అన్వేషించండి

KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు

Telangana News: 'కుడా' మాస్టర్ ప్లాన్‌ను తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది. అలాగే, మామునూరు విమానాశ్రయానికి అవసరమైన అదనపు భూసేకరణకు రూ.205 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది.

Telangana Government Approved KUDA Master Plan: ఉమ్మడి వరంగల్ జిల్లాకు (Warangal District) ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KUDA) - 2041 మాస్టర్ ప్లాన్‌ను ఆమోదించడం సహా.. మామునూరు విమానాశ్రయానికి (Mamnoor Airport) అవసరమైన అదనపు భూ సేకరణకు రూ.205 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు బృహత్ ప్రణాళికకు సంబంధించి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ జీవో జారీ చేశారు. సర్కారు సోమవారం గెజిట్ సైతం ప్రచురించింది. వరంగల్, కాజీపేట, హనుమకొండ, అలాగే ఈ మూడింటి సమీపాన ఉన్న 181 రెవెన్యూ గ్రామాల్లో కలిపి మొత్తం 1,805 చదరపు కిలోమీటర్లు ఈ మాస్టర్ ప్లాన్ పరిధిగా నిర్ణయించారు.

మామునూరు ఎయిర్‌పోర్టుపై ముందడుగు

అటు, వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయ అభివృద్ధికి చేపట్టనున్న పనుల్లో మరో ముందడుగు పడింది. ఎయిర్‌పోర్టుకు అదనంగా అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు రూ.205 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ఈ ప్రాజెక్టును నిర్వహిస్తుంది.

  • ఇప్పటికే విమానాశ్రయ పరిధిలో 696 ఎకరాల భూమి ఉంది. అయితే, ఏఏఐ ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయనున్న విమానాశ్రయానికి మరో 280.30 ఎకరాల స్థలం అవసరమని గుర్తించింది. ఈ క్రమంలో ప్రభుత్వం 253 ఎకరాలను రైతుల నుంచి సేకరించింది. మిగతాది ప్రభుత్వ భూమి.
  • డెవలప్‌మెంట్ ప్లాన్: ఇన్‌స్ట్రుమెంట్ ఫ్లైట్ రూల్స్ (IFR) సామర్థ్యాలతో A - 320 టైప్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్యకలాపాల కోసం మామునూరు ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఏఏఐ ఓ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ఇందులో అవసరమైన మౌలిక సదుపాయాలు, కార్యాచరణ సౌకర్యాలు ఉన్నాయి. భూసేకరణ ప్రక్రియ కోసం రూ.205 కోట్లు మంజూరు చేయగా కలెక్టర్ ఈ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
  • రాజీవ్ గాంధీ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (RGHIAL) అక్టోబర్ 23, 2024న బోర్డ్ మీటింగ్ సందర్భంగా మామునూరు ఎయిర్‌పోర్ట్ నిర్వహణ కోసం NOC జారీ చేసింది. ఇది ఎలాంటి పరిమితులు లేకుండా అభివృద్ధిని కొనసాగించడానికి అనుమతిస్తుంది. విమానాశ్రయం మౌలిక సదుపాయాలు, కార్యకలాపాలు, నిర్వహణ ఖర్చులను ఏఏఐ భరిస్తుంది.
  • రాష్ట్రంలోని 6 ప్రాంతీయ విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంలో భాగంగా మామునూరు విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాంతంలో ఎయిర్ కనెక్టివిటీని పెంపొందించడానికి భూసేకరణ, నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది వరంగల్ ఆర్థిక, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రధాన ప్రోత్సాహాన్ని అందిస్తుంది. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, సకాలంలో పురోగతి సాధించేందుకు ఏఏఐతో సమన్వయం చేసుకోవాలని జిల్లా కలెక్టర్, వరంగల్‌ను ఆదేశించారు.

కాగా, 'కుడా' మాస్టర్ ప్లాన్‌కు ఆమోదం తెలిపిన క్రమంలో ఆ ప్రాంత పరిధిలో భవన నిర్మాణాలకు అడ్డంకులు తొలగనున్నాయి. ప్రాంతీయ, ఇన్నర్, అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణాలు వేగంగా జరిగేందుకు అవకాశం ఏర్పడింది. చెరువులు, నాలాల పునరుద్ధరణ పనులు సహా భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది. మరోవైపు, జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ డివిజినల్ లెవల్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.26 కోట్లు మంజూరు చేసింది. అలాగే, గ్రేటర్ వరంగల్ పరిపాలన టవర్ల నిర్మాణానికి రూ.32.50 కోట్లు కేటాయించింది.

Also Read: Hyderabad Tourism News: వీకెండ్‌లో రామప్ప, లక్కవరం టూర్‌- తెలంగాణ పర్యాటక శాఖ స్పెషల్ ప్యాకేజీ

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Good news for Telangana government employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Andhra IAS Transfers: ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
Hatao Lungi Bajao Pungi: ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
Telangana Latest News: తెలంగాణలో విద్యార్థులకు ఇచ్చే కిట్‌లపై సీఎం సమీక్ష- కీలక ఆదేశాలు
తెలంగాణలో విద్యార్థులకు ఇచ్చే కిట్‌లపై సీఎం సమీక్ష- కీలక ఆదేశాలు

వీడియోలు

Haimendorf 39th Death Anniversary | ఆదివాసీల ఆత్మబంధువు పేరు భావి తరాలకు నిలిచిపోయేలా చేస్తాం | ABP Desam
Sophie Devine All Rounder Show | DCW vs GGTW మ్యాచ్ లో సోఫీ డివైన్ ఆశ్చర్యపరిచే ప్రదర్శన | ABP Desam
Ind vs NZ First ODI Highlights | మొదటి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం | ABP Desam
Virat Kohli 71st PoTM Award | తన తల్లితో అనుబంధాన్ని, సచిన్ పై ప్రేమను మరో సారి చాటిన కోహ్లీ | ABP Desam
Virat Kohli Reached Second Place | సంగక్కరను దాటేసి...సచిన్ తర్వాతి స్థానంలో విరాట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Good news for Telangana government employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Andhra IAS Transfers: ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
Hatao Lungi Bajao Pungi: ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
Telangana Latest News: తెలంగాణలో విద్యార్థులకు ఇచ్చే కిట్‌లపై సీఎం సమీక్ష- కీలక ఆదేశాలు
తెలంగాణలో విద్యార్థులకు ఇచ్చే కిట్‌లపై సీఎం సమీక్ష- కీలక ఆదేశాలు
Kishan Reddy: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయహోదా సాధ్యం కాదు - ఉపాధి హామీ పథకం బలోపేతం - కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయహోదా సాధ్యం కాదు - ఉపాధి హామీ పథకం బలోపేతం - కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
AP CM Chandrababu: పుష్కరాలలోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి, 25 శాతం విదేశీ పెట్టుబడులు ఏపీకే: సీఎం చంద్రబాబు
పుష్కరాలలోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి, 25 శాతం విదేశీ పెట్టుబడులు ఏపీకే: సీఎం చంద్రబాబు
Guntur Latest News:గుంటూరు జిల్లాలోని రావిపాడు గ్రామ ఆరోగ్య కేంద్రంలో కాలం చెల్లిన మందులు- ఎమ్మెల్యే ఆగ్రహం
గుంటూరు జిల్లాలోని రావిపాడు గ్రామ ఆరోగ్య కేంద్రంలో కాలం చెల్లిన మందులు- ఎమ్మెల్యే ఆగ్రహం
Rapido Driver Selling Ganja: హైదరాబాద్‌లో గంజాయి దందా.. బంజారాహిల్స్‌లో ర్యాపిడో డ్రైవర్ అరెస్ట్, మరోచోట సైతం గంజాయి సీజ్
హైదరాబాద్‌లో గంజాయి దందా.. బంజారాహిల్స్‌లో ర్యాపిడో డ్రైవర్ అరెస్ట్, మరోచోట సైతం గంజాయి సీజ్
Embed widget