అన్వేషించండి

Telangana Elections 2023: 'కాంగ్రెస్ అలా చేస్తే ముక్కు నేలకు రాస్తా' - సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

CM KCR Comments: తెలంగాణలో గత పదేళ్లలో అభివృద్ధిని చూసి ఓటెయ్యాలని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. జనగామలోని చేర్యాలలో ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు.

CM KCR Commnets in Cheryala Praja Ashirwada Sabha: ఎన్నికలు రాగానే ప్రజలు విచక్షణతో ఆలోచించి ఓటెయ్యాలని, రాష్ట్రం తలరాతను మార్చే శక్తి ఒక్క ఓటుకే ఉందని సీఎం కేసీఆర్ (CM KCR) అన్నారు. జనగామ నియోజకవర్గ పరిధిలోని చేర్యాలలో (Cheryala) ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని గమనించాలని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాక ముందు సాగు నీటి, తాగునీటి, కరెంట్ కష్టాలుండేవని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపి 58 ఏళ్లు గోస పెట్టిందని, ఎంతో పోరాటంతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. తాము ఓట్ల కోసం అబద్ధాలు చెప్పమని, 'కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడైనా రూ.2 వేల పింఛన్ ఇస్తున్నారా.?' అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రూ.2 వేలు పింఛన్ ఇస్తున్నట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. పదేళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉండేదో ప్రజలు ఆలోచించుకోవాలని, అభివృద్ధిలో ఇప్పుడు దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని వివరించారు. అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ కు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

'రేవంత్ రెడ్డి కాదు రైఫిల్ రెడ్డి'

రేవంత్ రెడ్డికి ఆయన పార్టీ నేతలే రైఫిల్ రెడ్డి అనే పేరు పెట్టారని, ఆయన రేవంత్ రెడ్డి కాదని, రైఫిల్ రెడ్డి అని సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రేవంత్ రెడ్డి ఉద్యమకారులపై తుపాకులు ఎక్కుపెట్టి తిరిగారని, ఉమ్మడి ఏపీలో ఆంధ్రోళ్ల బూట్లు మోశారని మండిపడ్డారు. ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. '50 ఏళ్లలో కాంగ్రెస్ వాళ్లు ఎన్ని వాగ్ధానాలు చేసి విస్మరించారో మనం చూడలేదా.? రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కల్పించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి రద్దు చేస్తారు. రైతు బంధు తీసేస్తారు.' అని కేసీఆర్ ధ్వజమెత్తారు.

'బీఆర్ఎస్ ను మళ్లీ గెలిపించాలి'

ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలతో తెలంగాణను అభివృద్ధి పథంలో నిలిపామని, మరో పదేళ్లు పాలన ఇలాగే ఉంటే రైతులంతా బాగు పడతారని సీఎం కేసీఆర్ వివరించారు. సంపద పెరిగే కొద్ది సంక్షేమ పథకాలు పెంచుకుంటూ పోతున్నామని అన్నారు. 'మళ్లీ బీఆర్ఎస్ గెలిస్తే పింఛన్లు క్రమంగా రూ.5 వేలకు పెంచుతాం. రాష్ట్రంలో వ్యవసాయాన్ని స్థిరీకరించాలని కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. నీటి తీరువా రద్దు చేశాం. 24 గంటల విద్యుత్ ఇస్తున్నాం. రైతు బంధు ఇస్తున్నాం. రూ.5 లక్షల రైతు బీమా ఇస్తున్నాం. రైతులు పండించిన పంట అంతా గ్రామాల్లోనే కొనుగోలు చేస్తున్నాం. ఇప్పుడిప్పుడే రైతుల ముఖాల్లో చిరునవ్వు చూస్తున్నాం.' అని కేసీఆర్ పేర్కొన్నారు.

'నన్ను చూస్తే వారికి భయం'

రాష్ట్రంలో రైతులకు 24 గటల కరెంట్ ఇస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. కాంగ్రెస్ ఇస్తామన్న 3 గంటల కరెంట్ కావాలో.? 24 గంటల ఉచిత కరెంట్ కావాలో.? ప్రజలు తేల్చుకోవాలని అన్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కూడా 24 గంటల కరెంటు ఇవ్వడం లేదని వెల్లడించారు. తనను చూసి కాంగ్రెస్‌, బీజేపీ భయపడుతున్నాయని, రాష్ట్రానికే పరిమితం చేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణలో తాను గెలిస్తే మహారాష్ట్రకు వెళ్తానని భయపడుతున్నారని, అందుకే బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటయ్యాయని ఆరోపించారు. తెలంగాణలో వ్యవసాయాన్ని పండుగలా మార్చామని, పంజాబ్ ను తలదన్ని 3 కోట్ల ధాన్యం పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే ప్రజలు ఆలోచించి, వివేకంతో బీఆర్ఎస్ కు ఓటెయ్యాలని పిలుపునిచ్చారు.

Also Read: Telangana Elections 2023 : దళిత సీఎం విషయంలో వెనక్కి తగ్గలేదన్న కేసీఆర్ - ఇంకెంత కాలం మోసం చేస్తారని కాంగ్రెస్ ఫైర్ !

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Revanth Reddy: త్వరలో ఒకే స్టేజ్‌ మీదికి చంద్రబాబు, రేవంత్‌! స్పెషల్ ఏంటో తెలుసా?
త్వరలో ఒకే స్టేజ్‌ మీదికి చంద్రబాబు, రేవంత్‌! స్పెషల్ ఏంటో తెలుసా?
Actor Ali: వైసీపీకి అలీ రాజీనామా, ఇక నా దారి ఇదే - వీడియో విడుదల
వైసీపీకి అలీ రాజీనామా, ఇక నా దారి ఇదే - వీడియో విడుదల
Actress Hema: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి హేమ - తన అరెస్ట్‌పై స్పందిస్తూ సెటైరికల్‌ కామెంట్స్‌
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి హేమ - తన అరెస్ట్‌పై స్పందిస్తూ సెటైరికల్‌ కామెంట్స్‌
Fire Accident: షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం - ఆరుగురు మృతి
షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం - ఆరుగురు మృతి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

India vs south Africa T20 World Cup Final | టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో ప్రత్యర్థులుగా పోటా పోటీ జట్లుRohit Sharma on Virat Kohli | T20 World Cup 2024 సెమీఫైనల్ లోనూ ఫెయిల్ అయిన కింగ్ విరాట్ కొహ్లీ |ABPAxar Patel MoM Award Ind vs Eng Semi Final | T20 World Cup 2024లో భారత్ ను ఫైనల్ కి చేర్చిన బాపు|ABPIndia vs England T20 World Cup 2024 Semis 2 | రెండేళ్ల గ్యాప్ లో ఇంగ్లండ్ కు ఇవ్వాల్సింది ఇచ్చేశాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Revanth Reddy: త్వరలో ఒకే స్టేజ్‌ మీదికి చంద్రబాబు, రేవంత్‌! స్పెషల్ ఏంటో తెలుసా?
త్వరలో ఒకే స్టేజ్‌ మీదికి చంద్రబాబు, రేవంత్‌! స్పెషల్ ఏంటో తెలుసా?
Actor Ali: వైసీపీకి అలీ రాజీనామా, ఇక నా దారి ఇదే - వీడియో విడుదల
వైసీపీకి అలీ రాజీనామా, ఇక నా దారి ఇదే - వీడియో విడుదల
Actress Hema: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి హేమ - తన అరెస్ట్‌పై స్పందిస్తూ సెటైరికల్‌ కామెంట్స్‌
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి హేమ - తన అరెస్ట్‌పై స్పందిస్తూ సెటైరికల్‌ కామెంట్స్‌
Fire Accident: షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం - ఆరుగురు మృతి
షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం - ఆరుగురు మృతి
Chandrababu White Paper On Polavaram : రివర్స్ టెండర్ల డ్రామానే పోలవరానికి శాపం - శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు
రివర్స్ టెండర్ల డ్రామానే పోలవరానికి శాపం - శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు
Chevella MLA: బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్! కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే కాలె యాదయ్య
బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్! కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే కాలె యాదయ్య
Harish Rao Meets Kavitha : తీహార్ జైల్లో కవితతో  హరీష్ రావు ములాఖత్ - లిక్కర్ కేసు తాజా పరిణామాలపై చర్చ
తీహార్ జైల్లో కవితతో హరీష్ రావు ములాఖత్ - లిక్కర్ కేసు తాజా పరిణామాలపై చర్చ
AP Government: ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు - ఆ ఉద్యోగులకు నెల అదనపు జీతం, వారికి 5 రోజుల పనిదినాలు ఏడాది పొడిగింపు
ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు - ఆ ఉద్యోగులకు నెల అదనపు జీతం, వారికి 5 రోజుల పనిదినాలు ఏడాది పొడిగింపు
Embed widget