అన్వేషించండి

Committee on Dharani: ధరణిపై ఐదుగురు సభ్యులతో కమిటీ - భూముల్లో అవకతవకలపై ఫోకస్‌

ధరణి పోర్టల్‌పై ఫోకస్‌ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ధరణిలో సమస్యల పరిష్కారానికి ఐదుగురు సభ్యులతో కమిటీ వేసింది.

Committee on Dharani Portal: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ధరణిలో భూ సమస్యల పరిష్కారం దిశగా ముందడుగు వేసింది. ధరణి  పోర్టల్‌(Dharani Portal)లో సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా... ఐదుగురు సభ్యులతో కమిటీ(Five Member Committee)ని నియమించింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ధరణి పేరుతో భూముల రిజిస్ట్రేషన్లలో జరిగిన అవకతవకలను కూడా వెలికితీయనుంది కాంగ్రెస్‌ ప్రభుత్వం. 

ధరణిపై వేసిన కమిటీలో కన్వీనర్‌తోపాటు నలుగురు సభ్యులను నియమించింది. భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌... నవీన్‌ మిత్తల్‌(Naveen Mittal) కన్వీనర్‌గా బాధ్యతలు  నిర్వర్తించనున్నారు. రైతుల సమస్యలపై పట్టున్న కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి(M. Kodanda Reddy), మాజీ ఐఏఎస్, భూ పరిపాలన ప్రధాన  కమిషనర్‌గా పని చేసిన రేమండ్‌ పీటర్‌(Raymond Peter)ను ఈ కమిటీలో సభ్యులుగా స్థానం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. భూ చట్టాల నిపుణుడు, నల్సార్‌ న్యాయ  విశ్వవిద్యాలయం అనుబంధ ఆచార్యుడు సునీల్(Sunil)‌, రెవెన్యూ చట్టాలపై అవగాహన ఉన్న రిటైర్డ్‌ స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ బి.మధుసూదన్‌(B. Madhusudan)ను  కూడా ఈ కమిటీలో నియమించారు. ఈ కమిటీ... ధరణి పోర్టల్లోని సమస్యలను గుర్తించి.. వారికి పరిష్కారాలను కనుగొని ప్రభుత్వానికి నివేదిక అందించాల్సి ఉంది. వీలైనంత  త్వరగా ఈ నివేదిక ఇవ్వాలని.. కమిటీని ఆదేశించింది రేవంత్‌రెడ్డి సర్కార్. రాష్ట్రంలోని భూ సమస్యలకు పరిష్కారం చూపేలా ఈ కమిటీ పనిచేయనుంది.

ధరణి పేరుతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భూములు దోచుకుందని కాంగ్రెస్‌ (Congress) పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది. అధికారంలోకి వస్తే... ధరణిని బంగాళాఖాతం వేస్తామని  పదేపదే ప్రకటించింది. అంతేకాదు... ధరణి స్థానంలో భూమాత(Bhoomatha)ను తీసుకొస్తామని కూడా ఎన్నికల ముందు ప్రకటించింది కాంగ్రెస్‌. ఈ క్రమంలో ముందుగా  ధరణిలో సమస్యలను గుర్తించేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో పేరుకుపోయన భూ సమస్యలకు కారణమైన పోర్టల్‌లో మార్పులు చేర్పులు చేస్తే తప్ప పరిష్కారం  సాధ్యం కాదని, రెవెన్యూ అకారులు కూడా ప్రభుత్వానికి ఇప్పటికే సూచించారు. పోర్టల్‌లో సాంకేతికంగా అనేక సమస్యలు ఉన్నాయని నివేదించారు. దీంతో ధరణి పోర్టల్‌లో  సమస్యలను తొలగించి సరికొత్తగా రూపొందించాలని నిర్ణయించింది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం. ఈ దిశగా ఐదుగురు సభ్యుల కమిటీ పనిచేయనుంది. కమిటీ ఇచ్చే నివేదిక  ప్రకారం... తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

2020 అక్టోబరు 29న ధరణిని ప్రారంభించింది గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. సాగు భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల ప్రక్రియను పోర్టల్‌ ద్వారా నిర్వహిస్తున్నారు. పోర్టల్లో భూముల  ఖాతాలు ఉన్న వారికే పట్టా పాసు పుస్తకాల జారీ చేస్తున్నారు. ధరణి వెలుపల 18 లక్షల మంది వరకు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.  ధరణి పోర్టల్‌తో లక్షల్లో పెండింగ్  సమస్యలు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. వీటన్నింటిపై సమగ్రంగా అధ్యయనం చేసి పోర్టల్‌ను పునర్నిర్మించే బాధ్యతను కమిటీకి అప్పగించింది కాంగ్రెస్‌ ప్రభుత్వం. కొత్త  సమస్యలు తలెత్తకుండా... ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని కనుకోవడంలో భాగంగానే ఈ కమిటీని ప్రభుత్వం వేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ధరణి పోర్టల్‌లో 33  మాడ్యూళ్లను అమల్లోకి తీసుకొచ్చినా... భూముల సమస్యలు పరిష్కారం కాలేదు. అందుకే భూమాత పోర్టల్ తీసుకురావడానికి ముందే... ఉన్న సమస్యలకు పరిష్కరించి..  అవి మళ్లీ తలెత్తకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 

ప్రభుత్వం నియమించిన ఈ ఐదుగురు సభ్యుల కమిటీ జిల్లాల్లో పర్యటించి.. భూ సమస్యలపై అధ్యయనం చేయనుంది. కమిటీకి కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు పూర్తి  స్థాయిలో సహకరించాలని ప్రభుత్వం సూచించింది. భూ సమస్యల మూలాలను కనుగొని... వాటి పరిష్కారాలపై అధ్యయనం చేసి వీలైనంత త్వరగా నివేదిక అందించాలని  ప్రభుత్వం ఆదేశించింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Bhimavaram Beat Song : సంక్రాంతి స్పెషల్ 'భీమవరం బీట్' - సింగర్ స్మితతో RRR స్టెప్పులు... ట్రెండింగ్ లిరిక్స్
సంక్రాంతి స్పెషల్ 'భీమవరం బీట్' - సింగర్ స్మితతో RRR స్టెప్పులు... ట్రెండింగ్ లిరిక్స్
Mobile Bluetooth: ఫోన్ బ్లూటూత్ నిత్యం ఆన్‌లో ఉంటుందా? మీ బ్యాంక్ ఖాతా క్షణాల్లో ఖాళీ అవుతుంది జాగ్రత్త!
ఫోన్ బ్లూటూత్ నిత్యం ఆన్‌లో ఉంటుందా? మీ బ్యాంక్ ఖాతా క్షణాల్లో ఖాళీ అవుతుంది జాగ్రత్త!
Bharat Taxi App: భారత టాక్సీ యాప్ అంటే ఏంటి? రైడ్ బుకింగ్ విధానం, ప్రైస్‌ పూర్తి సమాచారం ఇదే!
భారత టాక్సీ యాప్ అంటే ఏంటి? రైడ్ బుకింగ్ విధానం, ప్రైస్‌ పూర్తి సమాచారం ఇదే!
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
Embed widget