అన్వేషించండి

Committee on Dharani: ధరణిపై ఐదుగురు సభ్యులతో కమిటీ - భూముల్లో అవకతవకలపై ఫోకస్‌

ధరణి పోర్టల్‌పై ఫోకస్‌ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ధరణిలో సమస్యల పరిష్కారానికి ఐదుగురు సభ్యులతో కమిటీ వేసింది.

Committee on Dharani Portal: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ధరణిలో భూ సమస్యల పరిష్కారం దిశగా ముందడుగు వేసింది. ధరణి  పోర్టల్‌(Dharani Portal)లో సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా... ఐదుగురు సభ్యులతో కమిటీ(Five Member Committee)ని నియమించింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ధరణి పేరుతో భూముల రిజిస్ట్రేషన్లలో జరిగిన అవకతవకలను కూడా వెలికితీయనుంది కాంగ్రెస్‌ ప్రభుత్వం. 

ధరణిపై వేసిన కమిటీలో కన్వీనర్‌తోపాటు నలుగురు సభ్యులను నియమించింది. భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌... నవీన్‌ మిత్తల్‌(Naveen Mittal) కన్వీనర్‌గా బాధ్యతలు  నిర్వర్తించనున్నారు. రైతుల సమస్యలపై పట్టున్న కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి(M. Kodanda Reddy), మాజీ ఐఏఎస్, భూ పరిపాలన ప్రధాన  కమిషనర్‌గా పని చేసిన రేమండ్‌ పీటర్‌(Raymond Peter)ను ఈ కమిటీలో సభ్యులుగా స్థానం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. భూ చట్టాల నిపుణుడు, నల్సార్‌ న్యాయ  విశ్వవిద్యాలయం అనుబంధ ఆచార్యుడు సునీల్(Sunil)‌, రెవెన్యూ చట్టాలపై అవగాహన ఉన్న రిటైర్డ్‌ స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ బి.మధుసూదన్‌(B. Madhusudan)ను  కూడా ఈ కమిటీలో నియమించారు. ఈ కమిటీ... ధరణి పోర్టల్లోని సమస్యలను గుర్తించి.. వారికి పరిష్కారాలను కనుగొని ప్రభుత్వానికి నివేదిక అందించాల్సి ఉంది. వీలైనంత  త్వరగా ఈ నివేదిక ఇవ్వాలని.. కమిటీని ఆదేశించింది రేవంత్‌రెడ్డి సర్కార్. రాష్ట్రంలోని భూ సమస్యలకు పరిష్కారం చూపేలా ఈ కమిటీ పనిచేయనుంది.

ధరణి పేరుతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భూములు దోచుకుందని కాంగ్రెస్‌ (Congress) పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది. అధికారంలోకి వస్తే... ధరణిని బంగాళాఖాతం వేస్తామని  పదేపదే ప్రకటించింది. అంతేకాదు... ధరణి స్థానంలో భూమాత(Bhoomatha)ను తీసుకొస్తామని కూడా ఎన్నికల ముందు ప్రకటించింది కాంగ్రెస్‌. ఈ క్రమంలో ముందుగా  ధరణిలో సమస్యలను గుర్తించేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో పేరుకుపోయన భూ సమస్యలకు కారణమైన పోర్టల్‌లో మార్పులు చేర్పులు చేస్తే తప్ప పరిష్కారం  సాధ్యం కాదని, రెవెన్యూ అకారులు కూడా ప్రభుత్వానికి ఇప్పటికే సూచించారు. పోర్టల్‌లో సాంకేతికంగా అనేక సమస్యలు ఉన్నాయని నివేదించారు. దీంతో ధరణి పోర్టల్‌లో  సమస్యలను తొలగించి సరికొత్తగా రూపొందించాలని నిర్ణయించింది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం. ఈ దిశగా ఐదుగురు సభ్యుల కమిటీ పనిచేయనుంది. కమిటీ ఇచ్చే నివేదిక  ప్రకారం... తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

2020 అక్టోబరు 29న ధరణిని ప్రారంభించింది గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. సాగు భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల ప్రక్రియను పోర్టల్‌ ద్వారా నిర్వహిస్తున్నారు. పోర్టల్లో భూముల  ఖాతాలు ఉన్న వారికే పట్టా పాసు పుస్తకాల జారీ చేస్తున్నారు. ధరణి వెలుపల 18 లక్షల మంది వరకు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.  ధరణి పోర్టల్‌తో లక్షల్లో పెండింగ్  సమస్యలు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. వీటన్నింటిపై సమగ్రంగా అధ్యయనం చేసి పోర్టల్‌ను పునర్నిర్మించే బాధ్యతను కమిటీకి అప్పగించింది కాంగ్రెస్‌ ప్రభుత్వం. కొత్త  సమస్యలు తలెత్తకుండా... ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని కనుకోవడంలో భాగంగానే ఈ కమిటీని ప్రభుత్వం వేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ధరణి పోర్టల్‌లో 33  మాడ్యూళ్లను అమల్లోకి తీసుకొచ్చినా... భూముల సమస్యలు పరిష్కారం కాలేదు. అందుకే భూమాత పోర్టల్ తీసుకురావడానికి ముందే... ఉన్న సమస్యలకు పరిష్కరించి..  అవి మళ్లీ తలెత్తకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 

ప్రభుత్వం నియమించిన ఈ ఐదుగురు సభ్యుల కమిటీ జిల్లాల్లో పర్యటించి.. భూ సమస్యలపై అధ్యయనం చేయనుంది. కమిటీకి కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు పూర్తి  స్థాయిలో సహకరించాలని ప్రభుత్వం సూచించింది. భూ సమస్యల మూలాలను కనుగొని... వాటి పరిష్కారాలపై అధ్యయనం చేసి వీలైనంత త్వరగా నివేదిక అందించాలని  ప్రభుత్వం ఆదేశించింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: తుమ్మిడిహెట్టి వివాదంపై చర్చలకు సిద్ధమని మహారాష్ట్ర సీఎంకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖ
తుమ్మిడిహెట్టి వివాదంపై చర్చలకు సిద్ధమని మహారాష్ట్ర సీఎంకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖ
Bandi Bhagirath POCSO Case: పోక్సో కేసులో సీన్ రీ-కన్స్ట్రక్షన్ - బండి భగీరథ్ ను మొయినాబాద్ ఫాంహౌస్‌కు తీసుకెళ్లి పోలీసుల సోదాలు!
పోక్సో కేసులో సీన్ రీ-కన్స్ట్రక్షన్ - బండి భగీరథ్ ను మొయినాబాద్ ఫాంహౌస్‌కు తీసుకెళ్లి పోలీసుల సోదాలు!
Gandhi Bhavan Fight: గాంధీ భవన్‌లో గలాటా - గల్లాలు పట్టుకుని కొట్టుకున్న నేతలు - మంత్రుల ఎదుటే !
గాంధీ భవన్‌లో గలాటా - గల్లాలు పట్టుకుని కొట్టుకున్న నేతలు - మంత్రుల ఎదుటే ! వీడియో
Uppal Real Estate: ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gandhi Bhavan Fight: గాంధీ భవన్‌లో గలాటా - గల్లాలు పట్టుకుని కొట్టుకున్న నేతలు - మంత్రుల ఎదుటే !
గాంధీ భవన్‌లో గలాటా - గల్లాలు పట్టుకుని కొట్టుకున్న నేతలు - మంత్రుల ఎదుటే ! వీడియో
Madhura Sreedhar Reddy: సమస్యల పేరుతో పరువు తీయకండి... సినిమా వర్కవుట్ కాకపోతే వెళ్ళిపోండి - మధుర శ్రీధర్ రెడ్డి
సమస్యల పేరుతో పరువు తీయకండి... సినిమా వర్కవుట్ కాకపోతే వెళ్ళిపోండి - మధుర శ్రీధర్ రెడ్డి
YS Jagan Key Comments: ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
Uppal Real Estate: ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
Pune Porsche Crash Case: పుణె పోర్షే ప్రమాదం కేసులో నిందితులకు బెయిల్ - సంబరాల వీడియోల వైరల్ - బాధితులకు వ్యవస్థలపై నమ్మకం ఎలా?
పుణె పోర్షే ప్రమాదం కేసులో నిందితులకు బెయిల్ - సంబరాల వీడియోల వైరల్ - బాధితులకు వ్యవస్థలపై నమ్మకం ఎలా?
Battery as a Service India: ఈవీ మార్కెట్‌లో కొత్త
ఈవీ మార్కెట్‌లో కొత్త "బాస్‌"! సగం ధరకే విద్యుత్‌ కార్లు! నిజంగానే ఇది సామాన్యుడికి వరమేనా?
ED Raids Kerala: కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
Balakrishna Birthday: బాలయ్య బర్త్ డేకు గిఫ్ట్ రెడీ చేస్తున్న గోపీచంద్ మలినేని
బాలయ్య బర్త్ డేకు గిఫ్ట్ రెడీ చేస్తున్న గోపీచంద్ మలినేని
Embed widget