్ ప్రభుత్వం పర్మినెంట్ చేసి వారి కుటుంబాల్లో వెలుగులు నింపింది.

అయితే నియామక పరీక్షలు నిర్వహించి ఖాళీలను భర్తీ చేయాలి కానీ, నేరుగా వారిని రెగ్యూలరైజ్ చేయడం రాజ్యాంగ విరుద్ధం అంటూ దాఖలైన పిటిషన్లను ధర్మాసనం నేడు విచారించింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పర్మినెంట్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. దాంతో రెగ్యూలరైజ్ అయిన ఉద్యోగులు మళ్లీ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మారనున్నారు. ఏళ్ల తరబడి పడుతున్న వారి కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయని చెబుతున్నారు.

Also Read: Hydra Commissioner: కూల్చడాలే కాదు, ఆ అధికారులపై సైతం చర్యలు - హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌

ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, ఒక్క నెలలో మిగతా పోస్టుల భర్తీ సాధ్యమా?

కాగా, తెలంగాణ ప్రభుత్వం ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని యువతకు హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీతో యువత, నిరుద్యోగులు హస్తం పార్టీకి అభయహస్తం ఇచ్చి ఓటు వేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వరుసగా నియామకాల పత్రాలు అందిస్తూ వస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇదివరకే 50, 60 వేల వరకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడంతో పాటు గ్రూప్ 1, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలు నిర్వహించింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ లో నిర్వహించగా, వచ్చే నెలలో గ్రూప్ 2 ఎగ్జామ్ జరగనుంది. గ్రూప్ 4 మెరిట్ జాబితా అనంతరం సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిపి ఇటీవల తుది జాబితాను విడుదల చేయడం తెలిసిందే.

Also Read: TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Amaravati Land Pooling: అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
Warangal Viral News: లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Amaravati Land Pooling: అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
Warangal Viral News: లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
Fact Check: మార్చి 2026 నుంచి రూ.500 నోట్ల చెలామణి ఆగిపోతుందా? మళ్ళీ నోట్ల రద్దు జరుగుతుందా?
మార్చి 2026 నుంచి రూ.500 నోట్ల చెలామణి ఆగిపోతుందా? మళ్ళీ నోట్ల రద్దు జరుగుతుందా?
Aadi Saikumar: ఆది సాయి కుమార్ ఇంట్లో డబుల్ ధమాకా - 'శంబాల' సక్సెస్ తర్వాత మరో శుభవార్త!
ఆది సాయి కుమార్ ఇంట్లో డబుల్ ధమాకా - 'శంబాల' సక్సెస్ తర్వాత మరో శుభవార్త!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Embed widget