అన్వేషించండి

Rythu Bharosa Scheme: రైతులకు గుడ్‌న్యూస్.. రెండో విడత రైతుభరోసా నిధుల విడుదలపై ప్రకటన

Second Phase of Rythu Bharosa | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 20న కాటారం సభ వేదికగా రెండో విడత రైతుభరోసా నిధులను విడుదల చేయనున్నారు. దాదాపు 45 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది.

Second Phase of Rythu Bharosa: CM Revanth Reddy to Release Funds on April 20
హైదరాబాద్: రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. రైతు భరోసా నిధుల విడుదలపై అప్డేట్ ఇచ్చింది. ఏప్రిల్ 20వ తేదీన రెండో విడత రైతుభరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని స్వయంగా ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా 45,11,947 మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో మొత్తం రూ.5,653 కోట్ల నిధులు జమ కానున్నాయని అధికారులు తెలిపారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే తొలి విడత రైతుభరోసా నిధులను విజయవంతంగా పంపిణీ చేసింది. మార్చి 22న సిద్దిపేట జిల్లా నర్మెటలో జరిగిన బహిరంగ సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొదటి విడత నిధులను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో 1.50 కోట్ల ఎకరాలకు సంబంధించి రూ.3,590 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇప్పుడు రెండో విడత నిధుల విడుదలతో సాగు పెట్టుబడి కోసం ఎదురుచూస్తున్న రైతులకు పెద్ద ఉపశమనం కలగనుంది.

త్వరలో రైతు భరోసా నిధుల విడుదల ప్రక్రియ పూర్తి.. 

మార్చి 22న సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధుల విడుదల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ ప్రభుత్వం రైతు పక్షపాతి అని, సన్న బియ్యానికి రూ.500 బోనస్ ఇచ్చిన ఘనత తమదేనని పేర్కొన్నారు. పెట్టుబడి సాయం కింద తొలి విడతగా 70 లక్షల మంది రైతులకు రూ.3,600 కోట్లు విడుదల చేశామని, ఈ నిధులు రేపటిలోగా రైతుల ఖాతాల్లో జమ అవుతాయని వెల్లడించారు. మిగిలిన రూ.5,400 కోట్లను రెండు విడతలుగా (ప్రతి 20 రోజులకు రూ.2,700 కోట్లు) జమ చేసి, మొత్తం 45 రోజుల్లోగా ఎకరానికి రూ.6,000 చొప్పున మొత్తం రూ.9,000 కోట్ల పంపిణీ ప్రక్రియను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

ఎన్నికల హామీ మేరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకే (DBT) నిధులు చేరుస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలోని లోపాలను సవరించి, అర్హులైన ప్రతి చిన్న, సన్నకారు మరియు కౌలు రైతుకు ఈ సాయం అందేలా పక్కా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. సాగు పనులు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం కోట్లాది మంది రైతులకు పెద్ద ఊరటనిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. నిధుల జమను పర్యవేక్షించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేశారు.

గత ప్రభుత్వంతో పోలిస్తే తమ ప్రభుత్వం రైతుల కోసం రెట్టింపు ఖర్చు చేస్తోందని గణాంకాలను వివరించారు. బీఆర్ఎస్ హయాంలో నెలకు సగటున రూ.2,533 కోట్లు ఖర్చు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు సగటున రూ.5,500 కోట్లు వెచ్చిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ ఉచిత విద్యుత్, రుణమాఫీ, రైతు బీమా, రైతు భరోసా వంటి పథకాలకు వెనకడుగు వేయకుండా ఇప్పటి వరకు రూ.1.30 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేశామని ఆయన వెల్లడించారు.

తెలంగాణ వరి సాగులో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, గత ఏడాది 2.58 కోట్ల మెట్రిక్ టన్నుల దిగుబడి సాధించామని సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రైతులు పంట మార్పిడిపై దృష్టి సారించాలని కోరారు. ముఖ్యంగా మెదక్, నిజామాబాద్ రైతులు గతంలో పసుపు, చెరుకు బాగా పండించేవారని గుర్తు చేస్తూ.. ప్రస్తుతం రాష్ట్రంలో పామాయిల్ సాగు 3 లక్షల ఎకరాలకు చేరిందని, దీనిని 10 లక్షల ఎకరాలకు పెంచినా ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని ఆయన భరోసా ఇచ్చారు.

 

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mulugu District Latest News: ములుగు జిల్లా ఏటూరునాగారంలో 108 సిబ్బంది సమయస్ఫూర్తి- డోలీపై మోసి యువకుడి ప్రాణాలు కాపాడారు!
ములుగు జిల్లా ఏటూరునాగారంలో 108 సిబ్బంది సమయస్ఫూర్తి- డోలీపై మోసి యువకుడి ప్రాణాలు కాపాడారు!
Vikarabad Latest News: యాలాల మండలంలో స్వామీజీ ఆశ్రమంలో గంజాయి సాగు! పట్టుకున్న పోలీసులు!
యాలాల మండలంలో స్వామీజీ ఆశ్రమంలో గంజాయి సాగు! పట్టుకున్న పోలీసులు!
Telangana Cabinet Decisions 2026: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు - ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్.. బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు - ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్.. బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్‌కు గ్రీన్ సిగ్నల్!
Argentina vs Spain World Cup Final Hyderabad: ఫుట్ బాల్ ప్రపంచకప్ ఫైనల్ ఎంజాయ్ చేయాల్సిందే - రాత్రంతా పబ్బులు, హోటళ్లకు తెలంగాణ సర్కార్ అనుమతి !
ఫుట్ బాల్ ప్రపంచకప్ ఫైనల్ ఎంజాయ్ చేయాల్సిందే - రాత్రంతా పబ్బులు, హోటళ్లకు తెలంగాణ సర్కార్ అనుమతి !
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Hydrogen Cars and Buses:హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Allu Sirish Wife Nayanika: గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
Mexico Earthquake 2026: మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
Pallaburusu First Look: 'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
Embed widget