అన్వేషించండి

Telangana Latest News: పంచాయతీ ఎన్నికలపై రాజ్యాంగం ఏం చెబుతుంది?తెలంగాణ ప్రక్రియ ఎందుకు ఆలస్యమైంది?

Telangana News: రాజ్యాంగంలోని 73వ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి కల్పించింది. గ్రామ పంచాయతీల పదవీకాలం ముగిసిన తర్వాత ఆరు నెలల్లోగా కొత్త పాలక వర్గం ఏర్పాటు చేయాలి.

Telangana Local Body Elections : తెలంగాణ రాష్ట్రంలోని పంచాయతీ ఎన్నికలు 30 సెప్టెంబర్ 2025లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే, ఈ తీర్పును ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుని హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది, రాజ్యాంగం స్థానిక సంస్థల ఎన్నికలపై ఏం చెబుతుందో సమగ్రంగా పరిశీలిద్దాం.

స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగ విధి (Constitutional Mandate)

రాజ్యాంగంలోని 73వ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి కల్పించారు. దీని ప్రకారం, గ్రామ పంచాయతీల పదవీకాలం ముగిసిన తర్వాత ఆరు నెలల్లోగా కొత్త పాలక వర్గం ఏర్పాటు చేసేందుకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇది రాజ్యాంగ విధి. తెలంగాణలో 12,991 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ పంచాయతీల పాలకవర్గం గడువు 2024 జనవరితో ముగిసింది. అప్పటి నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలనలో పంచాయతీలు ఉన్నాయి. ఆరు నెలల గడువులోగా ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యాంగ విరుద్ధం. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకునే హైకోర్టు ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు జారీ చేసింది.

స్థానిక ప్రభుత్వాలలో ప్రజల ప్రాతినిధ్యం లేకపోవడం

ప్రస్తుతం పంచాయతీలు స్పెషల్ ఆఫీసర్ల పాలనలో నడుస్తున్నాయి. కానీ రాజ్యాంగం ప్రకారం పంచాయతీల పాలన ప్రజలు ఎన్నుకున్న పాలకవర్గం ద్వారా నడవాల్సి ఉంది. ప్రత్యేక అధికారుల పాలన తాత్కాలిక ఏర్పాటు తప్ప ప్రజాస్వామ్యబద్ధమైన వ్యవస్థ కాదని కోర్టు అభిప్రాయం. స్థానికంగా ప్రజల భాగస్వామ్యంతోనే పాలన జరగాలన్నది రాజ్యాంగ స్ఫూర్తి. వారి భాగస్వామ్యం లేకపోవడం అంటే ప్రజల గొంతుకను అణిచివేయడమని హైకోర్టు అభిప్రాయపడింది. ఎన్నికల జాప్యానికి సంబంధించి ఎన్నికల సంఘం కోర్టు ముందు ఉంచిన కారణాలను సాకులుగా భావించి న్యాయస్థానం తిరస్కరించింది.

ఎన్నికల నిర్వహణలో జాప్యానికి ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పిన కారణాలివే:

1. గ్రామ పంచాయతీల పునర్విభజన, కొన్ని గ్రామ పంచాయతీలు సరిహద్దుల పునర్విభజన పెండింగ్‌లో ఉన్నాయి.

2. ఓటర్ల జాబితాలో సవరణలు పూర్తిగా జరగలేదని, మార్పులు-చేర్పులు, తొలగింపు వంటి ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు.

3. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన ప్రక్రియ ఖరారు కాలేదు.

4. వర్షాకాలంలో ఎన్నికల నిర్వహణ కష్టమైన పని.

ఈ కారణాలను హైకోర్టు తప్పుబట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సాకులు చెబుతున్నారని ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని న్యాయస్థానం ఆక్షేపించింది. ఈ ప్రక్రియను ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుగానే పూర్తి చేసి ఉండాలని అభిప్రాయపడింది. వర్షాకాలంలో అవసరమైన చర్యలు చేపట్టి ఎన్నికలను పూర్తి చేయాలని ఆదేశించింది. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. 

స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రజాప్రయోజన వ్యాజ్యాలు

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో జాప్యం చేస్తుందని రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వంపై కొందరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేశారు. అందులో రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైన తన విధులు నిర్వర్తించడంలో విఫలమైందని, ప్రజాస్వామ్య ప్రక్రియను అడ్డుకుంటుందని పేర్కొనడం జరిగింది. ఈ పిటిషన్లను కొందరు మాజీ సర్పంచ్‌లు, సామాజిక కార్యకర్తలు, రాజకీయనేతలు వేయడం జరిగింది. దీనిపై స్పందించిన హైకోర్టు విచారణను చేపట్టింది. ఎన్నికల సంఘం చూపించిన కారణాలను తప్పుబట్టిన హైకోర్టు సెప్టెంబర్ 30వ తేదీలోగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం త్వరలోనే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను జారీ చేయాల్సి ఉంటుంది.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Thiruparankundram: ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
Venezuelan people happy: దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
Embed widget