అన్వేషించండి

Rythu Bharosa Scheme: రైతులకు గుడ్‌న్యూస్.. రెండో విడత రైతుభరోసా నిధుల విడుదలపై ప్రకటన

Second Phase of Rythu Bharosa | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 20న కాటారం సభ వేదికగా రెండో విడత రైతుభరోసా నిధులను విడుదల చేయనున్నారు. దాదాపు 45 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది.

Second Phase of Rythu Bharosa: CM Revanth Reddy to Release Funds on April 20
హైదరాబాద్: రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. రైతు భరోసా నిధుల విడుదలపై అప్డేట్ ఇచ్చింది. ఏప్రిల్ 20వ తేదీన రెండో విడత రైతుభరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని స్వయంగా ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా 45,11,947 మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో మొత్తం రూ.5,653 కోట్ల నిధులు జమ కానున్నాయని అధికారులు తెలిపారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే తొలి విడత రైతుభరోసా నిధులను విజయవంతంగా పంపిణీ చేసింది. మార్చి 22న సిద్దిపేట జిల్లా నర్మెటలో జరిగిన బహిరంగ సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొదటి విడత నిధులను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో 1.50 కోట్ల ఎకరాలకు సంబంధించి రూ.3,590 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇప్పుడు రెండో విడత నిధుల విడుదలతో సాగు పెట్టుబడి కోసం ఎదురుచూస్తున్న రైతులకు పెద్ద ఉపశమనం కలగనుంది.

త్వరలో రైతు భరోసా నిధుల విడుదల ప్రక్రియ పూర్తి.. 

మార్చి 22న సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధుల విడుదల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ ప్రభుత్వం రైతు పక్షపాతి అని, సన్న బియ్యానికి రూ.500 బోనస్ ఇచ్చిన ఘనత తమదేనని పేర్కొన్నారు. పెట్టుబడి సాయం కింద తొలి విడతగా 70 లక్షల మంది రైతులకు రూ.3,600 కోట్లు విడుదల చేశామని, ఈ నిధులు రేపటిలోగా రైతుల ఖాతాల్లో జమ అవుతాయని వెల్లడించారు. మిగిలిన రూ.5,400 కోట్లను రెండు విడతలుగా (ప్రతి 20 రోజులకు రూ.2,700 కోట్లు) జమ చేసి, మొత్తం 45 రోజుల్లోగా ఎకరానికి రూ.6,000 చొప్పున మొత్తం రూ.9,000 కోట్ల పంపిణీ ప్రక్రియను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

ఎన్నికల హామీ మేరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకే (DBT) నిధులు చేరుస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలోని లోపాలను సవరించి, అర్హులైన ప్రతి చిన్న, సన్నకారు మరియు కౌలు రైతుకు ఈ సాయం అందేలా పక్కా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. సాగు పనులు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం కోట్లాది మంది రైతులకు పెద్ద ఊరటనిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. నిధుల జమను పర్యవేక్షించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేశారు.

గత ప్రభుత్వంతో పోలిస్తే తమ ప్రభుత్వం రైతుల కోసం రెట్టింపు ఖర్చు చేస్తోందని గణాంకాలను వివరించారు. బీఆర్ఎస్ హయాంలో నెలకు సగటున రూ.2,533 కోట్లు ఖర్చు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు సగటున రూ.5,500 కోట్లు వెచ్చిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ ఉచిత విద్యుత్, రుణమాఫీ, రైతు బీమా, రైతు భరోసా వంటి పథకాలకు వెనకడుగు వేయకుండా ఇప్పటి వరకు రూ.1.30 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేశామని ఆయన వెల్లడించారు.

తెలంగాణ వరి సాగులో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, గత ఏడాది 2.58 కోట్ల మెట్రిక్ టన్నుల దిగుబడి సాధించామని సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రైతులు పంట మార్పిడిపై దృష్టి సారించాలని కోరారు. ముఖ్యంగా మెదక్, నిజామాబాద్ రైతులు గతంలో పసుపు, చెరుకు బాగా పండించేవారని గుర్తు చేస్తూ.. ప్రస్తుతం రాష్ట్రంలో పామాయిల్ సాగు 3 లక్షల ఎకరాలకు చేరిందని, దీనిని 10 లక్షల ఎకరాలకు పెంచినా ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని ఆయన భరోసా ఇచ్చారు.

 

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balka Suman controversy: మిలిటెంట్ దాడులు చేద్దాం, ఆఫీసుల్ని తగులబెడదాం - బీఆర్ఎస్ కార్యకర్తలకు బాల్క సుమన్ పిలుపు వివాదాస్పదం
మిలిటెంట్ దాడులు చేద్దాం, ఆఫీసుల్ని తగులబెడదాం - బీఆర్ఎస్ కార్యకర్తలకు బాల్క సుమన్ పిలుపు వివాదాస్పదం
Bandi Bhageerath POCSO case: పొక్సో కేసులో బండి భగీరథ్‌కు కస్టడీ.. మూడు రోజుల పాటు విచారించనున్న పోలీసులు!
పొక్సో కేసులో బండి భగీరథ్‌కు కస్టడీ.. మూడు రోజుల పాటు విచారించనున్న పోలీసులు!
Southwest Monsoon Update: నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం.. మరికొన్ని రోజులు ఎండల మంట తప్పదా!
నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం.. మరికొన్ని రోజులు ఎండల మంట తప్పదా!
Heatwave In AP and Telangana: వడదెబ్బతో తెలంగాణలో 54 మంది, ఏపీలో 18 మంది మృతి.. చరిత్రలో తొలిసారిగా రెడ్ అలర్ట్
వడదెబ్బతో తెలంగాణలో 54 మంది, ఏపీలో 18 మంది మృతి.. చరిత్రలో తొలిసారిగా రెడ్ అలర్ట్
Advertisement

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 RCB In Final: వ‌రుస‌గా రెండో సీజన్ లో ఫైన‌ల్లోకి ఆర్సీబీ.. జీటీని చిత్తుగా ఓడించిన ప‌తిదార్ సేన‌.. రాణించిన డ‌ఫీ, భువీ, తెవాటియా పోరాటం వృథా
వ‌రుస‌గా రెండో సీజన్ లో ఫైన‌ల్లోకి ఆర్సీబీ.. జీటీని చిత్తుగా ఓడించిన ప‌తిదార్ సేన‌.. రాణించిన డ‌ఫీ, భువీ, తెవాటియా పోరాటం వృథా
Pawan Kalyan on Godavari River: గోదావరి గలగల కాదు, వెలవెలబోతోంది; పుష్కరాల పనులు, కాలుష్య నివారణపై పవన్ కల్యాణ్‌ డెడ్‌లైన్!
గోదావరి గలగల కాదు, వెలవెలబోతోంది; పుష్కరాల పనులు, కాలుష్య నివారణపై పవన్ కల్యాణ్‌ డెడ్‌లైన్!
Southwest Monsoon Update: నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం.. మరికొన్ని రోజులు ఎండల మంట తప్పదా!
నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం.. మరికొన్ని రోజులు ఎండల మంట తప్పదా!
Bandla Ganesh : బండ్ల గణేష్‌ను చెప్పుతో కొట్టిన ఇండస్ట్రీ పెద్ద ఎవరు? - సీక్రెట్స్ బయటపెట్టిన ప్రొడ్యూసర్
బండ్ల గణేష్‌ను చెప్పుతో కొట్టిన ఇండస్ట్రీ పెద్ద ఎవరు? - సీక్రెట్స్ బయటపెట్టిన ప్రొడ్యూసర్
TMC crisis 2026: మమతా బెనర్జీకి కోలుకోలేని షాక్ - బీజేపీలో విలీనం అయ్యేందుకు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు రెడీ
మమతా బెనర్జీకి కోలుకోలేని షాక్ - బీజేపీలో విలీనం అయ్యేందుకు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు రెడీ
AP PCC Chief Sharmila : వైఎస్, రాజారెడ్డి మహానుభావులు - చనిపోయిన వారిపై నిందలేస్తారా? - టీడీపీ నేతలపై షర్మిల ఆగ్రహం
వైఎస్, రాజారెడ్డి మహానుభావులు - చనిపోయిన వారిపై నిందలేస్తారా? - టీడీపీ నేతలపై షర్మిల ఆగ్రహం
Heatwave In AP and Telangana: వడదెబ్బతో తెలంగాణలో 54 మంది, ఏపీలో 18 మంది మృతి.. చరిత్రలో తొలిసారిగా రెడ్ అలర్ట్
వడదెబ్బతో తెలంగాణలో 54 మంది, ఏపీలో 18 మంది మృతి.. చరిత్రలో తొలిసారిగా రెడ్ అలర్ట్
Bihar police frisked by boy: బీహార్‌లో గ్యాంగ్ స్టర్ ఇంట్లో సోదాలకు పోలీసులు ఎలా వెళ్తారో తెలుసా? - ఈ వీడియో చూస్తే సినిమాల్లో చూపించేది తక్కువే అనుకుంటారు!
బీహార్‌లో గ్యాంగ్ స్టర్ ఇంట్లో సోదాలకు పోలీసులు ఎలా వెళ్తారో తెలుసా? - ఈ వీడియో చూస్తే సినిమాల్లో చూపించేది తక్కువే అనుకుంటారు!
Embed widget