అన్వేషించండి

Farmhouse Case To CBI : సీబీఐకి ఎమ్మెల్యేలకు ఎర కేసు - తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం !

ఎమ్మెల్యేలకు ఎర కేసు సంచలన మలుపు తిరిగింది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.

 

Farmhouse Case To CBI :  తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని నమోదైన కేసును సీబీఐకి  బదిలీ చేస్తూ తెలంగాణ  హైకోర్టు సంచలన నిర్ణయం లతీసుకుంది. సుదీర్గ వాదన తర్వాత హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో మొదట ఏసీబీ కేసును నమోదు చేశారు. తర్వాత హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలో  ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. కానీ ఈ కేసును ఏసీబీ మాత్రమే విచారించాలని..  సిట్ ఎలా దర్యాప్తు చేస్తుందని ఏసీబీ కోర్టు .. సిట్ దాఖలు చేసిన నివేదికల్ని తిరస్కరించింది. అలాగే.. ఈ కేసులో కీలక నిందితులు సిట్ దర్యాప్తు కుట్ర పూరితంగా జరుగుతోందని.. విచారణను సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. కేసును సీబీఐకి అప్పగించాలని ఆదేశిస్తూ నిర్ణయం తీసుకుంది. 

సిట్ ఏర్పాటును కొట్టి వేసిన తెలంగాణ హైకోర్టు 

ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తునుంచి సిట్‌ను తప్పించి.. సీబీఐ లేదా హైకోర్టు నియమించే ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, నిందితులు రామచంద్రభారతి, నందకుమార్‌, సింహయాజి,   న్యాయవాది బీ శ్రీనివాస్‌, తుషార్‌ వెల్లపల్లి తదితరులు పిటిషన్లు దాఖలు చేశారు. సుదీర్ఘ వాదనలు జరిగాయి. అవినీతి కేసులను ఏసీబీ మాత్రమే దర్యాప్తు చేయాలని, సాధారణ పోలీసులు చేయరాదంటూ పిటిషనర్లు వాదించారు.  అయితే అవినీతి ఆరోపణల కేసులను ఏసీబీ మాత్రమే దర్యాప్తు చేయాలని లేదని, ఇతర పోలీసులు కూడా దర్యాప్తు చేయవచ్చునని తెలంగాణ ప్రభుత్వ లాయర్లు వాదించారు.  ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు సిట్  ఏర్పాటును కొట్టి వేస్తూ.. కేసును సీబీైకి బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 

ఇప్పటికే ఎమ్మెల్యేల ఎర కేసులో ఈడీ కూడా విచారణ 

ఇప్పటికే ఈ కేసులో  ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టరేట్‌‌ (ఈడీ) కూడా విచారణ జరుపుతోంది. నిందితుడు నందకుమార్ ను జైల్లోనే కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తోంది. సోమవారం.. మంగళవారం ప్రశ్నించనుంది. ఈ కేసులో బీజేపీ ప్రోద్భలంతో నందకుమార్ తనను ప్రలోభ పెట్టారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ. వంద కోట్లు ఇస్తామన్నారని ఆయన చెప్పారు.  రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు నందుకుమార్‌‌పై బంజారాహిల్స్‌ పీఎస్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ నం.‌ 967/2022, మొయినాబాద్‌ పీఎస్‌లో నమోదైన ఫామ్‌హౌస్‌ కేస్‌ ఎఫ్‌ఐఆర్‌‌ నం.455/2022 కేసులు నమోదయ్యాయి. వీటిలో  ప్రివెన్షన్ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌ 2002, సెక్షన్‌50 కింద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్‌ఫర్మేషన్‌ రిపోర్ట్‌ (ఈఎస్‌ఐఆర్‌)‌/48/20‌22 రిజిస్టర్‌‌ చేసినట్లు ఈడీ ప్రకటించారు.    

ఫిర్యాదుదారుడినైన తనను ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారని రోహిత్ రెడ్డి ఆరోపణ

మరో వైపు ఫామ్ హౌస్ కేసులో అత్యంత కీలకమైన వ్యక్తిగా ఉన్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆదివారం ప్రెస్ మీట్ పెట్టి ఈడీపై తీవ్ర ఆరోపణలు చేశారు. నందకుమార్ నుంచి స్టేట్ మెంట్ తీుకుని తనను నిందితుడిగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. దీనిపై తాను హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఈ లోపే ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. 

 


  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News : ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి బదిలీ - ఎన్నికల విధుల నుంచి తప్పించిన ఈసీ
ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి బదిలీ - ఎన్నికల విధుల నుంచి తప్పించిన ఈసీ
Cantonment Bypoll: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
Akhanda 2: ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
Thota Trimurtulu Case :  అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Nirai Mata Temple | గర్భగుడిలో దేవత ఉండదు... కానీ ఉందనుకుని పూజలు చేస్తారుSiricilla Gold Saree | Ram Navami | మొన్న అయోధ్య.. నేడు భద్రాద్రి సీతమ్మకు... సిరిసిల్ల బంగారు చీరVijayawada CP On CM Jagan Stone Attack:ప్రాథమిక సమాచారం ప్రకారం సీఎంపై దాడి వివరాలు వెల్లడించిన సీపీRCB IPL 2024: చేతిలో ఉన్న రికార్డ్ పోయే.. చెత్త రికార్డ్ వచ్చి కొత్తగా చేరే..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News : ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి బదిలీ - ఎన్నికల విధుల నుంచి తప్పించిన ఈసీ
ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి బదిలీ - ఎన్నికల విధుల నుంచి తప్పించిన ఈసీ
Cantonment Bypoll: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
Akhanda 2: ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
Thota Trimurtulu Case :  అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
IPL 2024: ఇక నా వల్ల కాదు గుడ్‌ బై! మ్యాక్స్‌వెల్‌ సంచలన ప్రకటన
ఇక నా వల్ల కాదు గుడ్‌ బై! మ్యాక్స్‌వెల్‌ సంచలన ప్రకటన
CM Jagan: సీఎంపై రాయి దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ - సంచలనం రేపుతోన్న లోకేష్ ట్వీట్
సీఎంపై రాయి దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ - సంచలనం రేపుతోన్న లోకేష్ ట్వీట్
Drugs And Drive Test: ఇకపై డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు - గంజాయి తాగే వారిని ఈజీగా గుర్తించేలా!
ఇకపై డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు - గంజాయి తాగే వారిని ఈజీగా గుర్తించేలా!
Kavali Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఐదుగురు స్పాట్ డెడ్
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఐదుగురు స్పాట్ డెడ్
Embed widget