అన్వేషించండి

Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో

Telangana News | ప్ర‌జా పాల‌నలో ద‌ర‌ఖాస్తులు పరిశీలించి అర్హులైన ఖైదీల వివ‌రాల‌ను ప్రభుత్వం గవర్నర్ ముందు ప్రవేశపెట్టగా ఆయన ఆమోదం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందుకు జీవో విడుదల చేసింది.

Telangana Government grants amnesty for release of prisoners హైద‌రాబాద్‌: తెలంగాణ ప్ర‌భుత్వం 213 మంది ఖైదీల‌కు క్ష‌మాభిక్ష పెట్టింది. దీర్ఘ‌కాలంగా జైళ్ల‌లో మ‌గ్గుతున్న త‌మ కుటుంబ స‌భ్యుల‌ను విడుద‌ల చేయాలని ఖైదీల కుటుంబ స‌భ్యులు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్ర‌జా పాల‌నలో ద‌ర‌ఖాస్తులు అంద‌జేశారు. వారి అభ్యర్థనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి  కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అనుసరించి ఖైదీల ముంద‌స్తు విడుద‌లకు ఉన్న అవ‌కాశాల‌ను ప‌రిశీలించాల‌ని అధికారులను ఆదేశించారు.  

ఖైదీల కుటుంబం చేసుకున్న ప్రజాపాలన ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలించిన అధికారులు, అర్హులైన ఖైదీల వివ‌రాల‌ను హైలెవ‌ల్ క‌మిటీకి సమర్పించారు. హై లెవ‌ల్ క‌మిటీ విడుద‌ల‌కు అర్హులైన ఖైదీల జాబితాను క్యాబినెట్ ముందు ఉంచింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గం ఆ ఖైదీల విడుద‌ల‌కు నిర్ణయం తీసుకుని ఆమోద‌ముద్ర వేసింది. విడుదలకు నిర్ణయించిన ఖైదీల జాబితాకు గ‌వ‌ర్న‌ర్ సీపీ రాధాకృష్ణన్ ఆమోద ముద్ర వేశారు. సీఎం రేవంత్ రెడ్డి సోమవారం నాడు గవర్నర్ ను కలిసి ఈ విషయంపై చర్చించి, ఖైదీల జాబితా అందజేశారు.

గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో ఖైదీల ముంద‌స్తు విడుద‌ల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం (జులై 2న) ఉత్త‌ర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం 213 మంది ఖైదీలు చ‌ర్ల‌పల్లి జైలు నుంచి  బుధ‌వారం జులై 3న విడుద‌ల కానున్నారు. విడుదల కానున్న ఖైదీలలో 205 మంది యావ‌జ్జీవ శిక్ష అనుభవిస్తున్న వారు, 8 మంది త‌క్కువ కాలం శిక్ష‌ప‌డిన వారు ఉన్నారు. ఖైదీలకు జైలులో వివిధ వృత్తులకు సంబంధించిన‌ నైపుణ్యం తెచ్చుకునేందుకు శిక్షణలు ఇచ్చారు. మంచి ప్ర‌వ‌ర్త‌న ద్వారా సమాజంలో తిరిగి అందరికీ క‌లిసిపోవ‌డానికి వారంద‌రికీ కౌన్సెలింగ్ ఇప్పించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Regional Ring Rail Project: హైదరాబాద్‌కు గుడ్ న్యూస్! రీజనల్ రింగ్ రైల్ సర్వేకు గ్రీన్ సిగ్నల్, ఇక పట్టాలెక్కేనా?
హైదరాబాద్‌కు మరో మెగా ప్రాజెక్టు... రీజనల్ రింగ్ రైల్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
MLA Mandula Samelu: తుంగతుర్తి ఎమ్మెల్యే వ్యాఖ్యలతో కాంగ్రెస్‌కు చిక్కులు -సామేలు వివరణ కోరుతామన్న పీసీసీ చీఫ్
తుంగతుర్తి ఎమ్మెల్యే వ్యాఖ్యలతో కాంగ్రెస్‌కు చిక్కులు -సామేలు వివరణ కోరుతామన్న పీసీసీ చీఫ్
Telangana Governor Speech Highlights: హైడ్రా ద్వారా 60 వేల కోట్ల ఆస్తులు కాపాడాం, ఉచిత బస్సుతో మహిళలకు 9 వేల కోట్లు ఆదా: తెలంగాణ గవర్నర్
హైడ్రా ద్వారా 60 వేల కోట్ల ఆస్తులు కాపాడాం, ఉచిత బస్సుతో మహిళలకు 9 వేల కోట్లు ఆదా: తెలంగాణ గవర్నర్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Vizag Semi-ring Road: భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Telangana Rains: తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Oscar 2026 : ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
Tata Nexon లేదా Maruti Brezza .. EMI కట్టడంలో ఏ కారు చౌక? ఈ విషయాలు తెలుసుకోండి
Tata Nexon లేదా Maruti Brezza .. EMI కట్టడంలో ఏ కారు చౌక? ఈ విషయాలు తెలుసుకోండి
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Embed widget